Bumrah : టీమ్ఇండియాలో ‘ఆరు‘ వికెట్ల హీరోలు.. బుమ్రాకు ముందు ఎవరున్నారంటే..?
నిప్పులు చెరిగే బంతులు అంటే ఇవేనేమో అనిపించేలా బౌలింగ్.. భీకరమైన ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. పరుగుల సంగతి పక్కన పెట్టేద్దాం.. కనీసం బంతిని టచ్ చేస్తే ...
ఇంటర్నెట్ డెస్క్: నిప్పులు చెరిగే బంతులు అంటే ఇవేనేమో అనిపించేలా బౌలింగ్.. భీకరమైన ప్రత్యర్థి బ్యాటర్లు హడలెత్తారు. పరుగుల సంగతి పక్కన పెట్టేద్దాం.. కనీసం బంతిని టచ్ చేస్తే చాలు అన్నట్లుగా వారి బ్యాటింగ్ సాగింది.. ఇలాంటి బౌలింగ్ ఇంగ్లాండ్పై టీమ్ఇండియా బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా - షమీ స్పెల్ను చూస్తే తెలుస్తుంది. బుమ్రా అయితే టాప్క్లాస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరఫున బుమ్రా కాకుండా వన్డేల్లో నలుగురు మాత్రమే ఆరు వికెట్ల ప్రదర్శన చేశారు. అందులో మరి ఆ ‘నలుగురు’ ఎవరనేది తెలుసుకుందాం..
ఇంగ్లాండ్పై టీ20 సిరీస్ను కైవసం చేసుకొని ఊపులో ఉన్న భారత్.. వన్డే సిరీస్లోనూ శుభారంభం చేసింది. మూడు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన మొదటి మ్యాచ్లో భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అద్భుతమైన బౌలింగ్ (6/19)తో ఇంగ్లాండ్ 110 పరుగులకే కుప్పకూలడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. ఇదే అతడి కెరీర్లో అత్యుత్తమ గణాంకాలు కావడం విశేషం. అంతేకాకుండా ఐదు వికెట్లు అంతకంటే ఎక్కువ ప్రదర్శన చేయడం బుమ్రాకిది ఇది రెండోసారి మాత్రమే. ఇందులోనూ నలుగురు బ్యాటర్లు క్లీన్బౌల్డ్ కావడం విశేషం. ఈ మ్యాచ్లో అన్ని వికెట్లను పేసర్లే పడగొట్టారు. వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన మూడో బౌలర్గా బుమ్రా ఘనత సాధించాడు.
తొలి స్థానం స్టువర్ట్ బిన్నీదే
(ఫొటో సోర్స్: స్టువర్ట్ బిన్నీ ట్విటర్)
టీమ్ఇండియా తరఫున ఆడింది తక్కువ మ్యాచ్లు అయినా.. తనకంటూ ఓ రికార్డును సృష్టించుకున్నాడు స్టువర్ట్ బిన్నీ. అలనాటి క్రికెటర్ రోజర్ బిన్నీ కుమారుడు అయినప్పటికీ అవకాశాలు అంత తేలిగ్గా రాలేదు. అయితే వచ్చిన అవకాశాలను మాత్రం బాగానే ఒడిసి పట్టుకున్నా.. ఆ తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ఈ క్రమంలో భారత వన్డే క్రికెట్ చరిత్రలో తక్కువ పరుగులకే ఆరు వికెట్ల తీసిన బౌలర్గా స్టువర్ట్ బిన్నీ రికార్డుకెక్కాడు. 2014లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో బిన్నీ కేవలం నాలుగు పరుగులకే ఆరు వికెట్లు పడగొట్టి సంచలనం సృష్టించాడు. ఇదే ఇప్పటి వరకు రికార్డుగా కొనసాగుతోంది. అత్యల్ప స్కోర్లు నమోదైన మ్యాచ్లో స్టువర్ట్ ప్రదర్శనతోనే భారత్ విజయంతో గట్టెక్కడం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 105 పరుగులకే ఆలౌటైంది. అయితే స్టువర్ట్ బిన్నీ (4/6) దెబ్బకు బంగ్లాదేశ్ కేవలం 58 పరుగులకే కుప్పకూలింది. బిన్నీ రికార్డును చెరపడం కష్టమే.
దిగ్గజ స్పిన్నర్ కుంబ్లే దెబ్బకు..
భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే సాధించిన రికార్డులు కోకొల్లలు. అందులో వన్డే కెరీర్లోనూ ఓ ఘనతను తన ఖాతాలో వేసుకొన్నాడు. వన్డేల్లో బిన్నీ (4/6) ప్రదర్శన చేసేవరకు అనిల్ కుంబ్లే (6/12) గణాంకాలే అత్యుత్తమం. 1993లోనే కుంబ్లే వెస్టిండీస్ మీద సూపర్ స్పెల్ వేశాడు. భీకర ఆటగాళ్లున్న విండీస్ ఆట కట్టించడంలో కుంబ్లే కీలక పాత్ర పోషించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. అనంతరం విండీస్ 123 పరుగులకే కుప్పకూలింది. టాప్ ఆర్డర్ మినహా ఇతర బ్యాటర్లను కుంబ్లే చుట్టేయడంతో విండీస్పై భారత్ 102 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు దేశాలు (భారత్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, జింబాబ్వే) పాల్గొన్న కప్ ఫైనల్ మ్యాచ్లో అనిల్ కుంబ్లే అద్భుత స్పెల్తో టీమ్ఇండియా చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసింది.
వరల్డ్ కప్ మ్యాచ్లో..
వన్డే ప్రపంచకప్లో ప్రతి మ్యాచూ కీలకమే. వరుస విజయాలతో భారత్ 2003 ప్రపంచకప్ ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే అక్కడ ఆసీస్ చేతిలో పరాభవం తప్పలేదు. రన్నరప్గా టోర్నీని ముగించింది. ఈ మెగా టోర్నమెంట్లో సచిన్ ఫైనల్ మినహా ఆద్యంతం అత్యంత నిలకడగా రాణించాడు. అదే విధంగా బౌలింగ్లో జహీర్ ఖాన్, అశిశ్ నెహ్రా సూపర్ బౌలింగ్ వేశారు. ఈ క్రమంలో ఆశిశ్ నెహ్రా వన్డే చరిత్రలో తన పేరిట ఓ రికార్డును నమోదు చేసుకొన్నాడు. లీగ్ దశలో ఇంగ్లాండ్పై 6/23 స్పెల్తో చెలరేగాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 168 పరుగులకే ఆలౌటైంది. ఆశిశ్ నెహ్రా స్వల్ప విరామాల్లో వికెట్లు పడగొట్టి టీమ్ఇండియాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. నెహ్రాతోపాటు జహీర్ ఖాన్ (2/29), జవగల్ శ్రీనాథ్ (1/37) తోడ్పాటు అందించడంతో ఇంగ్లాండ్ కుప్పకూలింది. రనౌట్ మినహా అన్ని వికెట్లను పేసర్లే తీయడం విశేషం.
ఇంగ్లాండ్పైనే కుల్దీప్ యాదవ్
లెఫ్ట్ఆర్మ్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (6/25) కూడా ఆరు వికెట్ల ప్రదర్శన చేశాడు. అదీనూ ఇంగ్లాండ్పైనే కావడం విశేషం. 2018లో ఇంగ్లాండ్పై జరిగిన మ్యాచ్లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 268 పరుగులకు ఆలౌటైంది. అనంతరం లక్ష్య ఛేదనలో భారత్ కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 40.1 ఓవర్లలో 269 పరుగులు చేసి గెలుపొందింది. పేస్కు అనుకూలించే పిచ్పై కుల్దీప్ సంచనల స్పెల్ వేశాడు. 10 ఓవర్లు వేసిన కుల్దీప్ ఆరు వికెట్లు తీసి 25 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!