Wriddhiman Saha : మరే ఆటగాడు బెదిరింపులకు గురి కాకూడదు : సాహాకు మద్దతుగా నిలిచిన ఐసీఏ
టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) మద్దతుగా నిలిచింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాను బెదిరిస్తూ ఓ పాత్రికేయుడు చేసిన..
ఇంటర్నెట్ డెస్క్ : టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ఇండియన్ క్రికెటర్స్ అసోసియేషన్ (ఐసీఏ) మద్దతుగా నిలిచింది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాను బెదిరిస్తూ ఓ పాత్రికేయుడు చేసిన సందేశాన్ని ఖండించింది. ఈ విషయంపై సమగ్ర దర్యాప్తు చేస్తామని బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఐసీఏ స్వాగతించింది.
‘ఆటగాళ్ల ఎదుగుదలలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందనే వాస్తవాన్ని మేం అంగీకరిస్తున్నాం. కానీ, హద్దు దాటి వ్యవహరించకూడదు. సాహా విషయంలో జరిగింది ఏ మాత్రం ఆమోదయోగ్యం కాదు. సంబంధిత మీడియా యాజమాన్యం ఈ విషయంపై స్పందించి మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరుతున్నాం’ అని ఐసీఏ అధ్యక్షుడు అశోక్ మల్హోత్రా పేర్కొన్నాడు.
‘వృద్దిమాన్ సాహాకు మేమంతా మద్దతు తెలుపుతున్నాం. మీడియా నుంచి మరే ఆటగాడు ఇలాంటి బెదిరింపులకు గురి కాకూడదు. ఈ విషయంలో మిగతా మీడియా సంస్థలు కూడా సాహాకు మద్దతుగా నిలవాలి. మరోసారి ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలి. మీడియా, ఆటగాళ్ల మధ్య జరిగే ఏ సంభాషణ అయినా స్వచ్ఛందంగా ఉండాలి’ అని ఐసీఏ కార్యదర్శి హితేశ్ మజుందార్ అన్నారు. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు ఓ పాత్రికేయుడు సాహాను బెదిరిస్తూ సందేశం పంపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ లాంటి పలువురు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.