FIFA: ఫుట్బాల్ సమాఖ్యపై నిషేధం.. తాష్కెంట్లో చిక్కుకుపోయిన 23సభ్యుల మహిళల బృందం
ఉజ్బెకిస్థాన్ క్లబ్ సొగ్డియానా-డబ్లూతో తలపడేందుకు వెళ్లిన భారత మహిళల లీగ్ ఛాంపియన్ గోకులం కేరళ జట్టు నిషేధం కారణంగా తాష్కెంట్లో చిక్కుకుపోయింది.........
ఇంటర్నెట్ డెస్క్: భారత ఫుట్బాల్ సమాఖ్య(ఏఐఎఫ్ఎఫ్)పై నిషేధం విధిస్తూ అంతర్జాతీయ ఫుట్బాల్ సమాఖ్య(ఫిఫా) బాంబు వేసిన సంగతి తెలిసిందే. దీంతో భారత ఫుట్బాల్ క్రీడాకారులు అంతర్జాతీయ వేదికలపై ఆడేందుకు వీల్లేకుండా పోయింది. అయితే ఈ నెల 23న ఉజ్బెకిస్థాన్ క్లబ్ సొగ్డియానా-డబ్ల్యూతో తలపడేందుకు వెళ్లిన భారత మహిళల లీగ్ ఛాంపియన్ గోకులం కేరళ జట్టు అక్కడే ఉండిపోయింది. నిషేధం కారణంగా ఈ జట్టు ఆ మ్యాచ్లో పాల్గొనే వీల్లేదు. దీంతో తమ పరిస్థితిపై తక్షణ జోక్యం చేసుకోవాలంటూ ప్రధాని మోదీ, క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ను ఆ జట్టు సభ్యులు ట్విటర్ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు.
గోకులం కేరళ ఎఫ్సికి చెందిన 23 మంది మహిళా జట్టు సభ్యులమంతా ఇప్పుడు తాష్కెంట్లో చిక్కుకుపోయామని, తమ భవితవ్యాన్ని తేల్చాలంటూ ట్విటర్లో ఓ లేఖ రాశారు. ప్రధాని మోదీ, ట్యాగ్ చేశారు. ‘మా జట్టు కోలికోడ్ నుంచి ఈనెల 16వ తేదీనే ఉజ్బెకిస్థాన్లోని తాష్కెంట్కు చేరుకుంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా నిషేధం విధించిన సంగతి తెలిసింది. ఈ నిషేధం కారణంగా ఈ మ్యాచ్లో మేం పాల్గొనేందుకు అనుమతి లేకుండా పోయింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలి. ఫిఫా నిషేధాన్ని ఉపసంహరించుకోవడానికి, ఏఎఫ్సీ ఉమెన్స్ క్లబ్ ఛాంపియన్షిప్లో మమ్మల్ని ఛాంపియన్ క్లబ్ ఆఫ్ ఇండియాగా చేర్చడానికి అన్ని ప్రయత్నాలు చేయాలని ప్రధాని కార్యాలయ్యాన్ని అభ్యర్థిస్తున్నాము’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.
అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్యపై నిషేధం విధిస్తున్నట్లు ఫిఫా మంగళవారం ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్ను ప్రస్తుతానికి భారత్లో నిర్వహించడం లేదని వెల్లడించింది. 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్ఎఫ్పై నిషేధం పడడం ఇదే తొలిసారి. ఏఐఎఫ్ఎఫ్లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది.
విచారించిన సుప్రీం.. జోక్యం చేసుకోవాలంటూ కేంద్రానికి సూచన
ఈ నిషేధానికి సంబంధించిన అంశాన్ని భారత ఉన్నత న్యాయస్థానం బుధవారం విచారించింది. ఏఐఎఫ్ఎఫ్పై ఫిఫా విధించిన సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ సస్పెన్షన్పై ప్రభుత్వం ఇప్పటికే ఫిఫాతో చర్చలు జరిపిందని కేంద్రం తరఫున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. భారత్లో అండర్-17 ప్రపంచ కప్ను నిర్వహించేందుకు, ఏఐఎఫ్ఎఫ్పై సస్పెన్షన్ను ఎత్తివేసేందుకు కేంద్రం ప్రో యాక్టివ్ పాత్రను పోషించాలని సుప్రీం కోర్టు పేర్కొంది. ప్రపంచకప్ భారత్లో జరిగితే అది దేశానికి మేలు చేస్తుందని అభిప్రాయపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
ఐపీఎల్ 2024లో బెంగళూరు వరుస ఆరు ఓటముల తర్వాత రెండో విజయం సాధించింది. హైదరాబాద్ను 35 పరుగుల తేడాతో ఆ జట్టు ఓడించింది. -
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
ముంబయి ఇండియన్స్ జట్టు గురించి తాను మాట్లాడిన మాటలు వక్రీకరణకు గురికావడం వల్లే సోషల్ మీడియాలో వైరల్గా మారినట్లు అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. -
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
మరికొన్ని రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడించారు. -
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా