CWG 2022: మేం రజతం గెలవలేదు.. స్వర్ణం కోల్పోయాం: శ్రీజేశ్
కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు రజతం గెలవలేదని, స్వర్ణం కోల్పోయిందని సీనియర్ ఆటగాడు, గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. గతరాత్రి జరిగిన తుదిపోరులో టీమ్ఇండియా 0-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమయ్యాక...
బర్మింగ్హామ్: కామన్వెల్త్ క్రీడల్లో భారత హాకీ జట్టు రజతం గెలవలేదని, స్వర్ణం కోల్పోయిందని సీనియర్ ఆటగాడు, గోల్కీపర్ పీఆర్ శ్రీజేశ్ అన్నాడు. గతరాత్రి జరిగిన తుదిపోరులో టీమ్ఇండియా 0-7 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఘోరంగా విఫలమయ్యాక అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు. కామన్వెల్త్ క్రీడలు ప్రారంభమైనప్పటి నాటి నుంచి ఆసీస్ వరుసగా ఏడుసార్లు ఛాంపియన్గా నిలిచింది. అందులో భారత్ మూడుసార్లు ఫైనల్కు చేరి ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలోనే చివరిసారి కామన్వెల్త్ క్రీడల్లో ఆడుతున్న భారత గోల్కీపర్ శ్రీజేశ్.. ఫైనల్స్లో ఆడటం సంతోషంగా ఉన్నా.. విజేతగా నిలవలేకపోవడం బాధగా ఉందన్నాడు.
‘మేం ఈసారి రజతం గెలవలేదు. పసిడి కోల్పోయాం. ఇది నిరాశ కలిగించే విషయమే అయినా ప్రతిష్ఠాత్మకమైన కామన్వెల్త్ క్రీడల్లో ఫైనల్స్కు చేరడం గొప్ప విశేషం. జట్టులో అందరికన్నా సీనియర్ అయిన నాకు కామన్వెల్త్ క్రీడల్లో తుదిపోరులో ఓటమిపాలవ్వడం ఇది నాకు రెండోసారి. ఈ విషయం జీర్ణించుకోవడం కాస్త కష్టమే అయినా.. యువ ఆటగాళ్లకు ఇది మంచి అనుభవంగా పనికొస్తుంది’ అని చెప్పుకొచ్చాడు. కాగా మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని టీమ్ఇండియా జట్టు గ్రూప్ స్టేజ్లో అత్యుత్తమ ప్రదర్శన చేసింది. ఈ క్రమంలోనే సెమీస్లో దక్షిణాఫ్రికాను 3-2తో ఓడించి ఫైనల్స్లో పసిడిని తీసుకొచ్చేలా కనిపించింది. కానీ, కొలిన్ బాచ్ నేతృత్వంలోని ఆస్ట్రేలియా తుదిపోరులో భారత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. దీంతో భారత్ రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త కెప్టెన్.. కోటి ఆశలతో
2013లో ఐపీఎల్ అరంగేట్రం.. 2016లో ఛాంపియన్. స్టార్ ఆటగాళ్లతో ఒకప్పుడు కళకళలాడిన జట్టు. కానీ ఆ తర్వాత తడబాటు. ఒడుదొడుకుల ప్రయాణం. -
నా భుజాలపై రోహిత్ చేతులేసి..
జట్టు కెప్టెన్గా రోహిత్ లేనంత మాత్రాన ఏమీ మారదని, తన భుజాలపై చేతులేసి అతను నడిపిస్తాడని ముంబయి ఇండియన్స్ కొత్త సారథి హార్దిక్ పాండ్య అన్నాడు. -
కోహ్లి ముఖంలో ఆనందం చూశా
డబ్ల్యూపీఎల్ రెండో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజేతగా నిలిచిన తర్వాత విరాట్ కోహ్లి ముఖంలో ఆనందం చూశానని కెప్టెన్ స్మృతి మంధాన వెల్లడించింది. -
సబ్స్టిట్యూట్గా వచ్చి గెలిపించాడు
శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ను బంగ్లాదేశ్ 2-1తో కైవసం చేసుకుంది. కంకషన్ సబ్స్టిట్యూట్గా వచ్చిన తంజిద్ హసన్ (84; 81 బంతుల్లో 9×4, 4×6) మెరుపులు మెరిపించడంతో సోమవారం ఆఖరిదైన మూడో వన్డేలో బంగ్లా 4 వికెట్ల తేడాతో నెగ్గింది. -
ఐపీఎల్ ఆరంభంలో పంత్కు కష్టమే
రోడ్డు ప్రమాదంలో గాయపడి 15 నెలల విరామం తర్వాత మైదానంలో అడుగు పెడుతున్న రిషబ్ పంత్కు.. ఈ ఐపీఎల్ ఆరంభంలో ఇబ్బందులు తప్పవని దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అభిప్రాయపడ్డాడు. -
ప్రపంచ రికార్డుతో అఖిల్కు పసిడి
భారత షూటర్ అఖిల్ షెరోన్ అదరగొట్టాడు. ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానం గెలిచిన అతను.. తాజాగా పోలిష్ గ్రాండ్ ప్రి పోటీల్లో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. -
శ్రేయస్ ఫిట్టే కానీ..
కోల్కతా నైట్రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఐపీఎల్లో ఆడేందుకు ఫిట్నెస్తో ఉన్నట్లుగా బీసీసీఐ నిర్ధరించినట్లు తెలుస్తోంది. -
‘లక్ష్య’ జ్యోతికకు కాంస్యం
ఇండియా ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారిణి దండి జ్యోతిక శ్రీ (ఆంధ్రప్రదేశ్) సత్తాచాటింది. -
బెంగళూరు జట్టుతో విరాట్
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఐపీఎల్ సన్నాహాలు మొదలుపెట్టాడు. -
కోహ్లీతో బ్యాటింగ్ అంటే..
కోహ్లితో కలిసి బ్యాటింగ్ చేయడం నమ్మశక్యం కాని అనుభూతి అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ డుప్లెసిస్ తెలిపాడు. -
అప్పుడే ఆటను వదిలేద్దామనుకున్నా..
క్రికెట్కు 2017లోనే ఆటకు వీడ్కోలు చెబుదామని అనుకున్నట్లు భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తెలిపాడు. -
సర్ఫరాజ్, జురెల్లకు బీసీసీఐ కాంట్రాక్టులు
భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్, వికెట్కీపర్ ధ్రువ్ జురెల్కు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించాయి. గ్రూప్-సిలో ఉన్న ఈ ఆటగాళ్లు ఫీజు కింద ఏడాదికి కోటి రూపాయలు పొందుతారు.
తాజా వార్తలు (Latest News)
-
cVIGIL: మీరు గానీ విజిలేస్తే.. మడతెట్టేస్తారు!
-
Proddatur: ఇద్దరు వైకాపా నేతలపై కేసులు.. ప్రొద్దుటూరులో చీరల పంపిణీ వ్యవహారంపై చర్యలు
-
సర్కార్ సొమ్ము కోసం అన్నాచెల్లెళ్ల పెళ్లి
-
HYD News: బుద్వేల్, మోకిల లేఅవుట్లకు మోక్షం
-
ప్రధాని సభలో ఆ ముగ్గురు ఎస్పీలు ఏమైనట్లు?
-
TS News: త్వరలో మరో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి