Kampala Blasts: కంపాలాలో పేలుళ్లు.. భారత పారా బ్యాడ్మింటన్ ప్లేయర్లు సురక్షితం
ఉగాండా పారా బాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొనడానికి ఆ దేశ రాజధాని కంపాలాకు చేరుకున్న భారత క్రీడాకారులు వరుస బాంబుల పేలుళ్లతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉగాండా పారా బాడ్మింటన్ ఇంటర్నేషనల్ టోర్నీలో పాల్గొనడానికి ఆ దేశ రాజధాని కంపాలాకు చేరుకున్న భారత క్రీడాకారులు వరుస బాంబుల పేలుళ్లతో ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. అయితే ఈఘటనలో ఎవరికీ ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ‘‘మన క్రీడాకారులకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదని, అంతా సురక్షితంగా ఉన్నట్లు’’ కోచ్ గౌరవ్ ఖన్నా తెలిపారు. టోర్నమెంట్ను పూర్తి చేసుకుని వస్తామని స్పష్టం చేశారు. క్రీడాకారులకు కేటాయించిన హోటల్కు కేవలం 100 మీటర్ల దూరంలో పేలుళ్లు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు చనిపోయినట్లు అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు ఆత్మాహుతి దళ సభ్యులు తమని తాము పేల్చుకున్నట్లు అధికారులు తెలిపారు. పేలుళ్ల అనంతరం భయాందోళనకు గురైన ప్రజలు ఒక్కసారిగా పరుగులు పెట్టారు.
‘‘బ్యాడ్మింటన్ పోటీల కోసం స్టేడియం వెళ్లేందుకు బస్సు సిద్ధం అవుతున్న సమయంలో మాకు ఒక్కసారిగా పేలుడు శబ్దం వినిపించింది. మా హోటల్ ఎదురు వీధిలోనే జరిగినట్లు అనిపించింది. అదే క్రమంలో ఒకసారికంటే ఎక్కువమార్లు పేలుళ్లు జరిగాయి. వెంటనే మేమంతా హోటల్ గదికి వెళ్లిపోయాం. కొద్దిసేపు ఆటగాళ్లు భయపడ్డారు’’ అని కోచ్ గౌరవ్ ఖన్నా తెలిపారు. ప్రస్తుతం అందరం సురక్షితంగా ఉన్నట్లు, ఎలాంటి ఇబ్బంది లేదని కోచ్ తెలిపారు. పారా ఒలింపిక్ ఛాంపియన్ ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్, మానసి జోషి, సుకాంత్ కాదమ్ బృందం టోర్నమెంట్ కోసం కంపాలా వెళ్లింది. ‘‘ప్రతి ఒక్కరం సురక్షితంగా ఉన్నాం. ఎలాంటి ఒత్తిడి లేదు. ఇప్పుడు అంతా సాధారణ స్థితికి వచ్చేసింది. కాస్త దూరంలో జరిగింది. అయినా హోటల్ వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు’’ అని ప్రమోద్ భగత్ పేర్కొన్నాడు. ప్రమోద్ భగత్, సుకాంత్ కాదమ్ తొలి రోజు ఆట షెడ్యూల్ లేదు. ఘటన జరిగినప్పుడు వీరిద్దరూ హోటల్ గదిలోనే ఉన్నారు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
టీమ్ఇండియా మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బంతిని ఎంత బలంగా బాదుతాడో.. మాటల తూటానూ అలాగే పేలుస్తాడు. -
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
టెస్టు క్రికెట్లో అద్భుతాలు సృష్టించిన అనిల్ కుంబ్లేను తొలి ఐపీఎల్ వేలంలో బెంగళూరు దక్కించుకుంది. ఆ సమయంలో చోటుచేసుకున్న పరిణామాలను తాజాగా కుంబ్లే వెల్లడించాడు. -
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
జింబాబ్వే మాజీ క్రికెటర్పై చిరుత దాడి చేసింది. దీంతో పెంపుడు శునకం ఆయనను రక్షించింది. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?