Womens Cricket : మూడుసార్లు ఆతిథ్యం.. రెండుసార్లు ఫైనల్కు... ఒక్క కప్పూ దక్కకపాయె!
పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళా క్రికెట్కు ఆదరణ, ఆదాయం తక్కువే. అయితే గత కొంతకాలంగా...
మహిళల వన్డే ప్రపంచకప్ పోటీల్లో భారత్ పరిస్థితి ఇదీ..
ఇంటర్నెట్ డెస్క్: పురుషుల క్రికెట్తో పోలిస్తే మహిళా క్రికెట్కు ఆదరణ, ఆదాయం తక్కువే. అయితే గత కొంతకాలంగా ఉమెన్స్ క్రికెట్కూ ప్రేక్షకుల అభిమానం పెరుగుతోంది. దాదాపు యాభై ఏళ్ల కిందట 1973లో తొలిసారి మహిళల కోసం ప్రపంచకప్ పోటీలు జరిగాయి. అయితే అప్పుడు వాటిని వరల్డ్ ఛాంపియన్షిప్గా పిలిచేవారు. తర్వాత ప్రపంచకప్గా నామకరణం చేశారు. ఇప్పుడు మరోసారి న్యూజిలాండ్ వేదికగా ప్రపంచకప్ పోటీలు ప్రారంభం అయ్యాయి. అసలు ఇప్పటి వరకు ఎన్ని టైటిళ్లు జరిగాయి.. ఏ జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది.. అలానే మన టీమ్ఇండియా పరిస్థితేంటో తెలుసుకుందాం..
1973 నుంచి 2005 వరకు అంతర్జాతీయ మహిళల క్రికెట్ మండలి (ఐడబ్ల్యూసీసీ) ప్రపంచకప్ పోటీలను నిర్వహించింది. 2005లో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో ఐడబ్ల్యూసీసీ విలీనం జరిగింది. ఇక అప్పటి నుంచి ఐసీసీనే వరల్డ్ కప్ నిర్వహణ బాధ్యతలను చేపట్టింది. సాధారణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకు ప్రపంచకప్ మ్యాచ్లు జరగాలి. అయితే కొన్ని దేశాలు తమ జట్లను పంపకపోవడం, నిధులకు సంబంధించి ఇబ్బందులతో ఒక్కోసారి ఆరు, ఏడు సంవత్సరాలకూ నిర్వహించిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పటివరకు 11 ప్రపంచకప్లు మాత్రమే జరిగాయి. ఇందులోనూ ఆస్ట్రేలియానే ఆధిపత్యం ప్రదర్శించింది. అన్ని జట్ల కంటే ఆసీస్ ఆరుసార్లు కప్ను దక్కించుకుంది. తర్వాత ఇంగ్లాండ్ 4, న్యూజిలాండ్ ఒకసారి కప్ను సొంతం చేసుకున్నాయి. మార్చి 4 (శుక్రవారం) నుంచి న్యూజిలాండ్ వేదికగా పన్నెండో ప్రపంచకప్ మొదలైంది.
టీమ్ఇండియా పరిస్థితి ఇదీ..
పురుషుల వన్డే ప్రపంచకప్ను రెండుసార్లు ముద్దాడిన భారత్కు.. మహిళల వరల్డ్ కప్ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. మూడుసార్లు (1978, 1997, 2013) టీమ్ఇండియా ఆతిథ్యం ఇవ్వగా ఒక్క టైటిల్ను నెగ్గలేకపోవడం గమనార్హం. రెండు సార్లు (2005, 2017) మాత్రం టీమ్ఇండియా ఫైనల్కు చేరుకున్నప్పటికీ ఓటమిపాలైంది. దీంతో కప్ నెగ్గాలనే కోరిక అలానే మిగిలిపోయింది. ఇప్పటి వరకు తొమ్మిది ప్రపంచకప్లను ఆడిన మహిళల జట్టు రెండు సార్లు ఫైనల్కు, రెండు మార్లు సెమీస్కు చేరుకుంది. మిగిలిన అన్ని ప్రపంచకప్ పోటీల్లో గ్రూప్ స్టేజ్కే పరిమితమైంది.
ఈసారైనా కప్ నెగ్గేనా..?
భారత నారీమణులు ఈసారైనా కప్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు. వన్డే ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో ఉన్న టీమ్ఇండియా ప్రస్తుతం న్యూజిలాండ్లోనే ఉంది. కివీస్తో ఐదు వన్డేల సిరీస్ను 4-1 తేడాతో భారత్ చేజార్చుకుంది. వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడిన టీమ్ఇండియా ఆఖరి మ్యాచ్లో మాత్రం అద్భుత విజయం సాధించి.. ప్రపంచకప్నకు ముందు కాస్త ఆత్మవిశ్వాసం కూడగట్టుకుంది. అయితే బౌలర్లు, బ్యాటర్ల నిలకడలేమి ప్రదర్శనతో ఇబ్బంది పడుతోంది. బౌలింగ్లో విభిన్న కూర్పులను ప్రయత్నిస్తున్నట్లు కెప్టెన్ మిథాలీరాజ్ చెప్పింది. అలానే బౌలింగ్ దాడి కాస్త ఆందోళన కలిగిస్తోందని పేర్కొంది. వన్డే ప్రపంచకప్లో పాకిస్థాన్తో మార్చి 6న టీమ్ఇండియా తొలి మ్యాచ్ ఆడనుంది. మరి మెగా టోర్నీలో కుదురుకుని ఎలా ఆడుతుందో వేచి చూడాల్సిందే.
టీమ్ఇండియా మహిళల జట్టు:
మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్ ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతీ మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్నేహ్ రానా, జులన్ గోస్వామి, జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, మేఘ్న సింగ్, రేణుక సింగ్ ఠాకూర్, తానియా భాటియా (వికెట్ కీపర్), రాజేశ్వరి గైక్వాడ్, పూనమ్ యాదవ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
-
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM