IND vs SA : భారత ఆటగాళ్లకు ఈ ఓటమి.. ఓ పీడకలగా మిగిలిపోయింది : సునీల్‌ గావస్కర్‌

దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమ్‌ఇండియాకు మరోసారి నిరాశే ఎదురైందని క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను...

Published : 15 Jan 2022 12:53 IST

ఇంటర్నెట్ డెస్క్‌ : దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమ్‌ఇండియాకు మరోసారి నిరాశే ఎదురైందని క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్‌ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోవడంతో.. భారత ఆటగాళ్లకు అది పీడకలగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు.    

మూడో టెస్టు ఓటమి అనంతరం టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది’ అని చెప్పాడు. కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ స్పందించారు. ‘సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో భారత్‌ ఘన విజయం సాధించడంతో‌.. సిరీస్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేస్తుందనుకున్నాను. అయితే, చివరి రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికా గొప్పగా పుంజుకుంది. ఆ రెండు టెస్టుల్లో టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు అయ్యిందంటే.. భారత్‌ ఎంత పేలవంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు’ అని గావస్కర్‌ పేర్కొన్నాడు.

దక్షిణాఫ్రికాతో సిరీస్‌ ఆరంభానికి ముందు అందరూ టీమ్ఇండియానే ఫేవరెట్ అని భావించారు. ఎందుకంటే, భారత జట్టుతో పోల్చుకుంటే దక్షిణాఫ్రికాలో దాదాపు అంతా కొత్త ఆటగాళ్లే. ఆ జట్టు ప్రధాన బౌలర్ అన్రిచ్ నార్జ్‌ గాయం కారణంగా టెస్టు సిరీస్‌కు దూరం కావడం, మొదటి టెస్టు తర్వాత సీనియర్‌ ఆటగాడు క్వింటన్‌ డికాక్‌ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలకడం వంటి అంశాలు సఫారీ జట్టును మరింత బలహీనం చేశాయి. అయినా కెప్టెన్‌ డీన్‌ ఎల్గర్‌ ఆత్మవిశ్వాసంతో కొత్త ఆటగాళ్లను ముందుండి నడిపించిన తీరు ప్రశంసనీయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని