IND vs SA : భారత ఆటగాళ్లకు ఈ ఓటమి.. ఓ పీడకలగా మిగిలిపోయింది : సునీల్ గావస్కర్
దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమ్ఇండియాకు మరోసారి నిరాశే ఎదురైందని క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్ను...
ఇంటర్నెట్ డెస్క్ : దక్షిణాఫ్రికా గడ్డపై తొలి టెస్టు సిరీస్ సాధించి చరిత్ర సృష్టించాలనుకున్న టీమ్ఇండియాకు మరోసారి నిరాశే ఎదురైందని క్రికెట్ మాజీ దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ అన్నాడు. మూడు టెస్టుల సిరీస్ను 1-2 తేడాతో కోల్పోవడంతో.. భారత ఆటగాళ్లకు అది పీడకలగా మిగిలిపోయిందని పేర్కొన్నాడు.
మూడో టెస్టు ఓటమి అనంతరం టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఓటమి చాలా నిరాశకు గురి చేసింది’ అని చెప్పాడు. కోహ్లీ వ్యాఖ్యలపై సునీల్ గావస్కర్ స్పందించారు. ‘సెంచూరియన్లో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించడంతో.. సిరీస్ను 3-0 తేడాతో క్లీన్ స్వీప్ చేస్తుందనుకున్నాను. అయితే, చివరి రెండు టెస్టుల్లో దక్షిణాఫ్రికా గొప్పగా పుంజుకుంది. ఆ రెండు టెస్టుల్లో టీమ్ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలు అయ్యిందంటే.. భారత్ ఎంత పేలవంగా ఆడిందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు’ అని గావస్కర్ పేర్కొన్నాడు.
దక్షిణాఫ్రికాతో సిరీస్ ఆరంభానికి ముందు అందరూ టీమ్ఇండియానే ఫేవరెట్ అని భావించారు. ఎందుకంటే, భారత జట్టుతో పోల్చుకుంటే దక్షిణాఫ్రికాలో దాదాపు అంతా కొత్త ఆటగాళ్లే. ఆ జట్టు ప్రధాన బౌలర్ అన్రిచ్ నార్జ్ గాయం కారణంగా టెస్టు సిరీస్కు దూరం కావడం, మొదటి టెస్టు తర్వాత సీనియర్ ఆటగాడు క్వింటన్ డికాక్ టెస్టు క్రికెట్కు వీడ్కోలు పలకడం వంటి అంశాలు సఫారీ జట్టును మరింత బలహీనం చేశాయి. అయినా కెప్టెన్ డీన్ ఎల్గర్ ఆత్మవిశ్వాసంతో కొత్త ఆటగాళ్లను ముందుండి నడిపించిన తీరు ప్రశంసనీయం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.