IND vs NZ: భారత్- న్యూజిలాండ్ సిరీస్‌ కెప్టెన్‌గా రోహిత్ శర్మ

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఈనెల 17 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో మూడు టీ20లు ఆడనున్నారు.ఇందుకు కోసం బీసీసీఐ కాసేపటి క్రితం భారత జట్టును ప్రకటించింది. టీ20ల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అందరూ

Published : 09 Nov 2021 20:09 IST

ఇంటర్నెట్ డెస్క్: భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఈ నెల 17 నుంచి టీ20 సిరీస్ జరగనుంది. ఇందులో మూడు టీ20లు ఆడనున్నారు. ఇందుకోసం బీసీసీఐ కాసేపటి క్రితమే భారత జట్టును ప్రకటించింది. టీ20ల్లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో అందరూ ఊహించినట్టుగానే ఓపెనర్‌ రోహిత్ శర్మను సారథిగా ప్రకటించింది. పని భారం కారణంగా కోహ్లీ ఈ మ్యాచ్‌లకు దూరంగా ఉంటున్నాడు. కొంతమంది కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకున్నారు.

భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), కేఎల్ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌ (వికెట్ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌ (వికెట్ కీపర్‌), వెంకటేశ్‌ అయ్యర్‌, యుజువేంద్ర చాహల్‌, రవిచంద్రన్ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, అవేశ్‌ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, దీపక్‌ చాహర్‌, హర్షల్ పటేల్, మహ్మద్‌ సిరాజ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని