Sunil Gawaskar : కంగారూల గడ్డపై టెస్టు సిరీస్ సాధించడం.. సువర్ణాధ్యాయం : సునీల్ గావస్కర్
కంగారూల గడ్డపై భారత జట్టు తొలి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్ఇండియా సాధించిన...
ఇంటర్నెట్డెస్క్ : కంగారూల గడ్డపై భారత జట్టు వరుసగా రెండోసారి టెస్టు సిరీస్ సొంతం చేసుకోవడం.. భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయమని క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ అన్నాడు. ఇటీవల కాలంలో టీమ్ఇండియా సాధించిన విజయాల్లో ఇదే అత్యంత గొప్ప విజయమని పేర్కొన్నాడు. భారత జట్టులోని సీనియర్లు గాయాల పాలైనా.. యువకులు చెక్కు చెదరని ఆత్మ విశ్వాసంతో రాణించి ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించారని ప్రశంసించాడు.
‘తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో 36 పరుగులకే పరిమితమై ఘోర పరాజయం పాలైన టీమ్ఇండియా.. రెండో టెస్టులో పుంజుకున్న తీరు అద్భుతం. ఆ మ్యాచులో భారత్ సాధించిన విజయం ఆటగాళ్ల దృఢ సంకల్పానికి నిదర్శనం. సిరీస్ ఆసాంతం ఆధిపత్యం చెలాయించి కంగారూల గడ్డపై సిరీస్ సాధించడమనేది భారత క్రికెట్ చరిత్రలో సువర్ణాధ్యాయం. అలాంటి చారిత్రక విజయాన్ని చూసినందుకు చాలా గర్వపడుతున్నాను’ అని సునీల్ గావస్కర్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాపై చారిత్రక విజయం సాధించి త్వరలో ఏడాది పూర్తి కానున్న సందర్భంగా.. ‘డౌన్ అండర్గోస్ - ఇండియాస్ గ్రేటెస్ కమ్బ్యాక్’ అనే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ను జనవరి 14 నుంచి ‘సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్’ ప్రసారం చేయనుంది. ఈ సందర్భంగా భారత్ సాధించిన ఘన విజయంపై సునీల్ గావస్కర్ తన అభిప్రాయాలను సోనీ స్పోర్ట్స్ ఛానల్తో పంచుకున్నారు.
అజింక్య రహానె నాయకత్వంలోని టీమ్ఇండియా గతేడాది ఆస్ట్రేలియా పర్యటనలో 2-1 తేడాతో టెస్టు సిరీస్ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అడిలైడ్లో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి.. నాలుగు టెస్టుల సిరీస్లో 1-0తో ఆధిక్యం సాధించింది. ఆ తర్వాత మెల్ బోర్న్లో జరిగిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను సమం చేసింది. హనుమ విహారి, సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అసమాన పోరాటం చేయడంతో సిడ్నీలో జరిగిన మూడో టెస్టు డ్రా గా ముగిసింది. సిరీస్ నిర్ణయాత్మక నాలుగో టెస్టులో టీమ్ఇండియా సమష్టిగా రాణించి.. మూడు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా జట్టును ఓడించింది. దీంతో కంగారూల గడ్డపై రెండోసారి భారత్ బోర్డర్-గావస్కర్ సిరీస్ సాధించి చరిత్ర సృష్టించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్