రెండో రౌండ్‌లో ఓడిన సాత్విక్‌, చిరాగ్‌

యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ మిక్డ్స్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా ఆటగాళ్లు..

Published : 14 Jan 2021 10:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: యోనెక్స్‌ థాయ్‌లాండ్‌ ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీ మిక్డ్స్‌ డబుల్స్‌ రెండో రౌండ్‌లో భారత అగ్రశ్రేణి ఆటగాళ్లు సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి ఓటమిపాలయ్యారు. ఇండోనేషియా ఆటగాళ్లు మహ్మద్‌ అహ్‌సన్‌, హెంద్ర సెతివాన్‌తో గురువారం తలపడిన రెండో రౌండ్‌లో 19-21, 17-21 తేడాతో ఓడిపోయారు. కేవలం 34 నిమిషాల్లోనే ఈ మ్యాచ్‌ ముగిసింది. తొలి సెట్‌లో సాత్విక్‌, చిరాగ్‌ కొంత పోటీ ఇచ్చినా తర్వాతి సెట్‌లో పూర్తిగా వెనుకపడిపోయారు. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించారు.

అంతకుముందు దక్షిణ కొరియా ఆటగాళ్లు కిమ్‌ గి జంగ్‌, లీ యాంగ్‌తో తొలి రౌండ్‌లో తలపడిన సాత్విక్‌, చిరాగ్‌ జోడి 19-21, 21-16, 21-14 తేడాతో విజయం సాధించింది. తొలి సెట్‌ చేజార్చుకొన్నా.. చివరి రెండు సెట్లలో విజయం సాధించారు. దీంతో దక్షిణ కొరియా జోడీపై విజయం సాధించిన భారత ఆటగాళ్లు తర్వాత ఇండోనేషియా జోడీతో ఓటమిపాలయ్యారు. 

ఇవీ చదవండి..

ప్రిక్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్‌

ఆఖరి పోరాటం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని