‘గులాబి’ ఘనతలు: ధోనీ రికార్డుకు కోహ్లీ బీటలు
భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. అక్షర్ పటేల్ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను..
మోత మోగించిన అశ్విన్, అక్షర్
ఇంటర్నెట్ డెస్క్: భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టులో కొన్ని రికార్డులు బద్దలు అయ్యాయి. సొంతగడ్డపై అత్యుత్తమ సారథిగా విరాట్ కోహ్లీ అవతరించాడు. అతడు మహీ రికార్డును తిరగరాశాడు. మరోవైపు సీనియర్ స్పిన్నర్ అశ్విన్ 400 వికెట్ల ఘనత అందుకొన్నాడు. అక్షర్ పటేల్ ఆడుతున్న రెండో టెస్టులోనే 10+ వికెట్లను పడగొట్టి అద్భుతం చేశాడు. మొతేరా వేదికగా జరిగిన డే/నైట్ టెస్టులో టీమ్ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.
ధోనీ రికార్డు బద్దలు
భారత్ తరఫున అత్యంత విజయవంతమైన సారథిగా ఇప్పటికే విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. 35 విజయాలు అందుకున్నాడు. తాజాగా ఇంగ్లాండ్పై విజయంతో ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. గతంలో సొంతగడ్డపై అత్యధిక విజయాల రికార్డు మహీ పేరుతో ఉండేది. అతడి సారథ్యంలో టీమ్ఇండియా భారత గడ్డపై 30 మ్యాచుల్లో 21 విజయాలు అందుకుంది. ఇప్పుడు కోహ్లీసేన 29 టెస్టుల్లో 22 విజయాలు నమోదు చేయడం గమనార్హం.
వేగంగా 400 వికెట్లు
టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన ఘనత సాధించాడు. ఇంగ్లాండ్తో మూడో టెస్టులో 400 వికెట్ల మైలురాయి అందుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 4, రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసిన అతడు 77 టెస్టుల్లోనే 401 వికెట్లు తీయడం గమనార్హం. దాంతో భారత్ తరఫున ఈ ఘనత సాధించిన నాలుగో బౌలర్, మూడో స్పిన్నర్గా అవతరించాడు. అంతేకాకుండా ముత్తయ్య మురళీధరన్ తర్వాత ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయి చేరుకొందీ అశ్వినే కావడం గమనార్హం.
అక్షర్ అత్యుత్తమం
గాయపడ్డ రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్ అతడి స్థానాన్ని అంచనాలను మించి భర్తీచేశాడు. అరంగేట్రం టెస్టులో ఐదు వికెట్ల రికార్డు సాధించిన అతడు మొతేరాలో 10+ వికెట్ల ఘనత సొంతం చేసుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 6, రెండో ఇన్నింగ్స్లో 5 వికెట్లు పడగొట్టాడు. డే/నైట్ టెస్టులో 11/70తో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2018/19లో శ్రీలంకపై ప్యాట్ కమిన్స్ 10/62, 2016/17లో పాక్పై దేవేంద్ర బిషూ 10/174 ఈ ఘనత సాధించారు. అయితే అక్షర్వే మెరుగైన గణాంకాలు.
స్పిన్నర్ల స్వర్గధామం
డే/నైట్ టెస్టులో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు తీసిందీ అహ్మదాబాద్ టెస్టులోనే. ఇంగ్లాండ్, భారత్ స్పిన్నర్లు మొత్తంగా 27 వికెట్లు పడగొట్టారు. అంతకు ముందు దుబాయ్లో పాక్×శ్రీలంక మ్యాచులో 24, పాక్×వెస్టిండీస్ టెస్టులో 22, ఆసీస్×న్యూజిలాండ్ పోరులో 8 వికెట్లు తీశారు.
ఇంగ్లాండ్ అత్యల్ప స్కోర్
టీమ్ఇండియాపై ఇంగ్లాండ్ చేసిన అత్యల్ప స్కోరు 81. మొతేరా రెండో ఇన్నింగ్స్లో నమోదైంది. 1971లో ఓవల్లో 101, 1979/80లో ముంబయిలో 102, 1986లో లీడ్స్లో 102, 2020/21లో అహ్మదాబాద్లో 112 మిగిలిన నాలుగు సందర్భాలు.
తొలి బంతికే వికెట్
అంతర్జాతీయ టెస్టు క్రికెట్లో ఇన్నింగ్స్ తొలి బంతికే వికెట్ తీసిన బౌలర్లు కేవలం నలుగురే. 1888లో ఆసీస్పై బాబ్ పీల్, 1907లో ఇంగ్లాండ్పై బెర్ట్ వోగ్లర్, చెన్నై టెస్టులో ఇంగ్లాండ్పై అశ్విన్ ఈ ఘనత సాధించారు. మొతేరా టెస్టులో అక్షర్ పటేల్ ఈ జాబితాలో సరికొత్తగా చేరాడు. రెండో ఇన్నింగ్స్లో తొలి బంతికే జాక్ క్రాలీని పెవిలియన్ పంపించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు. -
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ (Sachin Tendulkar) బర్త్ డే సందర్భంగా పెద్దఎత్తున శుభాకాంక్షలు వచ్చాయి. మాజీ క్రికెటర్లు ప్రత్యేకంగా పోస్టులు పెట్టారు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!
-
ఓటరు జాబితాలో.. ‘డీ’ ఓటరు అంటే ఎవరు?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామక్రిష్ణ
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..