INDvsENG‌: 183 పరుగులకు ఆలౌటైన ఇంగ్లాండ్‌

టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 183 పరుగులకు  ఆలౌటైంది.

Updated : 04 Aug 2021 22:08 IST

ఇంటర్నెట్ డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ 183 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్‌ జో రూట్‌ (64) ఒక్కడే రాణించాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌ పెద్దగా పరుగులు చేయలేకపోయారు. తొలి సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 61 పరుగులు చేసిన ఇంగ్లాండ్.. రెండో సెషన్‌లో రెండు వికెట్లు కోల్పోయి 77 పరుగులు చేసింది. టీ విరామం అనంతరం ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో సామ్ కరన్‌ (27) కాసేపు బ్యాట్ ఝళిపించాడు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు, షమీ మూడు, శార్దూల్‌ ఠాకూర్‌ రెండు, సిరాజ్‌ ఒక వికెట్ పడగొట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని