INDW vs PAKW: పాక్‌పై ఆధిపత్యం.. విజయం దిశగా టీమ్‌ఇండియా

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం దిశగా సాగుతోంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌...

Published : 06 Mar 2022 12:48 IST

బే ఓవల్‌: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం దిశగా సాగుతోంది. 245 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్‌ 35 ఓవర్లు పూర్తయ్యేసరికి 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. టాప్‌ ఆర్డర్‌, మిడిల్‌ ఆర్డర్‌ మొత్తం విఫలమవడంతో లోయర్‌ మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు పోరాడుతున్నారు. ప్రస్తుతం క్రీజులో సిద్రా నవాజ్‌ (8), డయానా బేగ్‌ (5) ఉన్నారు. ఆ జట్టు విజయానికి 15 ఓవర్లలో 136 పరుగులు కావాలి. కావాల్సిన రన్‌రేట్‌ 9కి పైగా ఉండటంతో పాక్‌ బ్యాటర్లపై ఒత్తిడి పెరుగుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని