INDW vs PAKW: చెలరేగిన పాక్‌ బౌలర్లు.. టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ ఫెయిల్‌

మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్‌ మిథాలి రాజ్‌ (9), హర్మన్‌ప్రీత్‌ (5), రీచా ఘోష్‌ (1) నిరాశపరిచారు...

Updated : 06 Mar 2022 09:14 IST

బే ఓవల్‌: మహిళల వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరుగుతోన్న తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా మిడిల్‌ ఆర్డర్‌ పూర్తిగా విఫలమైంది. కెప్టెన్‌ మిథాలి రాజ్‌ (9), హర్మన్‌ప్రీత్‌ (5), రీచా ఘోష్‌ (1) నిరాశపరిచారు. పాక్‌ బౌలర్లు చెలరేగడంతో భారత్‌ 18 పరుగుల స్వల్ప వ్యవధిలో 5 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ క్రమంలోనే  స్నేహరాణా(10), పూజా వస్త్రాకర్‌(33) కాస్త నిలకడ ప్రదర్శిస్తూ స్కోరుబోర్డును ముందుకు తీసుకెళ్లారు. దీంతో 40 ఓవర్లకు జట్టు స్కోర్‌ 160/6కి చేరింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు