INDW vs WIW: వెస్టిండీస్పై భారత్ ఘన విజయం.. ప్రపంచకప్లో రెండో గెలుపు
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన పోరులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్...
(Photo: BCCI Womens Twitter)
హామిల్టన్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భాగంగా వెస్టిండీస్తో జరిగిన పోరులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 318 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కరీబియన్ జట్టు 162 పరుగులకే ఆలౌటైంది. దీంతో మిథాలీ టీమ్ ప్రపంచకప్లో రెండో విజయాన్ని సొంతం చేసుకుంది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ స్మృతి మంధాన (123; 119 బంతుల్లో 13x4, 2x6), మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హర్మన్ప్రీత్ కౌర్ (109; 107 బంతుల్లో 10x4, 2x6) శతకాలతో రాణించారు. మిగతావారు పెద్దగా రాణించలేదు. అనంతరం ఛేదనకు దిగిన వెస్టిండీస్ తొలుత దూకుడుగా ఆడినా తర్వాత చేతులెత్తేసింది.
భారీ ఛేదనలో ఆ జట్టు ఓపెనర్లు డియాండ్రా డాటిన్ (62; 46 బంతుల్లో 10x4, 1x6), హేలీ మ్యాథ్యూస్ (43; 36 బంతుల్లో 6x4) ధాటిగా ఆడారు. బౌండరీలే లక్ష్యంగా దంచికొట్టారు. దీంతో విండీస్ 12 ఓవర్లకే 100 పరుగులు సాధించి శుభారంభం చేసింది. ఇక వీరిద్దరూ కీలక భాగస్వామ్యం నెలకొల్పి ప్రమాదకరంగా మారుతున్న సమయంలో భారత బౌలర్లు ఒక్కసారిగా రెచ్చిపోయారు. ఓపెనర్లతో పాటు మిగతా బ్యాటర్లను వరుసగా పెవిలియన్ పంపారు. దీంతో 100/1తో ఒకానొక దశలో పటిష్ఠస్థితిలో నిలిచి లక్ష్యం వైపు దూసుకుపోతున్న విండీస్ను టీమ్ఇండియా బౌలర్లు కట్టడి చేశారు. మధ్యలో షెమేన్ క్యాంప్బెల్లె (11), చెడియాన్ నేషన్ (19) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నా.. చివరికి ఆ జట్టు 162 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమ్ఇండియా 155 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లలో స్నేహ్రాణా 3, మేఘ్నా సింగ్ రెండు వికెట్లు తీయగా రాజేశ్వరి, పుజూ వస్త్రాకర్, ఝులన్ గోస్వామి తలో వికెట్ తీశారు. కాగా, శతకాలతో అదరగొట్టిన హర్మన్ప్రీత్, స్మృతి మంధాన ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును పంచుకున్నారు.
మరోవైపు టీమ్ఇండియా సారథి మిథాలీ రాజ్ ఈ మ్యాచ్లో కెప్టెన్సీ చేయడం ద్వారా కొత్త రికార్డు నెలకొల్పింది. మహిళల వన్డే ప్రపంచకప్లో అత్యధిక మ్యాచ్లకు సారథిగా వ్యవహరించిన కెప్టెన్గా రికార్డు సృష్టించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ సారథి బెలిండా క్లార్క్ (23)ను మిథాలీ (24) అధిగమించింది. మరోవైపు టీమ్ఇండియా సీనియర్ ఫాస్ట్ బౌలర్ ఝులన్ గోస్వామి ఈ మ్యాచ్లో ఒక వికెట్ తీయడం ద్వారా వన్డే ప్రపంచకప్లో అత్యధిక వికెట్లు (40) తీసిన బౌలర్గా కొత్త రికార్డు నెలకొల్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
-
వైకాపా నేతల సిఫార్సులతో పోస్టు.. మహిళా ఉద్యోగినులతో వెకిలి చేష్టలు