Thomas cup: టెన్నిస్కు డేవిస్.. బ్యాడ్మింటన్కు థామస్..
బాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ‘థామస్ కప్’లో భారత్ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్ కప్’ టోర్నమెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
థామస్ కప్ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
బ్యాడ్మింటన్లో ప్రతిష్టాత్మక టోర్నమెంట్ ‘థామస్ కప్’లో భారత్ సత్తా చాటింది. 73 ఏళ్ల టోర్నీ చరిత్రలో తొలిసారిగా కప్ను గెలిచి చరిత్ర సృష్టించింది. ఈ నేపథ్యంలో ‘థామస్ కప్’ టోర్నమెంట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
🏸 థామస్ కప్ టోర్నీ ఏర్పాటు చేయాలన్న ఆలోచన జార్జ్ అలన్ థామస్ది. ఇంగ్లాండ్కు చెందిన థామస్.. 1900ల్లో గొప్ప బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ సహ వ్యవస్థాపకుడు.
🏸 టెన్నిస్లో డేవిస్ కప్.. ఫుట్బాల్లో వరల్డ్ కప్ ఉన్నట్లే బ్యాడ్మింటన్లోనూ ఓ ప్రపంచస్థాయి టోర్నమెంట్ ఉండాలని థామస్ భావించారు. ఈ మేరకు ‘థామస్ కప్’టోర్నీకి ప్రణాళిక రచించారు. థామస్ కప్నే ‘వరల్డ్స్ మెన్స్ టీమ్ ఛాంపియన్షిప్స్’అని కూడా పిలుస్తుంటారు.
🏸 1941లోనే ఈ టోర్నీ నిర్వహించాలని ప్రయత్నించినా...రెండో ప్రపంచయుద్ధం కారణంగా వీలుపడలేదు. దీంతో 1948-49లో తొలి ‘థామస్ కప్’ టోర్నీని ఇంగ్లాండ్లో నిర్వహించారు.
🏸 ఇందులో ఆసియన్, ఆస్ట్రేలియన్, పాన్-అమెరికన్, యూరోపియన్ ఇలా నాలుగు కేటగిరీల్లో మూడు క్వాలిఫైయింగ్ జోన్స్గా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఆఫ్రికన్, ఓషియనియన్ కేటగిరీలు వచ్చి చేరాయి.
🏸 మూడేళ్లకోసారి జరిగే ఈ టోర్నీలో క్రీడాకారులు బెస్ట్ ఆఫ్ నైన్ ఫార్మాట్లో మ్యాచ్లు ఆడాల్సి వచ్చేది. ఐదు సింగిల్స్ విభాగంలో.. నాలుగు డబుల్స్ విభాగంలో మ్యాచ్లు ఆడాలి. ఎవరైతే ఎక్కువ మ్యాచ్లు గెలుస్తారో వారే విజేతగా నిలిచేవారు. అలా తొలి ‘థామస్ కప్’ను మలేషియా గెలుచుకుంది.
🏸 1984 నుంచి ఈ టోర్నీ రెండేళ్లకొకసారి జరుగుతోంది. అలాగే.. బెస్ట్ ఆఫ్ నైన్ కాకుండా బెస్ట్ ఆఫ్ ఫైవ్ ఫార్మాట్లో మ్యాచ్లను నిర్వహిస్తున్నారు. రెండు డబుల్స్, మూడు సింగిల్ మ్యాచ్లు ఆడాల్సి ఉంటుంది.
🏸 తొలి మూడు సార్లు ‘థామస్ కప్’ను మలేషియానే గెలుచుకుంది. 1957 నుంచి దాదాపు దశాబ్దకాలం కప్ను ఇండోనేషియానే కైవసం చేసుకుంది.
🏸 ఇప్పటి వరకు జరిగిన ఈ టోర్నీలో డెన్మార్క్(2014) మినహా ఆసియేతర దేశాల్లో ఏ ఒక్కటీ ఈ కప్ను గెలవకపోవడం గమనార్హం.
🏸 ఇండోనేషియా అత్యధికంగా 14 సార్లు ఈ కప్ గెలవగా.. చైనా 10 సార్లు, మలేషియా నాలుగుసార్లు విజేతగా నిలిచాయి.
🏸 2014లో దిల్లీ వేదికగా జరిగిన ఈ అంతర్జాతీయ మెగా టోర్నీలో జపాన్ తొలిసారి కప్ను దక్కించుకుంది.
🏸 భారత్ విషయానికొస్తే.. 1952లో తొలిసారి ‘థామస్ కప్’లో పోటీ పడింది. రెండు సార్లు ఫైనల్ రౌండ్ వరకు వెళ్లింది. మూడుసార్లు క్వార్టర్ ఫైనల్స్.. ఓసారి సెమీఫైనల్ వరకు వచ్చి వెనుదిరిగింది.
🏸 తాజాగా థాయ్లాండ్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మొదటిసారి భారత్ కప్ గెలిచి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది.
🏸 ప్రపంచంలోని అన్నీ దేశాలు ఈ టోర్నీలో క్వాలిఫై అయి ఫైనల్ స్టేజ్కి చేరుకునేందుకు తాపత్రయపడుతుంటాయి. కానీ, కొన్ని దేశాలే ఫైనల్ స్టేజ్కు చేరుకుంటాయి.
🏸 1984 నుంచి 2002 వరకు ఫైనల్ స్టేజ్లో ఎనిమిది జట్లను రెండు గ్రూపులుగా విభజించేవారు. ఆ తర్వాత వీటి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
🏸 తాజా టోర్నమెంట్లో మొత్తం 29 దేశాలు పోటీ పడగా.. 16 దేశాలు క్వాలిఫై అయ్యాయి. వాటిని నాలుగు గ్రూపులుగా విభజించించి.. పోటీలు నిర్వహించారు.
🏸 ఫైనల్ మ్యాచ్లో 14 సార్లు ఛాంపియన్గా నిలిచిన ఇండోనేషియాతో భారత్ తలపడి విజయకేతనం ఎగరవేసింది. థామస్ కప్ను తొలిసారి ముద్దాడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Maxwell: నడవలేని స్థితి వరకు ఐపీఎల్ ఆడతా
జీవితంలో నడవలేని స్థితికి చేరుకునే వరకు ఐపీఎల్లో ఆడతానని ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ అన్నాడు. ఆసీస్ ప్రపంచకప్ విజయంలో కీలకపాత్ర పోషించిన 35 ఏళ్ల మ్యాక్స్వెల్ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. -
IND w Vs ENG w: సివర్, వ్యాట్ ధనాధన్
ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో భారత మహిళలకు పేలవ ఆరంభం. బుధవారం జరిగిన తొలి టీ20లో ఆతిథ్య జట్టు 38 పరుగుల తేడాతో ఓడిపోయింది. అన్ని విభాగాల్లోనూ ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. -
Ravi Bishnoi: టీ20ల్లో బిష్ణోయ్ నంబర్వన్
భారత యువ లెగ్స్పిన్నర్ రవి బిష్ణోయ్ టీ20 క్రికెట్లో నంబర్వన్ బౌలర్గా అవతరించాడు. ఐసీసీ తాజా ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో నిలిచాడు. చక్కని ప్రదర్శనతో ఆస్ట్రేలియాతో సిరీస్లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును అందుకున్న 23 ఏళ్ల బిష్ణోయ్. -
Pro Kabaddi League: టైటాన్స్ మరోసారి..
ప్రొ కబడ్డీలో తెలుగు టైటాన్స్ కథ మారలేదు. ఈసారి భారీ ధర వెచ్చించి స్టార్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ను తెచ్చుకున్నా ఫలితం కనిపించడం లేదు. వరుసగా రెండో మ్యాచ్లోనూ టైటాన్స్కు ఓటమి తప్పలేదు. -
Shubman Gill: గిల్ 400 చేయగలడు
sక్రికెట్లో తన ప్రపంచ రికార్డుల్ని భారత ఓపెనర్ శుబ్మన్ గిల్ బద్దలు కొడతాడని వెస్టిండీస్ దిగ్గజ బ్యాటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. 2004లో ఇంగ్లాండ్తో టెస్టులో లారా అజేయంగా 400 పరుగులు సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు ఇదే. -
IND vs SA: దక్షిణాఫ్రికాకు టీమ్ఇండియా
సొంతగడ్డపై టీ20 సిరీస్లో ఆస్ట్రేలియాను చిత్తుచేసిన భారత జట్టు మరో సవాల్కు సిద్ధమైంది. బుధవారం దక్షిణాఫ్రికా పర్యటనకు బయల్దేరింది. ఈ పర్యటనలో భారత్, దక్షిణాఫ్రికా జట్లు మూడేసి టీ20లు, వన్డేలు.. రెండు టెస్టుల్లో తలపడతాయి. -
క్రికెట్ మరీ ఎక్కువైపోతోంది.. అందుకే ఆల్రౌండర్ల కొరత
అన్ని ఫార్మాట్లలో అతి క్రికెట్ వల్లే నాణ్యమైన ఆల్రౌండర్లు రావట్లేదని అంటున్నాడు దక్షిణాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్. చరిత్రలోనూ ఆల్రౌండర్లు ఎక్కువగా లేరని అన్నాడు. ఆధునిక క్రికెట్లో మేటి ఆల్రౌండర్లలో ఒకడిగా పేరున్న కలిస్ మూడు ఫార్మాట్లలో కలిపి 25 వేలకుపైగా పరుగులు చేశాడు. -
ఒక్క రోజే 15 వికెట్లు
బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో స్పిన్నర్లు వికెట్ల పండగ చేసుకుంటున్నారు. బుధవారం ప్రారంభమైన ఈ మ్యాచ్లో ఇరు జట్ల స్పిన్నర్ల మాయాజాలంతో ఒక్కరోజే 15 వికెట్లు నేలకూలాయి. -
వోజ్నియాకికి ఆస్ట్రేలియన్ ఓపెన్ వైల్డ్కార్డ్
మహిళల మాజీ నంబర్వన్ కరోలిన్ వోజ్నియాకి (డెన్మార్క్)కి 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్లో వైల్డ్కార్డ్ లభించింది. తొలి దశలో ఆమెతో పాటు ఆరుగురు ఆస్ట్రేలియా క్రీడాకారులకు వైల్డ్కార్డులు ఇచ్చారు.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం