PV Sindhu: పీవీ సింధు.. బ్యాడ్మింటన్ స్టార్.. ఫ్యాషన్ ఐకాన్!
వేదిక ఏదైనా పతకం మాత్రం పక్కా అని నిరూపిస్తోంది.. బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలు, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్, సూపర్ సీరిస్ టైటిళ్లు, ఒలింపిక్స్ ఇలా అనేక వేదికలపై పతకాల మోత మోగించింది. గత ఒలింపిక్స్లో రజతం సాధించిన ఆమె.. తాజాగా టోక్యోలో జరిగిన
వేదిక ఏదైనా పతకం మాత్రం పక్కా అని నిరూపిస్తోంది.. బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు. ప్రపంచ ఛాంపియన్షిప్, ఆసియా క్రీడలు, బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్, సూపర్ సీరిస్ టైటిళ్లు, ఒలింపిక్స్ ఇలా అనేక వేదికలపై పతకాల మోత మోగించింది. గత ఒలింపిక్స్లో రజతం సాధించిన ఆమె.. తాజాగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో భారత్కు కాంస్య పతకాన్ని అందించింది. అంతేనా.. వరుసగా రెండు ఒలింపిక్స్లో పతకాలు సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు చరిత్ర సృష్టించింది. మరి ఆమె గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందామా..!
* పీవీ సింధు.. పూర్తి పేరు పూసర్ల వెంకట సింధు. 1995 జులై 5న జన్మించింది. ఆమె తల్లిదండ్రులు పీవీ రమణ, విజయ. వారిద్దరూ ఒకప్పుడు అథ్లెట్లు కావడం విశేషం. రమణ, విజయ జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారులు. సింధు తండ్రి రమణ 2000లో క్రీడారంగంలో విశేష కృషి చేసిన వారికి ఇచ్చే అర్జున అవార్డును పొందారు.
* తల్లిదండ్రులు క్రీడాకారులు కావడంతో సహజంగానే సింధుకి కూడా క్రీడలపై ఆసక్తి పెరిగింది. అలా చిన్నవయసులోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అవ్వాలని రాకెట్ పట్టుకుంది.
* బ్యాడ్మింటన్లో శిక్షణ పొందడానికి సింధు సికింద్రాబాద్లోని మారేడుపల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేది. ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారు.
* సింధుకు దివ్య అనే సోదరి ఉంది. 2012లో ఆమె వివాహం జరగ్గా సింధు ఆట వల్ల హాజరుకాలేకపోయింది. తన సోదరి వివాహం జరిగే సమయంలో సింధు లఖ్నవూలోని సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రి గోల్డ్ పోటీల్లో పాల్గొంది. వ్యక్తిగత విషయాల కన్నా.. ఆటకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చే సింధు.. ఆటను కొనసాగించడానికి మొగ్గుచూపింది. అందుకే పెళ్లికి హాజరుకాలేపోయింది.
* 2016లో రియోలో జరిగిన ఒలింపిక్స్లో బ్యాడ్మింటన్లో రజత పతకం సాధించిన సింధు.. ఇందుకోసం చాలా శ్రమించింది. ఈ సారి ఒలింపిక్స్లో స్వర్ణం గెలవాలన్న కసితో మరింత కఠోర శిక్షణ పొందింది. కానీ.. సెమీఫైనల్లో తైపీ క్రీడాకారిణి తై జు యింగ్ చేతిలో ఓడిపోవడంతో ఫైనల్కు చేరలేకపోయింది. కాంస్యం కోసం జరిగిన పోరులో చైనాకు చెందిన బింగ్జియావోపై గెలిచి పతకం దక్కించుకుంది.
* గత ఒలింపిక్స్లో సింధు రజతం పతకం సాధించడంతో ఆమెకు మాజీ క్రికెటర్, వ్యాపారవేత్త చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కారును బహుమతిగా ఇచ్చారు. క్రికెట్ గాడ్ సచిన్ తెందూల్కర్ చేతుల మీదుగా సింధు ఆ బహుమతిని అందుకుంది. తాజా ఒలింపిక్స్లో కాంస్య పతకం సాధించిన సింధుకు ప్రధాని నుంచి సామాన్య ప్రజల వరకు అందరూ అభినందనలు తెలుపుతున్నారు.
* శిక్షణలో లేనప్పుడు.. సింధు స్విమ్మింగ్, ధ్యానం, యోగా చేస్తుందట.
* సింధు మంచి భోజన ప్రియురాలే. తరచూ వివిధ రెస్టారెంట్లలో భోజనం చేస్తున్నప్పుడు తీసిన ఫొటోలను తన సోషల్మీడియా ఖాతాల్లో పోస్టు చేస్తుంటుంది.
* ఓ క్రీడాకారిణి అయి ఉండి.. యుద్ధవిమానం తేజస్లో ప్రయాణించి అరుదైన ఘనతను సాధించింది సింధు. డీఆర్డీవో, రక్షణ శాఖ ఇచ్చిన అవకాశం మేరకు ఆమె కో-పైలట్గా వ్యవహరించింది.
* పీవీ సింధు బ్యాడ్మింటన్ స్టార్ మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా. అప్పుడప్పుడు సంప్రదాయ, ట్రెండీ దుస్తుల్లో తళుక్కున మెరుస్తుంటుంది.
* క్రీడారంగంలో సింధు ప్రతిభను మెచ్చి అనేక అవార్డులు వరించాయి. 2013లో అర్జున అవార్డు, 2015లో పద్మశ్రీ, 2016లో రాజీవ్ గాంధీ ఖేల్రత్న, 2020లో పద్మ భూషణ్ అవార్డులు లభించాయి.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
బ్రిటన్కు అక్రమంగా వస్తే రువాండాకే.. అసలేమిటీ బిల్లు?
-
ఓటీపీ రూటు మారితే అలర్ట్.. సైబర్ మోసాలకు చెక్ పెట్టేందుకు కొత్త అస్త్రం!
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్