T20 World Cup: భారత్ ఛాంపియన్గా నిలిచే అవకాశం ఉంది: ఇంజామామ్ ఉల్ హక్
ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరేట్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్ నిలిచే అవకాశాలు మెండుగా
(Photo: BCCI Twitter)
ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియానే టైటిల్ ఫేవరేట్ అని పాకిస్థాన్ మాజీ కెప్టెన్ ఇంజామామ్ ఉల్ హక్ అన్నాడు. యూఏఈలోని పరిస్థితులు, టీ20 ఫార్మాట్లో ఆటగాళ్ల అనుభవం, ఇలా ఏ విధంగా చూసిన భారత జట్టు ఛాంపియన్ నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఇంజామామ్ పేర్కొన్నాడు. ‘ఏ టోర్నీలోనైనా ఫలానా జట్టు కచ్చితంగా విజేతగా నిలుస్తుందని చెప్పలేం. విజయం సాధించడం అనేది ఆ జట్టు అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. నా అంచనా ప్రకారం.. ఈ టీ20 ప్రపంచకప్లో ఛాంపియన్గా నిలిచే అవకాశాలు ఇతర జట్ల కంటే టీమ్ఇండియాకే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా అక్కడి పరిస్థితులు వారికి అనుకూలంగా ఉన్నాయి. ఆ జట్టుకు అనుభవజ్ఞులైన టీ20 ఆటగాళ్లున్నారు’ అని ఇంజామామ్ అన్నాడు.
అక్టోబరు 24న భారత్, పాక్ మధ్య హై వోల్టెజీ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రేమికులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ గురించి ఇంజామామ్ మాట్లాడాడు.‘సూపర్ 12 దశలో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ఫైనల్కు ముందు ఫైనల్లాంటిది. ఈ మ్యాచ్కు ఉన్నంత క్రేజ్ మరే మ్యాచ్కు ఉండదు. 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడిన రెండు మ్యాచ్లు ఫైనల్స్ను తలపించాయి’అని ఇంజామామ్ ఉల్ హక్ అన్నాడు. బుధవారం భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ మాట్లాడుతూ..‘ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్లో టీమ్ఇండియా హాయిగా ఆడింది. 155 పరుగుల లక్ష్యాన్ని కోహ్లీ సేన పెద్దగా శ్రమించకుండానే ఛేదించింది. టీ20ల్లో ఇలాంటి పిచ్లపై టీమ్ఇండియా అత్యంత ప్రమాదకరమైన జట్టు’అని వివరించాడు. మరోవైపు, తన మొదటి వార్మప్ మ్యాచ్లో వెస్టిండీస్ని ఓడించి పాకిస్థాన్.. దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వార్మప్ మ్యాచ్లో ఓటమిపాలైంది. భారత్తో మ్యాచ్కు ముందు పాక్కు ఇది గట్టిదెబ్బగానే చెప్పవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..