IPL 2021: నిలవాలంటే గెలవాలి.. కోల్కతా ముందున్న సవాళ్లివే!
కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓటమిపాలై రెండు మ్యాచ్లే గెలిచింది. కరోనా కేసుల కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసరికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్లేఆఫ్స్కు చేరాలంటే
ఇంటర్నెట్డెస్క్: కోల్కతా నైట్ రైడర్స్ ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన ఏడు మ్యాచ్ల్లో ఐదింటిలో ఓటమి పాలై రెండు మ్యాచ్లే గెలిచింది. కరోనా ఉద్ధృతి కారణంగా టోర్నీ నిరవధిక వాయిదా పడేసమయానికి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లో గెలవాల్సిన పరిస్థితి. అయితే, తాము చరిత్ర తిరగరాస్తామని ఆ జట్టు చీఫ్ మెంటార్ డేవిడ్ హస్సీ తాజాగా ధీమా వ్యక్తం చేశాడు. కోల్కతా నిజంగా చెలరేగాలంటే వేటిపై దృష్టి సారించాలి? అధిగమించాల్సిన అడ్డంకులేంటి..?
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
రెండే విజయాలు: ఐపీఎల్ 14వ సీజన్ తొలి భాగంలో కోల్కతా రెండు విజయాలే సాధించింది. ఏప్రిల్లో ప్రారంభమైన ఈ సీజన్లో ఆ జట్టు తొలి మ్యాచ్లో హైదరాబాద్తో ఆడింది. 187 పరుగులు సాధించి అదరగొట్టిన మోర్గాన్ టీమ్ తర్వాత వరుసగా విఫలమైంది. ముంబయి, బెంగళూరు, చెన్నై, రాజస్థాన్ చేతుల్లో ఓటమి పాలై పాయింట్ల పట్టికలో వెనుకంజలో పడిపోయింది. ఈ క్రమంలోనే పంజాబ్ కింగ్స్పై విజయం సాధించి కాస్త ఊరట పొందింది. అయితే, తర్వాత మళ్లీ దిల్లీ చేతిలో భంగపడిన కోల్కతా టోర్నీ నిలిచిపోయేసరికి ఏడో స్థానంలో కొనసాగుతోంది.
బెంగళూరు నుంచే మొదలుపెట్టాలి: ఇక రెండో భాగంలో కోల్కతా తొలి మ్యాచ్లో సోమవారం బెంగళూరును ఢీకొట్టనుంది. ఇంతకుముందు ఇరు జట్ల మధ్య జరిగిన తొలి పోరులో కోహ్లీసేన 38 పరుగులతో ఘన విజయం సాధించింది. దీంతో ఇప్పుడు మోర్గాన్ టీమ్ ఆ జట్టుపై చెలరేగి విజయం సాధించాలనే కసితో ఉంది. ఇక్కడి నుంచే విజయ ప్రస్థానం మొదలుపెట్టాలని చూస్తోంది. ఇంతకుముందు జరిగిన మ్యాచ్లో కోహ్లీ టీమ్ 204/4 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఆ మ్యాచ్లో మాక్స్వెల్ (78), డివిలియర్స్ (76*) దంచికొట్టారు. అనంతరం ఛేదనకు దిగిన కోల్కతా 166/8 స్కోరుకే పరిమితమైంది. దినేశ్ కార్తీక్ విఫలమైనా ప్రధాన బ్యాట్స్మెన్ అంతా తలా కొన్ని పరుగులు చేశారు. అయితే, ఎవరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడంతో కోల్కతాకు ఓటమి తప్పలేదు.
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
రాహుల్, నితీశ్, రసెల్.. దంచికొట్టాలి: కోల్కతా తరఫున ఈ సీజన్లో ఒక్క బ్యాట్స్మెన్ కూడా పూర్తిస్థాయిలో ఆడలేకపోయారు. నితీశ్ రాణా, రాహుల్ త్రిపాఠి, ఆండ్రీ రసెల్ ఈ ముగ్గురూ తలా కొన్ని పరుగులు సాధించడం తప్ప ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారు. రాణా ఈ సీజన్లో ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు అర్ధ శతకాలు సాధించి 201 పరుగులు చేశాడు. దీంతో కోల్కతా తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ప్రస్తుతం కొనసాగుతున్నాడు. తర్వాత రాహుల్ ఏడు మ్యాచ్ల్లో ఒక్క అర్ధశతకంతో 187 పరుగులు సాధించాడు. భారీ ఇన్నింగ్స్ ఆడగల రసెల్ కూడా ఏడు మ్యాచ్ల్లో 163 పరుగులే చేశాడు. ఈ ముగ్గురూ తర్వాతి మ్యాచ్ల్లో మరింత దంచికొట్టాలి.
(ఫొటో : కేకేఆర్ ట్విటర్)
శుభ్మన్, కార్తీక్, మోర్గాన్ పరుగులు చేయాలి: ఇక ఈ జట్టులో మిగిలిన ప్రధాన బ్యాట్స్మెన్లో ముందుండేది ఓపెనర్ శుభ్మన్ గిల్. గతేడాది తన బ్యాటింగ్తో అదరగొట్టిన ఈ యువ బ్యాట్స్మన్.. ఈ సీజన్లో అంతగా ఆడలేకపోయాడు. ఏడు మ్యాచ్ల్లో ఒక్క అర్ధ శతకం సాధించి 132 పరుగులే చేశాడు. ఇక మిడిల్ ఆర్డర్లో దినేశ్ కార్తీక్, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సైతం తమ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. గతేడాది వరుస ఓటముల తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కార్తీక్ ఈ సీజన్లోనూ అస్సలు రాణించలేదు. ఏడు మ్యాచ్ల్లో 123 పరుగులే చేశాడు. మరోవైపు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఆడిన ఏడు మ్యాచ్ల్లో 92 పరుగులే చేశాడు. దీంతో ఈ ముగ్గురూ మిగిలిన సీజన్లో పూర్తి స్థాయిలో రాణించాలి. లేదంటే కోల్కతా పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం లేకపోలేదు.
కమిన్స్ను భర్తీ చేయగలడా?: కోల్కతా బౌలింగ్ యూనిట్కు ప్యాట్ కమిన్స్ ప్రధాన బలం. అయితే, అతడు ఈ సీజన్ రెండో భాగంలో ఆడటం లేదు. వ్యక్తిగత కారణాలతో ఆడనని ముందే ప్రకటించాడు. కానీ తొలి భాగంలో కోల్కతా తరఫున అత్యధిక వికెట్లు తీసిన అతడు వీలైతే బ్యాటింగ్ చేయగల సమర్థుడు. దీంతో కోల్కతా రెండో భాగంలో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. మరోవైపు కమిన్స్ స్థానాన్ని భర్తీ చేస్తూ కోల్కతా రెండో దశలో టిమ్సౌథీని తమ జట్టులోకి తీసుకుంది. సౌథీ సైతం అద్భుతంగా బౌలింగ్ చేయగల సమర్థుడు. కానీ, యూఏఈ పిచ్లపై అతడు ఏ మేరకు చెలరేగుతాడో చూడాలి. ఇలాంటి పరిస్థితుల్లో మోర్గాన్ టీమ్ రెండో దశలో రాణించడం చాలా కష్టం. అయినా తమ జట్టు పుంజుకుంటుందని.. ఓపెనర్లు నితీశ్ రాణా, శుభ్మన్ గిల్ బ్యాటింగ్తో ఆదుకుంటారని మెంటార్ హస్సీ ఆశాభావం వ్యక్తం చేశాడు. మరోవైపు కోచ్ బ్రెండన్ మెక్కలమ్ కూడా జట్టును సరైన దిశలో నడిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కోల్కతా మిగిలిన సీజన్లో ఈ సవాళ్లను దాటుకొని రాణించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్