IPL 2021: ప్లే ఆఫ్స్‌కి వెళ్లకపోయినా.. అందుకు గర్వంగా ఉంది: రోహిత్‌ శర్మ

ఐపీఎల్-14 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్  ముంబయి ఇండియన్స్‌  పోరాటం ముగిసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినా నెట్‌రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి వెళ్లలేకపోయింది. ముంబయి ఆటగాళ్లలో

Published : 09 Oct 2021 12:23 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఐపీఎల్-14 సీజన్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్  ముంబయి ఇండియన్స్‌  పోరాటం ముగిసింది. సన్‌రైజర్స్‌తో జరిగిన తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించినా.. నెట్‌రన్‌రేట్‌ తక్కువగా ఉండటంతో ప్లే ఆఫ్స్‌కి వెళ్లలేకపోయింది. ముంబయి ఆటగాళ్లలో ఇషాన్‌ కిషన్‌ (84; 32 బంతుల్లో 11×4, 4×6), సూర్యకుమార్‌ యాదవ్‌ (82; 40 బంతుల్లో 13×4, 3×6) విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడటంతో ముంబయి 9 వికెట్ల నష్టానికి 235 పరుగుల స్కోరును సాధించింది. సన్‌రైజర్స్‌ 193 పరుగులకే పరిమితమైంది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడాడు. ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన తమ జట్టు.. ఈ సారి ప్లే ఆఫ్స్‌కి చేరకపోవడం కాస్త నిరాశకు గురిచేసిందన్నాడు. కానీ, గత ఆరేళ్లలో నాలుగు సార్లు విజేతగా నిలవడం గర్వంగా ఉందని పేర్కొన్నాడు.

‘ఈ మ్యాచ్‌లో విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. అభిమానులు మాకు ఎప్పుడూ మద్దతుగా నిలిచారు. ప్లే ఆఫ్స్‌కి అర్హత సాధించకపోవడంపై నిరాశ చెందాం. ముంబయి లాంటి జట్టు ఆడుతున్నప్పుడు మంచి ప్రదర్శన చేస్తుందని అభిమానులు ఆశిస్తారు. నేను దానిని ఒత్తిడిగా భావించను.. అవి అంచనాలు మాత్రమే. ఇషాన్‌ కిషన్‌ ప్రతిభ ఉన్న ఆటగాడు. అతడు బ్యాటింగ్ చేయడానికి సరైన స్థానం చాలా కీలకం. ఓపెనింగ్‌ చేయడం అతడికి నచ్చుతుంది. డగౌట్‌లో కూర్చుని ఇషాన్‌ ఆడుతుంటే చూడటం అద్భుతంగా ఉంది’ అని రోహిత్‌ శర్మ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని