SRH vs PBKS: ఉత్కంఠభరిత పోరులో పంజాబ్ కింగ్స్దే గెలుపు..
సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. తొలుత బంతితో కట్టడి చేసినా బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది.
ఇంటర్నెట్ డెస్క్: సన్రైజర్స్ హైదరాబాద్ ఆటతీరు మారలేదు. తొలుత బంతితో కట్టడి చేసినా బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేసింది. 126 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సన్రైజర్స్ ఏడు వికెట్లు కోల్పోయి 120 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. బ్యాట్స్మెన్లో జేసన్ హోల్డర్(47; 29 బంతుల్లో 5×6) మెరుపు ఇన్నింగ్స్ ఆడినా జట్టును గెలిపించలేకపోయాడు. చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా కేవలం ఒక పరుగు మాత్రమే వచ్చింది. దీంతో హైదరాబాద్ 5 పరుగుల తేడాతో ఓడిపోయింది.
హోల్డర్ మెరిసినా..
126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హైదరాబాద్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. షమి వేసిన తొలి ఓవర్ మూడో బంతికి డేవిడ్ వార్నర్(2) కీపర్ కేఎల్ రాహుల్కి క్యాచ్ ఇచ్చి ఔట్ కాగా.. తర్వాత షమి వేసిన మూడో ఓవర్లో విలియమ్సన్(1) బౌల్డయ్యాడు. దీంతో ఇద్దరు కీలక ఆటగాళ్లు ఔటవడంతో జట్టు స్కోరు చాలా నెమ్మదించింది. ఈ క్రమంలో రవి బిష్ణోయ్ వేసిన ఎనిమిదో ఓవర్లో మనీశ్ పాండే(13) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత వచ్చిన కేదార్ జాదవ్(12), అబ్దుల్ సమద్(1)లను కూడా బిష్ణోయ్ వెనక్కి పంపాడు. దీంతో హైదరాబాద్కు మరింత కష్టాల్లో పడింది. ఇక ఆదుకుంటాడనుకున్న వృద్ధీమాన్ సాహా(31) రనౌటయ్యాడు. ఇక హైదరాబాద్కు ఓటమి లాంఛనమే అనుకున్న తరుణంలో జేసన్ హోల్డర్ సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్ను ఉత్కంఠ స్థితికి తెచ్చాడు. ఇక చివరి ఓవర్లో హైదరాబాద్కు 17 పరుగులు అవసరమైన దశలో రెండో బంతికి హోల్డర్ సిక్స్ కొట్టాడు. దీంతో సమీకరణం 4 బంతుల్లో 10 పరుగులుగా మారింది. తర్వాత రెండు బంతులు పరుగులేమి రాలేదు. దీంతో లక్ష్యం రెండు బంతుల్లో పది పరుగులుగా మారింది. ఐదో బంతికి రెండు పరుగులు వచ్చాయి. ఇక చివరి బంతికి 7 పరుగులు అవసరం కాగా హోల్డర్ ఒక పరుగు మాత్రమే చేశాడు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లతో ఆకట్టుకోగా.. షమి రెండు వికెట్లు తీశాడు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. నాలుగు ఓవర్లకు 26/0తో కాస్త మెరుగైన స్థితిలో ఉన్న ఆ జట్టుకు జేసన్ హోల్డర్ ఐదో ఓవర్లో గట్టి షాక్ ఇచ్చాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్ (21; 21 బంతుల్లో 3×4), మయాంక్ అగర్వాల్ (5)లను ఔట్ చేశాడు. రాహుల్.. సుచిత్కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరగా.. మయాంక్ విలియమ్సన్కి చిక్కాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత స్కోరు వేగం నెమ్మదించింది. క్రిస్ గేల్ (14; 17 బంతుల్లో 1×4) బ్యాట్ ఝళిపించలేదు. రషీద్ ఖాన్ వేసిన 11వ ఓవర్లో గేల్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన నికోలస్ పూరన్(8), దీపక్ హుడా (13) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. పూరన్ని సందీప్ శర్మ పెవిలియన్ చేర్చగా.. హోల్డర్ వేసిన 16వ ఓవర్లో హుడా ఔటయ్యాడు. సమద్ వేసిన 15వ ఓవర్లో మార్క్రమ్.. మనీశ్ పాండేకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. నాథన్ ఎలిస్ (12) భువనేశ్వర్ కుమార్ వేసిన ఓవర్లో పెవిలియన్ చేరాడు. హర్ప్రీత్ బ్రర్ (18) నాటౌట్గా నిలిచాడు.సన్రైజర్స్ బౌలర్లలో జేసన్ హోల్డర్ 3, రషీద్ఖాన్, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, అబ్దుల్ సమద్ తలో వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు