IPL 2021:మేం ఈ సారి కప్‌ గెలుస్తాం:రికీ పాంటింగ్‌

ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టు విజేతగా నిలుస్తుందని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ విశ్వాసం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఉన్న దిల్లీ జట్టుకి.. ప్రస్తుతం ఉన్న జట్టుకి వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు.  ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలతో దూసుకుపోయి

Published : 13 Oct 2021 16:07 IST

(Photo: Delhi Capitals Twitter)

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తమ జట్టు విజేతగా నిలుస్తుందని దిల్లీ క్యాపిటల్స్‌ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆశాభావం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం ఉన్న దిల్లీ జట్టుకి.. ప్రస్తుతం ఉన్న జట్టుకి వ్యత్యాసం ఉందని పేర్కొన్నాడు.  ఈ సీజన్‌లో దిల్లీ క్యాపిటల్స్‌ వరుస విజయాలతో దూసుకుపోయి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. అయితే, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన క్వాలిఫయర్‌-1లో  ఓటమిపాలైంది. ఫైనల్స్‌ ఉన్న మరో బెర్తు కోసం ఈ రోజు రాత్రి జరిగే క్వాలిఫయర్-2లో  కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో రికీ పాంటింగ్‌ మాట్లాడాడు.

‘నేను మూడేళ్లుగా దిల్లీ క్యాపిటల్స్‌తో ఉంటున్నా. మేం 2018లో చివరిస్థానంతో సరిపెట్టుకున్నాం. ఆ తర్వాత ఏడాది మూడో స్థానంలో నిలవగా, 2020లో రన్నరప్‌గా నిలిచాం. ఈ సారి కప్‌ గెలుస్తామని భావిస్తున్నా. రెండేళ్ల క్రితం ఉన్న జట్టుకి..ప్రస్తుతం ఉన్న జట్టుకి వ్యత్యాసం ఉంది. ఒక గొప్ప జట్టు ఎలా ఉంటుంది అంటే ఒకరు లేదా ఇద్దరు ఆటగాళ్లు కాకుండా మైదానంలో ఉన్న 11 మంది జట్టుకు ఏది అవసరమో అదే చేస్తారు’ అని పాంటింగ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని