IPL 2021: మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్రేట్ని కూడా మెరుగుపరుచుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు కాకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ రెచ్చిపోయింది. మంగళవారం జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్పై ఎనిమిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. రన్రేట్ని కూడా మెరుగుపరుచుకుంది. కౌల్టర్నైల్ (4/14), నీషమ్ (3/12), బుమ్రా (2/12) సూపర్ బౌలింగ్తో ప్రత్యర్థిని హడలెత్తించారు. దీంతో రాజస్థాన్ 9 వికెట్లకు 90 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ ( 50 నాటౌట్; 25 బంతుల్లో 5×4, 3×6) చెలరేగి ఆడటంతో.. ముంబయి ఈ స్వల్ప లక్ష్యాన్ని మరో 70 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది. ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి చేరాలంటే సన్రైజర్స్ జట్టుతో జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాలి. అంతేకాదు రాజస్థాన్ రాయల్స్.. కోల్కతా నైట్రైడర్స్ని ఓడించాలి. అప్పుడే ముంబయి ఇండియన్స్ ప్లే ఆఫ్స్కి చేరే అవకాశం ఉంటుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ముంబయి ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, రాజస్థాన్ సారథి సంజు శాంసన్ మాట్లాడారు.
మేం ఏం చేయాలో అప్పుడు తెలుస్తుంది: రోహిత్ శర్మ
‘మేము ఈ స్థితికి వచ్చిన తర్వాత మా శక్తిమేరకు రాణించాలి. ఈ రెండు పాయింట్లు మాకు చాలా కీలకమైనవి. రాజస్థాన్ని 90 పరుగులకే కట్టడి చేయడంతో మ్యాచ్ని త్వరగా ముగించే అవకాశం వచ్చింది. ఆటలో పైచేయి సాధించడం ముఖ్యం. మేము బయటకు వచ్చి స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలి. రన్ రేట్ను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో మేం బాగా ఆడాం. ఇషాన్ కిషన్ కొన్ని మ్యాచ్ల తర్వాత మళ్లీ జట్టులోకి వచ్చాడు. అతడి విషయంలో రిస్క్ తీసుకుకోవడానికి సిద్ధంగా ఉన్నా. అతని సామర్థ్యం మాకు తెలుసు. అతను కొంత సమయం గడపాలని మేము కోరుకున్నాము. అతడు కూడా సరిగ్గా అదే చేశాడు. నీషమ్ దృఢమైన వ్యక్తి. జట్టు వాతావరణాన్ని సందడిగా ఉంచుతాడు. బౌలర్లందరూ కలిసికట్టుగా రాణించారు. ఈ టోర్నమెంట్లో ప్రతి జట్టు ఏ జట్టునైనా ఓడించగలదని భావిస్తున్నా. మేం సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడటానికి కంటే ముందే కోల్కతా నైట్రైడర్స్.. రాజస్థాన్తో తలపడుతుంది. ఆ మ్యాచ్ ఫలితాన్ని బట్టి మేం ఏం చేయాలో తెలుస్తుంది’ అని రోహిత్ శర్మ అన్నాడు.
షార్జా పిచ్పై మొదట బ్యాటింగ్ చేయడం కష్టం: సంజు శాంసన్
‘ఈ పిచ్పై బ్యాటింగ్ చేయడం కొంచెం సవాలుతో కూడుకున్న పని. ఇటువంటి పిచ్పై మొదటి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైన పని. అబుదాబి పిచ్పై ఆడటానికి, షార్జా పిచ్పై ఆడటానికి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అబుదాబి అత్యుత్తమ బ్యాటింగ్ వికెట్లలో ఒకటి. షార్జా పిచ్కు అలవాటు పడటం చాలా కష్టం. బ్యాటర్లను ఎక్కువగా నిందించలేం. మొదటి ఇన్నింగ్స్ కంటే రెండో ఇన్నింగ్స్లో వికెట్ కొంచెం మెరుగ్గా ఉంది. ముంబయి ఆటగాళ్లు బాగా బ్యాటింగ్ చేశారు. మేము కొంత సమయం తీసుకున్న తర్వాత తదుపరి మ్యాచ్ గురించి ఆలోచించాలి. వచ్చే మ్యాచ్లో మేము మెరుగైన ఆటను ఆడాలనుకుంటున్నాం. కోల్కతా నైట్రైడర్స్ బలంగా వస్తారని మాకు తెలుసు. పవర్ప్లేలో వారు రన్ రేట్ పెంచాలనుకుంటారు’ అని శాంసన్ పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోంది: వైఎస్ షర్మిల
-
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
-
భారీ బంగారం కంటెయినర్ మాయం కేసు.. నిందితుల్లో భారత సంతతి వ్యక్తులు
-
దుబాయ్లో వర్షాలు.. భారతీయుల కోసం హెల్ప్లైన్ నంబర్లు
-
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
-
ఇన్ఫీ లాభం 30 శాతం జంప్.. ఒక్కో షేరుపై ₹28 డివిడెండ్