IPL 2022: ఆర్సీబీ బ్యాటింగ్ కోచ్గా ఏబీ డివిలియర్స్!
దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB De Villiers) 2018లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. కానీ, వివిధ దేశాలు నిర్వహించే లీగ్ల్లో మొన్నటివరకు ఆడాడు. ఇటీవల దుబాయ్లో ముగిసిన
(Photo: RCB Twitter)
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు ఏబీ డివిలియర్స్ (AB De Villiers) 2018లో అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు. కానీ, వివిధ దేశాలు నిర్వహించే లీగ్ల్లో మొన్నటివరకు ఆడాడు. ఇటీవల దుబాయ్లో ముగిసిన ఐపీఎల్-14లోనూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. అయితే, అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఈ నవంబర్లో ఏబీ ఓ కీలక ప్రకటన చేశాడు. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకొంటున్నట్లు వెల్లడించాడు. దీంతో ఏబీ అభిమానులతోపాటు ఆర్సీబీ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో వీరికి కాస్త ఉపశమనం కలిగించే వార్త ఇప్పుడు ఒకటి బయటికొచ్చింది. అదేంటంటే ఆటగాడికి రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్సీబీకి దూరమైన ఏబీ.. వచ్చే సీజన్లో ఆ ఫ్రాంచైజీకి బ్యాటింగ్ కోచ్గా వచ్చే అవకాశముంది. ఈ సంకేతాలను టీమ్ఇండియా మాజీ బ్యాటింగ్ కోచ్, ప్రస్తుత ఆర్సీబీ హెడ్ కోచ్ సంజయ్ బంగర్ ఇచ్చాడు. ఇటీవల క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు ఆర్సీబీ కోసం భిన్నమైన పాత్రలను పోషించడానికి ఆసక్తి కనబరుస్తున్నారని పేర్కొన్నాడు.
ఏబీ డివిలియర్స్ లాంటి ఆటగాడికి బ్యాటింగ్ కోచ్గా నియమిస్తే.. అది ఆటగాళ్లకు, జట్టుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని సంజయ్ బంగర్ అన్నాడు. అయితే, బంగర్ చెప్పింది నిజం అయ్యేందుకు ఆస్కారం ఉంది. ఎందుకంటే ఆర్సీబీలో కీలక ఆటగాడైన విరాట్ కోహ్లితో డివిలియర్స్కి మంచి స్నేహాం ఉంది. అంతేకాక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యంతో కూడా ఏబీకి మంచి సంబంధాలున్నాయి. అయితే, ఏ విషయంపై ఆర్సీబీ యాజమాన్యం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.
► Read latest Sports News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం
-
మిమ్మల్ని గద్దెనెక్కిస్తే.. నడిరోడ్డుపై పడేశారు
-
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM