IPL 2022 Auction: అయ్యో..! మెగా వేలంలో పాల్గొనలేకపోయావే.. బుమ్రాపై నెటిజన్ల కామెంట్లు..

టీమ్‌ఇండియా పేస్‌గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా శనివారం చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు నెటిజన్లను అయోమయానికి గురి చేస్తుండగా మరికొందరికి నవ్వులు పూయిస్తోంది...

Updated : 13 Feb 2022 10:57 IST

(Photo: Jasprit Bumrah)

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా పేస్‌గుర్రం జస్ప్రిత్‌ బుమ్రా శనివారం చేసిన ఓ ట్వీట్‌ ఇప్పుడు నెటిజన్లను అయోమయానికి గురి చేస్తుండగా మరికొందరికి నవ్వులు పూయిస్తోంది. ఆ ట్వీట్‌లో అతడు ఎలాంటి పదాలు వాడకున్నా కేవలం రెండు ఎమోజీలతోనే తన ఆలోచనలు పంచుకున్నాడు. ఒకటి నవ్వుతున్న ఎమోజీ ఉండగా మరొకటి తలపట్టుకున్న ఎమోజీని జతచేశాడు. దీంతో ఆ ట్వీట్‌కు నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.

శనివారం ఐపీఎల్‌ మెగా వేలం తొలి రోజు దీపక్‌ చాహర్‌ రూ.14 కోట్లు, ప్రసిద్ధ్‌ కృష్ణ రూ.10 కోట్లు, అవేశ్‌ ఖాన్‌ రూ.10 కోట్ల చొప్పున భారీ మొత్తం దక్కించుకున్నారు. వీళ్ల ధరలు చూశాక బుమ్రా కూడా వేలంలో పాల్గొంటే బాగుండేదని అనుకుంటుండొచ్చని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ స్టార్‌ పేసర్ ముంబయి ఇండియన్స్‌లో కీలక ఆటగాడనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ వేలానికి ముందు ఆ జట్టు అతడిని రూ.12 కోట్లకు అలాగే కొనసాగించుకొంది. ఈ నేపథ్యంలోనే బుమ్రా సరదాగా వేలంలో పాల్గొని ఉంటే బాగుండేదేమో అని భావించి ఉండొచ్చని నెటిజన్లు భావిస్తున్నారు.




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని