Mega Auction: ఈ ఆటగాళ్లకు ఎందుకంత ధర?
ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగులు ఉన్నా ఉండే క్రేజే వేరు. ఏటా ఆటగాళ్ల వేలం నుంచి టోర్నీ పూర్తయ్యేవరకు విశేషమైన ఆదరణ కలిగిన నంబర్ వన్ ఈవెంట్గా దీనికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది...
ప్రపంచంలో ఎన్ని క్రికెట్ లీగులు ఉన్నా భారత్లోని దేశవాళీ టీ20 టోర్నీకి ఉండే క్రేజే వేరు. ఏటా ఆటగాళ్ల వేలం నుంచి టోర్నీ పూర్తయ్యేవరకు అద్భుతమైన ఆదరణ కలిగిన నంబర్ వన్ ఈవెంట్గా దీనికి గుర్తింపు ఉంది. అది డబ్బు పరంగా అయినా, ఆటగాళ్లకు దక్కే ఫేమ్ పరంగా చూసినా దీనికి మరే లీగ్ సాటిరాదు. అలాంటి టోర్నీలో రాబోయే సీజన్కు జరిగిన మెగా వేలంలో పలువురు ఆటగాళ్లు ఊహించని ధర పలికారు. అందులో ఎవరున్నారో.. వారికి అంత మొత్తం ఎందుకు దక్కిందో తెలుసుకుందాం.
వయసుతో పాటు టాలెంట్..
ఈసారి వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా ఇషాన్ కిషన్ రికార్డు నెలకొల్పాడు. ముంబయి అనూహ్యంగా రూ.15.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో వేలంలో అత్యధిక ధర పలికిన టీమ్ఇండియా రెండో క్రికెటర్గా నిలిచాడు. ఇదివరకు యువరాజ్ సింగ్ను దిల్లీ టీమ్ అత్యధికంగా రూ.16 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక 2018లో ముంబయి రూ.6.4 కోట్లకు ఇషాన్ను కొనుగోలు చేయగా ఈసారి భారీ మొత్తం వెచ్చించడానికీ కారణాలు లేకపోలేదు. అతడి వయసు ఇప్పుడు 23 ఏళ్లు ఉండగా.. గతకొన్నేళ్లుగా టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్గా, కీపర్గా రాణిస్తున్నాడు. దూకుడు కలిగిన బ్యాట్స్మన్ కావడంతో పాటు వయస్సులో చిన్నవాడు కావడంతో ఇషాన్ను తీసుకోడానికి ముంబయి సిద్ధపడింది. దీంతో అతడిని భవిష్యత్ నాయకుడిగానూ తీర్చిదిద్దొచ్చు అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఉంటుంది.
బౌలింగ్తో పాటు బ్యాటింగ్..
ఈ వేలంలో రెండో అత్యధిక ధర పలికిన ఆటగాడు దీపక్ చాహర్. అతడిని వదిలేసుకున్న చెన్నై జట్టే తిరిగి భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. రికార్డు స్థాయిలో రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది. 2016, 17 సీజన్లలో పుణె జట్టు తరఫున ధోనీ సారథ్యంలోనే ఆడిన చాహర్ 2018లో రూ.80లక్షలకు చెన్నై గూటికి చేరాడు. దీంతో అప్పటి నుంచి ఆ జట్టులో ప్రధాన పేసర్గా కొనసాగుతున్నాడు. అయితే, చాహర్ పవర్ప్లేలో వికెట్లు తీసే బౌలర్ మాత్రమే కాకుండా లోయర్ ఆర్డర్లో ధాటిగా బ్యాటింగ్ చేసే సత్తా కూడా ఉన్న ఆటగాడు. అందువల్లే చెన్నై టీమ్ చాహర్ను వేలంలో పోటీ పడి కొనుగోలు చేసింది. కాగా, రూ.2 కోట్ల కనీస ధరతో మెగా వేలంలో అడుగుపెట్టిన చాహర్ను సొంతం చేసుకోడానికి హైదరాబాద్, దిల్లీ జట్లు తొలుత ఆసక్తి చూపాయి. అతడి కోసం పోటాపోటీ నెలకొనగా రూ.10 కోట్ల ధర దాటగానే చెన్నై వేలంలోకి వచ్చింది. దీంతో చివరికి అతడిని సొంతం చేసుకొని అత్యధిక మొత్తం చెల్లించేందుకు సిద్ధమైంది.
అనుభవంతో పాటు కెప్టెన్సీ..
మెగా వేలంలో అత్యధిక ధర పలికిన మూడో ఆటగాడు కూడా టీమ్ఇండియా క్రికెటర్ కావడం విశేషం. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్, సారథిగా రాణిస్తున్న శ్రేయస్ అయ్యర్ను కోల్కతా రూ.12.25 కోట్లకు దక్కించుకుంది. దీంతో ఈ వేలంలో అదిరిపోయే మొత్తాన్ని సొంతం చేసుకున్న ఆటగాళ్ల జాబితాలో ఈ దిల్లీ మాజీ సారథి మూడో స్థానంలో నిలిచాడు. శ్రేయస్ మొదటి నుంచి దిల్లీ జట్టులోనే కొనసాగుతున్నా 2018 పగ్గాలు అందుకున్నాడు. ఆ ఏడాది విఫలమైనా తర్వాతి సీజన్ నుంచి దిల్లీ విశేషంగా రాణిస్తోంది. శ్రేయస్ బ్యాట్స్మన్గానే కాకుండా కెప్టెన్గానూ ఆ జట్టును మరోస్థాయికి తీసుకెళ్లాడు. అయితే, గతేడాది గాయం కారణంగా భారత్లో జరిగిన తొలి దశలో ఆడలేదు. అప్పుడు పంత్ కెప్టెన్సీ చేపట్టి ఆకట్టుకున్నాడు. ఇక యూఏఈలో నిర్వహించిన రెండో దశ కల్లా శ్రేయస్ కోలుకొని జట్టులో చేరినా జట్టు యాజమాన్యం పంత్నే కెప్టెన్గా కొనసాగించింది. అయితే, శ్రేయస్ను ఈ సీజన్కు ముందు వదిలేయడంతో కోల్కతా భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో కెప్టెన్గా, బ్యాట్స్మన్గా అతడికున్న అనుభవం గమనించే ఆ జట్టు తీసుకొని ఉంటుంది.
హిట్టింగ్తో పాటు స్పిన్నింగ్..
ఇక ఈసారి అత్యధిక ధర పలికిన విదేశీ ఆటగాళ్లలో ఇంగ్లాండ్ ఆల్రౌండర్ లియామ్ లివింగ్స్టోన్ నిలిచాడు. అతడిని పంజాబ్ ఏకంగా రూ.11.50 కోట్లకు దక్కించుకుంది. పొట్టి ఫార్మాట్లో హార్డ్ హిట్టింగ్ బ్యాటింగ్తో పాటు మిడిల్ ఆర్డర్లో స్పిన్ బౌలింగ్ చేయగల సమర్థుడు ఈ ఇంగ్లిష్ ఆల్రౌండర్. అలాగే గతేడాది జరిగిన ది హండ్రెడ్ లీగ్లో 27 సిక్సులతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అది మాత్రమే కాకుండా పొట్టి క్రికెట్లో అతడి స్ట్రైక్రేట్ సుమారు 158గా ఉంది. దీంతో అతడిని దక్కించుకునేందుకు ఇతర జట్లు కూడా వేలంలో పోటీపడ్డాయి. తొలుత కోల్కతా, చెన్నై గుజరాత్, హైదరాబాద్ జట్లు సైతం ఆసక్తి చూపాయి. చివరికి పంజాబ్ భారీ మొత్తానికి కొనుగోలు చేసి లివింగ్స్టోన్ను దక్కించుకొంది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్లో న్యూజిలాండ్ క్రికెట్ ప్రసార హక్కులు ఎస్పీఎన్ఐ సొంతం
న్యూజిలాండ్ పురుషుల (బ్లాక్ క్యాప్స్), మహిళల (వైట్ ఫెర్న్స్) క్రికెట్ జట్ల మ్యాచ్లను వచ్చే ఏడేళ్ల పాటు భారత్, అనుబంధ ప్రాంతాల్లో ప్రసారం చేసేందుకు సోనీ పిక్చర్స్ నెట్వర్క్ ఇండియా (ఎస్పీఎన్ఐ) టెలివిజన్, డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు. -
రసవత్తరంగా సాగుతున్న మెగా లీగ్.. తొలి రోజు వీక్షణల్లోనూ రికార్డే
దాదాపు రెండు నెలలపాటు క్రికెట్ అభిమానులను అలరించే ఐపీఎల్.. రికార్డులను ఖాతాలో వేసుకుంటోంది. -
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
రోహిత్ స్థానంలో హార్దిక్ పాండ్యను ముంబయి మేనేజ్మెంట్ కెప్టెన్గా నియమించుకుంది. దీంతో సోషల్ మీడియాలో ఆ ఫ్రాంచైజీపై ట్రోలింగ్ వచ్చింది. ఇప్పుడు ముంబయి వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిపోవడంతో పాండ్య సారథ్యంపై విమర్శల దాడి ఎక్కువైంది. -
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
తన అభిమాన క్రికెటర్తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎప్పటికీ మరిచిపోలేనని చెన్నై ఆటగాడు సమీర్ రిజ్వీ వ్యాఖ్యానించాడు. -
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
కోల్కతా ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిత్ వల్ల చాలామంది విదేశీ క్రికెటర్లు ఇబ్బందిపడ్డారని నమీబియా క్రికెటర్ వ్యాఖ్యానించడం సంచలనమైంది. -
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
ముంబయి బౌలర్లు భారీగా పరుగులు ఇవ్వడంతో హైదరాబాద్ రికార్డు స్కోరును నమోదు చేసి చరిత్ర సృష్టించింది. దీంతో ఐపీఎల్ 17వ సీజన్లో తొలి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. -
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్గా మారిన కావ్యా మారన్
కావ్యా మారన్.. సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ యజమాని. ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంతో ఆమె ఒక్కసారిగా నెట్టింట వైరల్గా మారారు. -
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం