IPL 2022 : ఐపీఎల్ 2022 పూర్తి షెడ్యూల్.. గత ఫైనలిస్ట్ల మధ్యే తొలి మ్యాచ్
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్...
ఇంటర్నెట్ డెస్క్ : టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. మార్చి 26వ తేదీ నుంచి ఐపీఎల్ పోటీలు ప్రారంభమవుతాయని బీసీసీఐ వెల్లడించిన విషయం తెలిసిందే. ముంబయి, పుణె నగరాల్లోని నాలుగు మైదానాల్లో దాదాపు 65 రోజులపాటు 70 లీగ్ మ్యాచ్లు, నాలుగు ప్లేఆఫ్స్ మ్యాచ్లు జరుగుతాయని బీసీసీఐ పేర్కొంది. ఐపీఎల్ - 15వ (IPL 2022) సీజన్ చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్రైడర్స్ జట్ల మధ్య మ్యాచ్తో ఆరంభమవుతుందని వెల్లడించింది. వాంఖడే స్టేడియం వేదికగా మార్చి 26వ తేదీ శనివారం రాత్రి 7.30 గంటలకు తొలి మ్యాచ్ జరుగుతుందని తెలిపింది. గత సీజన్లో ఈ రెండు జట్లు ఫైనల్కు వచ్చాయి. కేకేఆర్పై సీఎస్కే విజయం సాధించి టైటిల్ను సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2022 సీజన్లో మొత్తం పది జట్లు రెండు గ్రూప్లుగా విడిపోయి పోటీపడతాయి. ఒక్కో జట్టు 14 మ్యాచ్లను ఆడుతుంది. మార్చి 27వ తేదీ నుంచి డబుల్ హెడ్డర్ (రోజుకు రెండు మ్యాచ్లు) ప్రారంభమవుతుందని బీసీసీఐ షెడ్యూల్లో పేర్కొంది. ‘‘పుణె వేదికగా మొదటి మ్యాచ్ మార్చి 29న ఎంసీఏ స్టేడియంలో జరుగుతుంది. సన్రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. వాంఖడే, డీవై పాటిల్ స్టేడియంలో 20 మ్యాచ్లు, బ్రాబోర్నె, ఎంసీఏ మైదానాల్లో పదిహేనేసి మ్యాచ్లు నిర్వహిస్తాం’’ అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. ఐపీఎల్ 15వ సీజన్ మ్యాచ్లు మార్చి 26 నుంచి ప్రారంభమై మే 29న ముగుస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.