IPL 2022: పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్.. అందరూ ఊహించిన ఆటగాడే..
ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో అందరూ ఊహించినట్టే పంజాబ్ కింగ్స్ యాజమాన్యం మయాంక్ అగర్వాల్ను కెప్టెన్గా నియమించింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ట్వీట్...
ఇంటర్నెట్డెస్క్: ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో అందరూ ఊహించినట్టే పంజాబ్ కింగ్స్ యాజమాన్యం మయాంక్ అగర్వాల్ను కెప్టెన్గా నియమించింది. కొద్దిసేపటి క్రితమే అధికారికంగా ట్వీట్ చేసి ఈ విషయాన్ని అభిమానులకు వెల్లడించింది. 2008 ఆరంభ సీజన్ నుంచీ ఈ జట్టు ఐపీఎల్ టోర్నీలో ఆడుతున్నా.. ఇప్పటివరకు ట్రోఫీ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఎంత మంది కెప్టెన్లను మార్చినా పంజాబ్ తలరాత మాత్రం మారలేదు.
అయితే, గత రెండేళ్లు ఆ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన కేఎల్ రాహుల్ ఈసారి కొత్త ఫ్రాంఛైజీ లఖ్నవూ సూపర్ జెయింట్స్కు సారథిగా వెళ్లిపోవడంతో ఆ బాధ్యతలు ఇప్పుడు మయాంక్ చేతికి అందాయి. కాగా, వీరిద్దరూ గత రెండేళ్లు పంజాబ్ తరఫున అత్యుత్తమ ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించడం గమనార్హం. ఈ క్రమంలోనే జట్టు యాజమాన్యం మయాంక్కు తొలిసారి జట్టు పగ్గాలు అప్పగించింది. ఇక ఐపీఎల్లో తొలిసారి కెప్టెన్సీ అందుకున్న అతడు ఈ బాధ్యతలు నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నాడు. అలాగే తాను గర్వంగానూ ఫీల్ అవుతున్నట్లు చెప్పాడు. మరోవైపు ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే ఆకాంక్ష వెలిబుచ్చాడు. కాగా, ఐపీఎల్ 2022కు సంబంధించిన రిటెన్షన్ ఆటగాళ్ల జాబితాలో పంజాబ్ కేవలం ఇద్దర్ని మాత్రమే అట్టిపెట్టుకుంది. అందులో ఒకరు మయాంక్ ఉండగా మరొకరు యువ బౌలర్ అర్ష్దీప్ సింగ్ ఉన్నాడు.
ఇక మిగిలిన 23 మందిని ఇటీవల నిర్వహించిన మెగా వేలంలో పంజాబ్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అందులో శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో లాంటి ఆటగాళ్లను తీసుకోవడంతో కెప్టెన్సీ రేసులో వీరూ ఉంటారని భావించారు. కానీ, జట్టు యాజమాన్యం మయాంక్పైనే నమ్మకం ఉంచింది. దీంతో అతడికే పగ్గాలు అందజేసింది. ఈ విషయంపై స్పందించిన పంజాబ్ కోచ్ అనిల్ కుంబ్లే.. మయాంక్ 2018 నుంచీ తమ జట్టులో అంతర్భాగమని చెప్పాడు. అతడు గడిచిన రెండేళ్లలో కెప్టెన్సీ వ్యవహారాల్లోనూ పాలుపంచుకున్నాడని తెలిపాడు. ఇక తాము ఇటీవల వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లలో ప్రతిభావంతులైన యువకులతో పాటు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు ఉన్నారన్నాడు. దీంతో మయాంక్ సారథ్యంలో భవిష్యత్లో జట్టును మరింత బలోపేతంగా తీర్చిదిద్దాలనుకుంటున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశాడు. మయాంక్కు కెప్టెన్సీ చేపట్టే అన్ని అర్హతలూ ఉన్నాయని, అతడితో కలిసి పని చేసేందుకు ఆసక్తిగా ఉన్నానని కుంబ్లే పేర్కొన్నాడు.
వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు..
శిఖర్ ధావన్ (రూ.8.25 కోట్లు)
కగీసో రబాడ (రూ.9.25 కోట్లు)
జానీ బెయిర్స్టో (రూ.6.75 కోట్లు)
రాహుల్ చాహర్ (రూ.5.25 కోట్లు)
హర్ప్రీత్ బ్రార్ (రూ.3.8 కోట్లు)
షారుఖ్ ఖాన్ (రూ.9 కోట్లు)
ప్రభ్సిమ్రన్ సింగ్ (రూ.60 లక్షలు)
జితేశ్ శర్మ(రూ.20 లక్షలు)
ఇషాన్ పోరెల్ (రూ.3.8 కోట్లు)
లియామ్ లివింగ్స్టోన్ (రూ.11.5 కోట్లు)
ఓడియన్ స్మిత్ (రూ.6 కోట్లు)
సందీప్ శర్మ (రూ.90 లక్షలు)
రాజ్ అంగడ్ బవా (రూ.2 కోట్లు)
రిషి ధావన్ (రూ.55 లక్షలు)
ప్రేరక్ మన్కడ్ (రూ.20 లక్షలు)
వైభవ్ అరోరా (రూ.2 కోట్లు)
రితిక్ ఛటర్జీ (రూ.20 లక్షలు)
బాల్తేజ్ ధండా (రూ.20లక్షలు)
అన్ష్ పటేల్ (రూ.20 లక్షలు)
నాథన్ ఎలీస్ (రూ.75 లక్షలు)
అథర్వ తైడే (రూ.20 లక్షలు)
భానుక రాజపక్స (రూ.50 లక్షలు)
బెన్నీ హోవెల్ (రూ.40 లక్షలు)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో అత్యంత దారుణంగా ట్రోలింగ్కు గురైన కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya). ఏ మైదానంలో చూసినా అతడిని హేళన చేస్తూ ఫ్యాన్స్ హోరెత్తించారు. -
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
లఖ్నవూ చేతిలో చెన్నైకి వరుసగా రెండో ఓటమి ఎదురైంది. ఈసారి సొంత మైదానంలోనే పరాజయం పొందడంతో ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. -
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
మరో మూడు రోజుల్లో టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇర్ఫాన్ పఠాన్ తన టీమ్ను వెల్లడించాడు. -
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
David Warner: దిల్లీ ఆటగాడు డేవిడ్ వార్నర్.. భారత గుర్తింపు కార్డు ఆధార్ కోసం పరిగెడుతున్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇందులో అతడు హిందీలో మాట్లాడటం విశేషం. -
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
సెంచరీతో చెన్నైపై భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో లఖ్నవూ బ్యాటర్ స్టాయినిస్ కీలక పాత్ర పోషించాడు. ఒకదశలో ఓడిపోతామని భావించిన ఆ జట్టును చివరి వరకూ క్రీజ్లో ఉండి విజయతీరాలకు చేర్చాడు. -
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
చెన్నై కెప్టెన్ రుతురాజ్ సెంచరీతో అలరించినా.. లఖ్నవూ జట్టే విజయం సాధించింది. మార్కస్ స్టాయినిస్ కీలకమైన శతకంతో తన జట్టును గెలిపించాడు. -
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు