IPL 2022: పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌ మయాంక్‌ పేరు ఖరారు‌! త్వరలోనే ప్రకటన..

త్వరలో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త సారథిగా మయాంక్‌ అగర్వాల్‌ను నియమిస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు...

Published : 24 Feb 2022 13:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: త్వరలో జరగబోయే ఐపీఎల్ 2022 మెగా టోర్నీలో పంజాబ్‌ కింగ్స్‌ కొత్త సారథిగా మయాంక్‌ అగర్వాల్‌ను నియమిస్తున్నట్లు ఓ అధికారి మీడియాకు తెలిపారు. అయితే, దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందన్నారు. ఈసారి మెగా వేలానికి ముందు పంజాబ్‌ ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే అట్టిపెట్టుకున్న సంగతి తెలిసిందే. అందులో ఒకరు ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కాగా, మరొకరు యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ ఉన్నారు. దీంతో ఈసారి అధిక మొత్తంతో వేలంలో పాల్గొన్న పంజాబ్‌ జట్టు పేరున్న ఆటగాళ్లను కొనుగోలు చేసింది. శిఖర్‌ ధావన్‌, జానీ బెయిర్‌స్టో, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, కగీసో రబాడ లాంటి స్టార్‌ ఆటగాళ్లను దక్కించుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్త సారథిగా ధావన్‌కు అవకాశం ఇస్తారని భావించినా జట్టు యాజమాన్యం మయాంక్‌ వైపే మొగ్గు చూపిందని ఆయన చెప్పారు. కాగా, గత రెండేళ్లుగా పంజాబ్‌కు కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన కేఎల్‌ రాహుల్‌ ఈసారి కొత్త జట్టు లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌కు వెళ్లిపోయాడు. దీంతో అతడు ఆ జట్టుకు కెప్టెన్సీ చేపట్టనున్నాడు. ఇక గత రెండేళ్లుగా రాహుల్‌కు జోడీగా అదిరిపోయే బ్యాటింగ్‌ చేసిన మయాంక్‌ను ఈసారి సారథిగా నియమించాలని జట్టు యాజమాన్యం నిర్ణయించుకున్నట్లు ఆ అధికారి వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని