IPL 2022: ఐపీఎల్లో విరాట్ కోహ్లీకి జోడీగా స్టార్ బ్యాట్స్మన్!
మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి రెండు కొత్త జట్లు రావడంతో పాటు మెగా వేలం నిర్వహించడంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు...
ఇంటర్నెట్డెస్క్: మరికొద్ది రోజుల్లో ఐపీఎల్-15 సీజన్ ప్రారంభంకానుంది. ఈసారి రెండు కొత్త జట్లు రావడంతో పాటు మెగా వేలం నిర్వహించడంతో అన్ని జట్లలోని ఆటగాళ్లు పూర్తిగా మారిపోయారు. దీంతో ప్రతి జట్టు ఈసారి కొత్త ఆలోచనలు, కొత్త కాంబినేషన్లను అనుసరించేందుకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సైతం ఈసారి టాప్ ఆర్డర్లో మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. ఆ జట్టు అట్టిపెట్టుకున్న ఆటగాళ్లలో మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మాక్స్వెల్, మహ్మద్ సిరాజ్ మాత్రమే ఉన్నారు. ఇక మిగతావారందర్నీ వేలంలోనే కొనుగోలు చేసింది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఆటగాడు దక్షిణాఫ్రికా స్టార్ బ్యాట్స్మన్ ఫా డుప్లెసిస్. అతడిని ఈ ఫ్రాంఛైజీ రూ.7 కోట్ల అత్యధిక ధర వెచ్చించి మరీ కొనుగోలు చేయడం విశేషం. దీంతో టాప్ఆర్డర్లో అతడికి కోహ్లీకి తోడుగా బరిలోకి దింపాలని ఆ జట్టు భావిస్తోంది. అందుకు సంబంధించిన ఓ మార్ఫింగ్ ఫొటోను కూడా ఆర్సీబీ ట్విటర్లో పంచుకుంది.
కోహ్లీ, డుప్లెసిస్ ఆర్సీబీ జెర్సీలో ఉన్నట్లు రూపొందించిన ఫొటోను ట్విటర్లో పోస్టు చేసి ‘భవిష్యత్కు సంబంధించిన ఫొటో ఇది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లు కలిసి బరిలోకి దిగితే చూడాలని ఆసక్తిగా ఉంది’ అని వ్యాఖ్యానాలు జోడించింది. దీంతో వీరిద్దరూ కలిసి ఓపెనింగ్ చేసే వీలుందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు కోహ్లీ గతేడాది కెప్టెన్సీ పగ్గాలు వదిలేయడంతో ఆ బాధ్యతలు ఎవరు చేపడతారా అనే ఆసక్తి మొదలైంది. మెగా వేలం పూర్తయి చాలా రోజులైనా ఇంకా ఆర్సీబీ కొత్త సారథి పేరు వెల్లడించలేదు. దీంతో ఈ విషయంపైనా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆ బాధ్యతల్ని డుప్లెసిస్ లేదా మాక్స్వెల్కు అప్పగించాలని అంటున్నారు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం ఎవరిని ఎంపి చేస్తుందో చూడాలి. ఇక డుప్లెసిస్ గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. అతడు 14వ సీజన్లో రుతురాజ్ (635) తర్వాత అత్యధిక పరుగులు (633) చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ నేపథ్యంలోనే టాప్ ఆర్డర్లో డుప్లెసిస్ రాణిస్తాడని ఆర్సీబీ భావించి వేలంలో కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)