T20 League: అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసింది వీళ్లే
టీ20 లీగ్ అంటేనే బ్యాట్స్మెన్కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు...
పరుగుల వరద పారే టోర్నీలో మెరిసిన బౌలర్లు
టీ20 లీగ్ అంటేనే బ్యాట్స్మెన్కు పరుగుల పంట. బౌలర్లు ఎలాంటి బంతులేసినా వాటిని బౌండరీలకు తరలించడమే వారి పని. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం చెలాయించాలనుకుంటారు. అయితే.. పలువురు బౌలర్లు అత్యుత్తమ గణాంకాలు కూడా నమోదు చేశారు. ముఖ్యంగా మెయిడిన్ ఓవర్లు వేసి ఆకట్టుకున్నారు.
ప్రవీణ్ కుమార్ @ 14..
అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసింది ఒకప్పటి టీమ్ఇండియా మీడియం పేస్ బౌలర్ ప్రవీణ్కుమార్. అతడు 2008 నుంచి 2017 వరకు బెంగళూరు, పంజాబ్, ముంబయి, హైదరాబాద్ జట్ల తరఫున ప్రాతినిధ్యం వహించాడు. ఈ క్రమంలోనే 119 మ్యాచ్లు ఆడి 420.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మొత్తం 90 వికెట్లు తీయడంతో పాటు 14 ఓవర్లు మెయిడిన్గా వేశాడు. అతడి సగటు 36.12 కాగా, ఎకానమీ 7.72. దీన్ని బట్టి ఎంత పొదుపుగా బౌలింగ్ చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఇక ప్రవీణ్ 2017లో చివరిసారి ఈ టోర్నీలో ఆడినా ఇప్పటికీ లీగ్లో అత్యధిక మెయిడిన్ ఓవర్లు వేసిన బౌలర్గా ఉన్నాడు.
ఇర్ఫాన్ పఠాన్ @ 10..
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచింది కూడా భారత ఆటగాడే. అతడే మాజీ పేస్ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్. టోర్నీ ఆరంభ సీజన్ నుంచి 2017 వరకూ ఆడిన అతడు.. పంజాబ్, దిల్లీ, హైదరాబాద్, చెన్నై, పుణె, గుజరాత్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఇర్ఫాన్ మొత్తం 103 మ్యాచ్ల్లో 340.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 80 వికెట్లు తీయడమే కాకుండా 10 మెయిడిన్ ఓవర్లు సాధించాడు. సగటు 33.11 ఉండగా ఎకానమీ 7.77గా నమోదు చేశాడు. అతడు కూడా 2017లోనే చివరిసారి ఆడడం గమనార్హం.
భువనేశ్వర్ @ 9..
ఈ జాబితాలో ప్రస్తుత హైదరాబాద్ కీలక పేసర్ భువనేశ్వర్ కుమార్ మూడో స్థానంలో ఉన్నాడు. అతడు టోర్నీ ఆరంభం నుంచి ఆడుతున్నాడు. బెంగళూరు జట్టుతో అరంగేట్రం చేసిన భువి తర్వాత పుణె, ఆపై హైదరాబాద్ జట్లలో భాగమయ్యాడు. ఇక 2014 నుంచి హైదరాబాద్తోనే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు మొత్తం 132 మ్యాచ్లు ఆడిన స్వింగ్ బౌలర్ 491.3 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అందులో 142 వికెట్లు పడగొట్టడమే కాకుండా 9 మెయిడిన్ ఓవర్లు నమోదు చేశాడు. కాగా, 28.76 సగటుతో పై ఇద్దరికన్నా మెరుగ్గా ఉన్నాడు. ఎకానమీ 8.30గా నమోదైంది.
ఆ తర్వాత ఎవరున్నారంటే..
ఇక టాప్-3 తర్వాత మిగిలిన వారిలో ధావల్ కుల్కర్ణి, లసిత్ మలింగ, సందీప్ శర్మ 8 (సమానం) మెయిడిన్ ఓవర్లతో వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో నిలిచారు. ఆపై డేల్ స్టెయిన్ 7, దీపక్ చాహర్, అమిత్ మిశ్రా, హర్భజన్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, ఇషాంత్ శర్మ 6 మెయిడిన్లతో కొనసాగుతున్నారు.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు