IPL 2023: ‘ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచేది ఆ జట్టే’.. ముంబయి, చెన్నైలకు నో ఛాన్స్!
ఐపీఎల్-16 (IPL 16) సీజన్లో టైటిల్ను అందుకునే జట్టేదో దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్ జాక్వెస్ కలిస్ (Jacques Kallis) అంచనా వేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్-16 (IPL) సీజన్ వచ్చేసింది. శుక్రవారం (మార్చి 31) నుంచే ఈ మెగా టీ20 లీగ్ ప్రారంభంకానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్తో లీగ్కు తెరలేవనుంది. అయితే, ఇంకా మ్యాచ్లు మొదలవ్వకముందే ఈ సారి ఏ జట్టు విజేతగా నిలుస్తుందనే దానిపై విశ్లేషణలు వెలువడుతున్నాయి. దక్షిణాఫ్రికా మాజీ ఆల్రౌండర్, ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్రైడర్స్ తరఫున ఆడిన అనుభవం ఉన్న జాక్వెస్ కలిస్ (Jacques Kallis) ఐపీఎల్-16లో టైటిల్ను అందుకునే జట్టేదో అంచనా వేశాడు. ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య ఫైనల్ జరుగుతుందని.. టైటిల్ పోరులో రోహిత్ సేనను ఓడించి దిల్లీ తొలిసారి ఛాంపియన్గా నిలుస్తుందని కలిస్ జోస్యం చెప్పాడు.
‘ఐపీఎల్ ప్లే ఆఫ్స్లో ఏ జట్లు ఉండబోతున్నాయో అంచనా వేయడం కష్టం. ఎందుకంటే జట్లు చాలా తీవ్రంగా పోటీపడి దాదాపు సమాన స్థితిలో నిలుస్తాయి. కానీ, ఈ సంవత్సరం ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ ఫైనల్కు చేరుకుంటాయని అనిపిస్తోంది. ముంబయిని ఓడించి దిల్లీ క్యాపిటల్స్ టైటిల్ సాధిస్తుందని భావిస్తున్నా’ అని జాక్వెస్ కలిస్ అన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధికంగా ముంబయి ఇండియన్స్ ఐదుసార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్గా నిలిచింది. దిల్లీ క్యాపిటల్స్ ఒక్కటంటే ఒక్కసారిగా కప్ గెలవలేకపోయింది. 2020లో రన్నరప్గా నిలవడమే ఆ జట్టుకు అత్యుత్తమ ప్రదర్శన.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం
-
పనసపండు గుర్తు ఎక్కడ?.. గందరగోళానికి గురైన ఓటర్లు
-
బాబు సీఎం అయ్యే వరకు పాదరక్షలు ధరించనని..!