IPLతోనే ఆ ఆత్మవిశ్వాసం: అవేశ్
ఐపీఎల్-21లో ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని దిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ అన్నాడు. మ్యాచులు గెలవడం, పాయింట్ల పట్టికలో....
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్-21లో ప్రదర్శన తన ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని దిల్లీ క్యాపిటల్స్ పేస్ బౌలర్ అవేశ్ ఖాన్ అన్నాడు. మ్యాచులు గెలవడం, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండటం సంతోషకరమని పేర్కొన్నాడు. ఈ సీజన్లో 8 మ్యాచులాడిన అతడు 14 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. దేశవాళీ క్రికెట్లో మధ్య ప్రదేశ్కు ఆడే అవేశ్ ఇంగ్లాండ్ పర్యటనకు స్టాండ్బైగా ఎంపికైన సంగతి తెలిసిందే.
‘నాకు అప్పగించిన బాధ్యతను చక్కగా ఉపయోగించుకున్నా. మ్యాచుల్లో ప్రతి దశలో బౌలింగ్ చేశాను. కొత్త బంతితో, మధ్య ఓవర్లు, ఆఖరి ఓవర్లలో బౌలింగ్ చేశాను. దిల్లీ క్యాపిటల్స్ కోచ్లు, కెప్టెన్ నాలో ఆత్మవిశ్వాసం నింపారు. ప్రతి సందర్భంలోనూ నేను రాణించాను’ అని అవేశ్ అన్నాడు.
‘దేశవాళీ క్రికెట్లో రెండు సీజన్లుగా నేనెంతో రాణిస్తున్నాను. కానీ ఐపీఎల్ మాత్రం నన్ను వెలుగులోకి తెచ్చింది. ముస్తాక్ అలీ ట్రోఫీలోనూ ఈ ఏడాది 5 మ్యాచుల్లో 14 వికెట్లు తీశాను. రంజీల్లో నిలకడగా సరైన లెంగ్తుల్లో బంతులు వేయడం కీలకం. ఎంత ఎక్కువ నిలకడగా ఆడితే అంత ఎక్కువ మెరుగవుతాను. ఇక టెస్టు మ్యాచులకు సహనం ఎక్కువ అవసరం’ అని అవేశ్ తెలిపాడు.
ఐపీఎల్ వల్ల తన ఆత్మవిశ్వాసం ఎంతగానో పెరిగిందని ఖాన్ అన్నాడు. లీగులో ఆడటం వల్ల ఉపయోగం ఇదేనన్నాడు. ఏకాగ్రత పెరుగుతుందని, ఒత్తిడిలో నేర్చుకోనే అవకాశం లభిస్తుందని చెప్పాడు. అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలమన్న ధైర్యం లభించిందన్నాడు.
ఏకాగ్రతతో 100% బౌలింగ్ చేయాలని డీసీ కోచ్ రికీ పాంటింగ్ తనకు చెప్పాడని అవేశ్ తెలిపాడు. రిషభ్ సారథి కావడం తనకు కలిసొచ్చిందని, గతంలో అతడితో కలిసి ఆడిన అనుభవం ఉందన్నాడు. మ్యాచులు ముగిశాక చేసిన పొరపాట్ల గురించి తామిద్దరం చర్చించుకొనే వాళ్లమని వివరించాడు. శారీరక దారుఢ్యం కోసం ఓ డైటీషియన్ను నియమించుకున్నానని వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
రివ్యూ: మై డియర్ దొంగ.. అభినవ్ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?
-
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
-
‘అవి డ్రోన్లు కాదు.. మాకు ఆటబొమ్మలే’.. ఇజ్రాయెల్ను హేళన చేసిన ఇరాన్
-
మా పేర్లు చెప్పాలని వారిని చిత్రహింసలు పెడుతున్నారు: బొండా ఉమా
-
యాక్టర్ జగన్.. ఎన్నికల లబ్ధికి ఉత్తుత్తి శిబిరాలు
-
కేరళలో ఒక్క ఓటరు కోసం.. అడవిలో 18 కి.మీ. ప్రయాణం