IPLతో పోలికా? ఈ పాక్ పేసర్ మాటేంటంటే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సాటి రాగల క్రికెట్ లీగ్ మరొకటి లేదని పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అన్నాడు. ...
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్కు సాటి రాగల క్రికెట్ లీగ్ మరొకటి లేదని పాకిస్థాన్ పేసర్ వాహబ్ రియాజ్ అన్నాడు. అది ప్రపంచంలోనే అత్యుత్తమ క్రికెట్ లీగ్ అని పేర్కొన్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్తో దానికి పోలికే లేదని తెలిపాడు. నాణ్యమైన బౌలింగ్కు మాత్రం పీఎస్ఎల్ చిరునామాగా వర్ణించాడు.
ప్రపంచంలో ముందుగా మొదలైన క్రికెట్ లీగ్ ఐపీఎల్. ఎంతోమంది మేటి క్రికెటర్లు ఇందులో భాగం అయ్యారు. కెవిన్ పీటర్సన్, సనత్ జయసూర్య, కుమార సంగక్కర, బ్రెట్ లీ, రికీ పాంటింగ్, ఆడమ్ గిల్ క్రిస్ట్ సహా అలనాటి క్రికెట్ హీరోలు ఈ లీగ్ ఆడారు. ప్రస్తుత టాప్ ఆటగాళ్లు సైతం ఆడుతూ కోట్లు ఆర్జిస్తున్నారు. లీగులో ఆడిన కుర్రాళ్లు అంతర్జాతీయంగా అదరగొడుతున్నారు.
‘అంతర్జాతీయంగా అత్యుత్తమ క్రికెటర్లు ఐపీఎల్ ఆడతారు. అందుకే పీఎస్ఎల్ను ఐపీఎల్తో పోల్చకూడదు. ఐపీఎల్ది మరో స్థాయి. వారి అంకితభావం, నిర్వహణ సామర్థ్యం, కమ్యూనికేషన్స్, ఆటగాళ్ల ముసాయిదా, ఆటగాళ్ల ఎంపిక అంతా భిన్నంగా ఉంటుంది. అందుకే దాంతో ఏ లీగ్ పోటీపడలేదని నా ఉద్దేశం. ఐపీఎల్ తర్వాత స్థానం మాత్రం పీఎస్ఎల్దే. ఇప్పటికే దానిని నిరూపించుకుంది’ అని రియాజ్ అన్నాడు.
పీఎస్ఎల్ బౌలింగ్ ప్రమాణాలు మాత్రం అత్యుత్తమంగా ఉంటాయని రియాజ్ తెలిపాడు. ‘పీఎస్ఎల్ బౌలింగ్ నాణ్యత చాలా ఎక్కువ. ఇందులో ఆడే బౌలర్లు మరే లీగులోనూ కనిపించరు. ఐపీఎల్లోనూ ఉండరు. అందుకే పాక్ లీగులో భారీ స్కోర్ల మ్యాచులు చూడలేం. ప్రపంచంలోనే అత్యుత్తమ బౌలింగ్ దాడులు పీఎస్ఎల్లో ఉంటాయి’ అని అతడు పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)