IPL 2021: చెన్నైకి తిరుగులేదు.. బెంగళూరుకు ఓటమి తప్పలేదు
ఐపీఎల్ 2021 సీజన్ తొలి సగం భాగంలో అద్భుత ప్రదర్శనతో టైటిల్ను సాధించే అవకాశాలను సృష్టించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. యూఏఈ వేదికగా జరుగుతున్న
షార్జా: ఐపీఎల్ 2021 సీజన్ తొలి సగం భాగంలో అద్భుత ప్రదర్శనతో టైటిల్ను సాధించే అవకాశాలను సృష్టించుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. యూఏఈ వేదికగా జరుగుతున్న సెకండ్ హాఫ్లో మాత్రం తేలిపోతోంది. వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓడిపోయింది. మొన్న కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఘోరపరాభవం ఎదుర్కొన్న ఆర్సీబీ.. ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్తోనూ ఓటమి చెందింది. బ్యాటర్లు, బౌలర్ల సమష్టి కృషితో సీఎస్కే విజయం సాధించింది. చెన్నై ఆల్రౌండర్ బ్రావో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. దీంతో పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో చెన్నై అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ఆర్సీబీ (10) మూడో స్థానంలోనే కొనసాగుతున్నప్పటికీ ప్లే ఆఫ్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై చెన్నై సూపర్ కింగ్స్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్లు విజృంభించడంతో ధాటిగా ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆర్సీబీ.. మిడిలార్డర్ తేలిపోవడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో సీఎస్కే నాలుగు వికెట్లను కోల్పోయి 18.1 ఓవర్లలో 157 పరుగులు చేసి విజయం సాధించింది. చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ 38, డుప్లెసిస్ 31, మొయిన్ అలీ 23, అంబటి రాయుడు 32, సురేశ్ రైనా 17*, ధోని 11* పరుగులు చేశారు. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ 2.. చాహల్, మాక్స్వెల్ చెరో వికెట్ పడగొట్టారు.
వారిద్దరే రాణించారు...
ఓపెనర్లు విరాట్ కోహ్లీ (53), పడిక్కల్ (70) అద్భుత అర్ధశతకాలు సాధించారు. అయితే ఓపెనర్ల ధాటికి ఆర్సీబీ స్కోరు బుల్లెట్ మాదిరిగా దూసుకుపోయినా.. మిడిలార్డర్ విఫలం కావడం ఆ జట్టును దెబ్బతీసింది. ఏబీ డివిలియర్స్ 12, టిమ్ డేవిడ్ 1, మ్యాక్స్వెల్ 11, హర్షల్ పటేల్ 3 పరుగులు చేశారు. మిడిలార్డర్ పరుగులు చేసేందుకు ఇబ్బంది పడటంతో ఆర్సీబీ 156 పరుగులకే పరిమితం కావాల్సి వచ్చింది. చెన్నై బౌలర్లలో బ్రావో 3, ఠాకూర్ 2, చాహర్ ఒక వికెట్ పడగొట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
హార్దిక్పై విమర్శలను ఇకనైనా ఆపాలని మాజీ క్రికెటర్లు ఫ్యాన్స్కు కీలక సూచనలు చేశారు. అతడిని ట్రోలింగ్ చేయడం సరి కాదని పేర్కొన్నారు. -
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు