IPL Mega Auction : ఐపీఎల్ మెగా వేలం.. ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత సొమ్ముంది?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మెగా వేలం కౌంట్డౌన్ ప్రారంభమైంది. రెండ్రోజులపాటు జరిగే...
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్- IPL) మెగా వేలం కౌంట్డౌన్ ప్రారంభమైంది. రెండ్రోజులపాటు జరిగే మెగా వేలం శనివారం ఉదయం 11 గంటలకు బెంగళూరు వేదికగా మొదలు కానుంది. మొత్తం పది ఫ్రాంచైజీలు ఇప్పటికే 33 మంది ఆటగాళ్లను రిటెయిన్/సెలెక్షన్ చేసుకున్నాయి. ఇక దాదాపు 590 మంది క్రికెటర్ల నుంచి తమకు అవసరమైన ఆటగాళ్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. దీని కోసం అన్ని ఫ్రాంచైజీలు దాదాపు రూ.560 కోట్లకుపైగా సొమ్మును ఖర్చు చేయనున్నాయి. అత్యధికంగా పంజాబ్ కింగ్స్ వద్ద రూ.72 కోట్లు ఉండగా.. దిల్లీ క్యాపిటల్స్ వద్ద తక్కువగా రూ.47.5 కోట్లు ఉన్నాయి. ఒక్కో జట్టు గరిష్ఠంగా 25 ఆటగాళ్లను కలిగి ఉండాలి. కొన్ని ఫ్రాంచైజీలు ఇద్దరిని, ముగ్గురిని, నలుగురిని రిటెయిన్ చేసుకోగా.. మిగిలిన వారిని వేలంలో దక్కించుకుంటాయి. మరి ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకున్నాయి? ఏ ఫ్రాంచైజీ వద్ద ఎంత సొమ్ము ఉంది? ఎన్ని స్లాట్లు ఉన్నాయో తెలుసుకుందాం..
చెన్నై సూపర్ కింగ్స్ (CSK)
రిటెయిన్ చేసుకున్న ఆటగాళ్లు: ఎంఎస్ ధోనీ, రవీంద్ర జడేజా, మొయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్
- ఖాళీ స్లాట్లు: 21
- మిగిలి ఉన్న నగదు: రూ.48 కోట్లు
దిల్లీ క్యాపిటల్స్ (DC)
రిటెయిన్ ఆటగాళ్లు: రిషభ్ పంత్, అక్షర్ పటేల్, పృథ్వీ షా, అన్రిచ్ నార్జ్
- ఖాళీ స్లాట్లు: 21
- మిగులు నగదు: 47.5 కోట్లు
కోల్కతా నైట్రైడర్స్ (KKR)
రిటెయిన్ ఆటగాళ్లు: ఆండ్రూ రస్సెల్, వరుణ్ చక్రవర్తి, వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్
- ఖాళీ స్లాట్లు: 21
- మిగులు నగదు: రూ.48 కోట్లు
ముంబయి ఇండియన్స్ (MI)
రిటెయిన్ ఆటగాళ్లు: రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్
- ఖాళీ స్లాట్లు: 21
- మిగులు నగదు: రూ. 48 కోట్లు
లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG)
- రిటెయిన్ ఆటగాళ్లు: కేఎల్ రాహుల్, మార్కస్ స్టొయినిస్, రవి బిష్ణోయ్
- ఖాళీ స్లాట్లు: 22
- మిగులు నగదు: రూ.59 కోట్లు
పంజాబ్ కింగ్స్ (PBKS)
రిటెయిన్ ఆటగాళ్లు: మయాంక్ అగర్వాల్, అర్షదీప్ సింగ్
- ఖాళీ స్లాట్లు: 23
- మిగులు నగదు: రూ. 72 కోట్లు
రాజస్థాన్ రాయల్స్ (RR)
రిటెయిన్ ఆటగాళ్లు: సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్
- ఖాళీ స్లాట్లు: 22
- మిగులు నగదు: రూ.62 కోట్లు
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)
రిటెయిన్ ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్వెల్, మహమ్మద్ సిరాజ్
- ఖాళీ స్లాట్లు: 22
- మిగులు నగదు: రూ. 57 కోట్లు
సన్రైజర్స్ హైదరాబాద్ (SRH)
రిటెయిన్ ఆటగాళ్లు: కేన్ విలియమ్సన్, అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్
- ఖాళీ స్లాట్లు: 22
- మిగులు నగదు: రూ.68 కోట్లు
గుజరాత్ టైటాన్స్ (GT)
రిటెయిన్ ఆటగాళ్లు: హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్
- ఖాళీ స్లాట్లు: 22
- మిగులు నగదు: రూ.52 కోట్లు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)