రాగల 24 గంటల్లో ఐపీఎల్ పూర్తి షెడ్యూలు!
రాగల 24 గంటల్లో ఐపీఎల్-2020 పూర్తి షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ షేక్ నహ్యాన్ బిన్ముబారక్తో బీసీసీఐ సమావేశం ముగిసిందని తెలిసింది. అబుదాబి, దుబాయ్, షార్జాల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి ఆయన హామీ ఇచ్చారని సమాచారం....
ఇంటర్నెట్ డెస్క్: రాగల 24 గంటల్లో ఐపీఎల్-2020 పూర్తి షెడ్యూలు విడుదల చేసే అవకాశం ఉంది. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు చీఫ్ షేక్ నహ్యాన్ బిన్ముబారక్తో బీసీసీఐ సమావేశం ముగిసిందని తెలిసింది. అబుదాబి, దుబాయ్, షార్జాల మధ్య రాకపోకలు, నిబంధనల్లో సడలింపుల గురించి ఆయన హామీ ఇచ్చారని సమాచారం.
కరోనా వైరస్తో వాయిదా పడిన ఐపీఎల్ ఈ ఏడాది సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు జరుగుతుందని బీసీసీఐ ప్రకటించింది. సమయం దగ్గర పడుతున్నా ఇప్పటి వరకు పూర్తి షెడ్యూల్ వెల్లడించలేదు. ఇప్పటికే ఫ్రాంచైజీలు అన్నీ యూఏఈ చేరుకున్నాయి. వారం రోజులు క్వారంటైన్ సైతం ముగిసింది.
అబుదాబిలో కేసులు ఎక్కువగా ఉండటంతో దుబాయ్, షార్జాతో పోలిస్తే కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. దుబాయ్, షార్జా నుంచి రావాలన్నా అబుదాబిలో టెస్టులు తప్పనిసరి. నెగటివ్ వస్తేనే ప్రవేశం లభిస్తుంది. లేదంటే కష్టం. ఐపీఎల్ జట్లు వెంటవెంటనే ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ఆంక్షలుంటే కష్టమని బీసీసీఐ భావిస్తోంది. అందుకే ఈసీబీతో మంతనాలు జరిపింది. ఈసీబీ చీఫ్ షేక్ నహ్యన్ యూఏఈలో సాంస్కృతిక, యువత అభివృద్ధి శాఖకు మంత్రి ప్రభుత్వంతో మాట్లాడి సడలింపులు చేయిస్తానని ఆయన హామీ ఇచ్చారని తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.