T20 League : ఓపెనర్లు ఎవరున్నారు.. కొత్త కాంబినేషన్ ఎవరైతే బాగుంటుంది?
ఇక వచ్చే సీజన్ పోటీల కోసం తుది జట్లపై కసరత్తును ప్రారంభించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా
ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్లో పది ఫ్రాంచైజీలు ఆటగాళ్లను రిటెయిన్/కొనుగోలు చేసే ప్రక్రియ ముగిసింది. ఇక వచ్చే సీజన్ పోటీల కోసం తుది జట్లపై కసరత్తును ప్రారంభించాల్సి ఉంటుంది. మరీ ముఖ్యంగా బ్యాటింగ్లో మంచి శుభారంభం దక్కాలంటే బలమైన ఓపెనింగ్ జోడీ ఉండాలి. కొన్ని జట్లకు అద్భుతమైన ఓపెనర్లు ఉండగా.. మరికొన్ని టీమ్లు కొత్త జోడీలను సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఏ జట్టుకు ఎవరు ఉన్నారు.. లేని టీమ్లు ఎలాంటి కాంబినేషన్ను ప్రయత్నిస్తే బాగుంటుందో ఓసారి చూద్దాం.. మన హోం టీమ్ హైదరాబాద్ నుంచే మొదలుపెడదాం..
- హైదరాబాద్ : గత సీజన్ వరకు అద్భుతమైన బౌలింగ్తో ఎలాంటి జట్టుకైనా ముచ్చెమటలు పట్టించే జట్టు హైదరాబాద్. అయితే బ్యాటింగ్ ఆర్డర్ లోపంతో చిన్న లక్ష్యాలను కూడా ఛేదించేందుకూ ఇబ్బంది పడింది. మొన్నటి వరకు బెయిర్స్టో, డేవిడ్ వార్నర్, వృద్ధిమాన్ సాహా, జాసన్ రాయ్ వంటి ప్లేయర్లు ఉన్నారు. ఇప్పుడు ఈ నలుగురూ ఎస్ఆర్హెచ్ క్యాంపస్లో లేరు. రాహుల్ త్రిపాఠి, నికోలస్ పూరన్, మార్క్రమ్, గ్లెన్ఫిలిప్స్ వంటి వారితో ఓపెనింగ్ ప్రయత్నించొచ్చు. వన్డౌన్లో ఎలాగూ కేన్ విలియమ్సన్ ఉండనే ఉన్నాడు.
- చెన్నై: గత సీజన్లో రుతురాజ్-డుప్లెసిస్ జోడీ టాప్ స్కోరర్లుగా రాణించడంతో చెన్నై కప్ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి డుప్లెసిస్ స్థానంలో రుతురాజ్కు తోడుగా రాబిన్ ఉతప్ప, డేవన్ కాన్వే, మొయిన్ అలీని ఓపెనింగ్కు పంపే వెసులుబాటు ఉంది. అవసరమైతే అంబటి రాయుడు కూడా ఇన్నింగ్స్ను ఆరంభించగలడు. అయితే ఓపెనర్లు ఒక మ్యాచ్లో విఫలమైనంత మాత్రాన కెప్టెన్ ధోనీ మాత్రం ఎలాంటి మార్పులు చేయడు. కాబట్టి మిస్టర్ కూల్ కొత్త ప్రయోగాలు చేయడానికీ వెనుకాడడు.
- దిల్లీ : ఒక వైపు పృథ్వీ షా ఫిక్స్. ఇప్పుడు డేవిడ్ వార్నర్ను దిల్లీ తీసుకోవడంతో ఓపెనింగ్ సమస్య అయితే లేదు. వీరిద్దరికి బ్యాకప్గా కేఎస్ భరత్, సర్ఫ్రాజ్ ఖాన్, అశ్విన్ హెబ్బర్ను ఉంచుకోవచ్చు. రిషభ్ పంత్ విండీస్తో ఓ మ్యాచ్లో ఓపెనింగ్కు దిగాడు. అయితే అది సఫలీకృతం కాలేదనే చెప్పాలి. మిడిలార్డర్లో రిషభ్ సేవలు ఎంతో అవసరం. తుది జట్టులో వార్నర్, పృథ్వీ షా ఉంటే వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదు.
- గుజరాత్ : హార్దిక్ పాండ్య, రషీద్ ఖాన్, శుభ్మన్ గిల్ను రిటెయిన్ చేసుకున్న గుజరాత్కు ఓపెనర్లు ఎవరనే సందిగ్దత లేదు. గిల్తోపాటు జాసన్ రాయ్, డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా ఓపెనర్లుగా దిగే అవకాశం ఉంది. రాయ్, సాహా ఇప్పటికే హైదరాబాద్ తరఫున ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనుభవం ఉంది. మిడిలార్డర్లో మాథ్యూ వేడ్, రాహుల్ తెవాతియా, విజయ్ శంకర్, హార్దిక్ వంటి ఆటగాళ్లు ఎలానూ ఉన్నారు.
- కోల్కతా : ఎప్పుడు ఎలాంటి ప్రయోగాలు చేస్తుందో తెలియని జట్టు కోల్కతా. గత సీజన్లలో కొన్నిసార్లు వెంకటేశ్ అయ్యర్, సునిల్ నరైన్, నితీశ్ రాణా, గిల్, త్రిపాఠితో ఓపెనింగ్ చేయించింది. ఇప్పుడు నరైన్, రాణా, వెంకటేశ్ అయ్యర్ జట్టులో ఉన్నారు. వచ్చే సీజన్లో వీరిలో ఓపెనింగ్కు పంపే అవకాశాలు లేకపోలేదు. అలానే శ్రేయస్ అయ్యర్ ఉన్నా.. అతడిని వన్డౌన్లో దింపేందుకే మొగ్గు చూపొచ్చు. వీరు అందుబాటులో లేకపోతే సామ్ బిల్లింగ్స్, రింకు సింగ్, అభిజిత్ తోమర్నూ ప్రయత్నించే అవకాశం ఉంది.
- లఖ్నవూ : ప్రస్తుతం ఉన్న ఫ్రాంచైజీల్లో ఓపెనింగ్ కొరత లేని జట్లలో లఖ్నవూ ఒకటి. ఆ జట్టు సారథి కేఎల్ రాహుల్ ఎలానూ ఓపెనర్గా వస్తాడు. ఇక రెండో వైపు క్వింటన్ డికాక్, మనన్ వోహ్రా, ఎవిన్ లూయిస్ వంటి ఆప్షన్లు ఎల్ఎస్జీకి ఉన్నాయి. అవసరమైతే మనీశ్ పాండే మిడిలార్డర్తోపాటు ఓపెనింగ్ చేయగలడు. జాసన్ హోల్డర్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య, కృష్ణప్ప గౌతమ్, స్టొయినిస్ ఆటగాళ్లు ఎలానూ ఉన్నారు.
- ముంబయి : ఐదు సార్లు ఛాంపియన్ ముంబయికి ఓపెనింగ్ సమస్యే లేదు. భారీ ధర వెచ్చించి మరీ తమ వద్దే ఉంచుకున్న ఇషాన్ కిషన్ తోడుగా కెప్టెన్ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేసేస్తాడు. తప్పదనుకుంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఇన్నింగ్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కొత్త కుర్రాళ్లలో అన్మోల్ప్రీత్ సింగ్, ‘జూనియర్ ఏబీడీ’ డేవడ్ బ్రెవిస్ను బ్యాకప్గా ఉన్నారు. పాత కూర్పుతోనే ఓపెనింగ్ చేస్తారా.. కొత్త ఆటగాళ్లను తయారు చేసుకుని బరిలోకి దింపుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
- పంజాబ్ : పంజాబ్కు ఓపెనింగ్ బెడద లేదు. మయాంక్ అగర్వాల్, శిఖర్ ధావన్, బెయిర్స్టో, లివింగ్ స్టోన్ వంటి హేమాహేమీలు ఆ జట్టు సొంతం. మిడిలార్డర్లో షారుఖ్ ఖాన్, ఓడియన్ స్మిత్, భనుక రాజపక్స, నాథన్ ఎల్లిస్ తదితరులు రాణించగలిగే సత్తా ఉన్నవాళ్లే. అయితే కెప్టెన్గా ఎవరిని నియమిస్తారనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది. యువ క్రికెటర్గా మయాంక్ అగర్వాల్కు దక్కే అవకాశం ఉంది. శిఖర్ ధావన్కు నాయకుడిగా అనుభవం ఉన్నప్పటికీ వయస్సురీత్యా ఇవ్వకపోవచ్చు.
- రాజస్థాన్ : అబ్బో ఈ జట్టులో ఓపెనర్లు భారీగా ఉన్నారు. మెగా వేలంలో పక్కా ప్రణాళికతో ఆటగాళ్లను కొనుగోలు చేసింది. కెప్టెన్ సంజూ శాంసన్, జోస్ బట్లర్, యశస్వి జైస్వాల్, దేవదుత్ పడిక్కల్ వంటి మంచి ఆరంభాన్నిచ్చే బ్యాటర్లను కలిగిన ఏకైక జట్టు రాజస్థాన్. బట్లర్-జైస్వాల్, జైస్వాల్-పడిక్కల్, జైస్వాల్-సంజూ.. ఇలా కాంబినేషన్లతో ఓపెనింగ్కు దిగే వెసులుబాటు రాజస్థాన్కు ఉంది. ఇక మిడిలార్డర్లో డస్సెన్, హెట్మయర్, రియాన్ పరాగ్, జేమ్స్ నీషమ్, కరుణ్ నాయర్, డారిల్ మిచెల్ బ్యాటర్లు రాణించగలరు.
- బెంగళూరు : అగ్రశ్రేణి ఆటగాళ్లకు కొదవలేదు. విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్కు ఇప్పుడు డుప్లెసిస్, దినేశ్ కార్తిక్, డేవిడ్ విల్లే, వనిందు హసరంగ, ఫిన్ అలెన్ తోడయ్యారు. గత సీజన్లో సీఎస్కే తరఫున ఓపెనర్గా డుప్లెసిస్ అత్యధిక పరుగుల జాబితాలో రెండో ఆటగాడు. విరాట్ కోహ్లీ ఎలాగూ ఓపెనింగ్ చేయగలడు. అలాకాదు విరాట్ను వన్డౌన్లో పంపించాలనుకుంటే మాత్రం డుప్లెసిస్కు తోడుగా దినేశ్ కార్తిక్, ఫిన్ అలెన్.. ఎవరో ఒకరిని బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
చెన్నై సూపర్ కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లలో పూర్తిగా భిన్నమైన సంస్కృతి ఉంటుందని భారత మాజీ ఆటగాడు అంబటి రాయుడు అన్నాడు. ముంబయికి గెలుపే లక్ష్యంగా ఉంటుందని.. చెన్నై మాత్రం ప్రక్రియపై నమ్మకం ఉంచుతుందని రాయుడు తెలిపాడు. -
లఖ్నవూ.. అక్కడా ఇక్కడా!
ఐపీఎల్లో ఎంతో నిలకడగా ఆడే జట్లలో చెన్నై సూపర్కింగ్స్ ఒకటి. లఖ్నవూతో మ్యాచ్ అంటే చెన్నైనే ఎక్కువమంది ఫేవరెట్గా పరిగణిస్తారు. కానీ ఆ జట్టు చేతిలో సూపర్కింగ్స్కు వరుసగా రెండు ఓటములు తప్పలేదు. -
మెరిసిన జ్యోతి సురేఖ
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ మెరిసింది. మంగళవారం మహిళల కాంపౌండ్ అర్హత రౌండ్లో సురేఖ (711) రెండో స్థానం సాధించింది. ఆండ్రియా బెకెరా (713- మెక్సికో) అగ్రస్థానంలో నిలిచింది. -
శ్రీజ నం.1
అంతర్జాతీయ స్థాయిలో వరుస విజయాలతో సత్తా చాటుతున్న తెలుగమ్మాయి ఆకుల శ్రీజ మరో ఘనత అందుకుంది. టీటీ మహిళల సింగిల్స్లో కెరీర్లో అత్యుత్తమంగా 38వ ర్యాంకు సాధించిన శ్రీజ.. -
ఆసియా జూనియర్ అథ్లెటిక్స్కు ‘లక్ష్య’ హిమతేజ
ఈనాడు సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ క్రీడాకారుడు వల్లిపి హిమతేజ అంతర్జాతీయ వేదికపై సత్తాచాటేందుకు సిద్ధమయ్యాడు. బుధవారం ప్రారంభంకానున్న ఆసియా జూనియర్ (అండర్-20) అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తన అదృష్టం పరీక్షించుకోనున్నాడు. -
టొరంటోలో భారత భూకంపం
అంచనాలను తలకిందులు చేస్తూ క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో విజేతగా నిలిచిన భారత టీనేజ్ సంచలనం, గ్రాండ్మాస్టర్ గుకేశ్పై రష్యా దిగ్గజ క్రీడాకారుడు గ్యారీ కాస్పరోవ్ ప్రశంసల జల్లు కురిపించాడు. -
విండీస్కు ఆడను
టీ20 ప్రపంచకప్ కోసం రిటైర్మెంట్ వీడి తిరిగి అంతర్జాతీయ క్రికెట్లోకి రాబోనని వెస్టిండీస్ మాజీ బౌలింగ్ ఆల్రౌండర్ సునీల్ నరైన్ స్పష్టం చేశాడు. ఐపీఎల్లో కోల్కతా తరఫున అతడు విశేషంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. -
జకోవిచ్కు లారియస్ అవార్డు
టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్.. లారియస్ స్పోర్ట్స్పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకున్నాడు. మాడ్రిడ్లో జరిగిన లారియస్ అవార్డుల కార్యక్రమంలో అమెరికా జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్.. కమ్బ్యాక్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని గెలుచుకుంది. -
జుట్టు కత్తిరించడమే మార్గమనుకుని..
పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ ఆరంభానికి ముందు రోజు బరువును తగ్గించుకోవడం కోసం చాలా ఇబ్బందిపడ్డానని వినేశ్ తెలిపింది. 50 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉండగా నిర్ణీత బరువు కంటే కాస్త ఎక్కువ ఉండడంతో కలవరం రేగిందని ఆమె తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!