IPL: ఈ మూడుఛేదనలూ వాటికవే సాటి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే నాణ్యమైన క్రికెట్కు మరో పేరు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ను మించిన పోటీ.. ఉత్కంఠ.. ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లు పోటీ పడుతుంటారు....
టాప్-3లో రెండు రాజస్థాన్వే.. ముంబయి తొలి మురిపెం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే నాణ్యమైన క్రికెట్కు మరో పేరు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ను మించిన పోటీ.. ఉత్కంఠ.. ఇక్కడ ఉంటాయి. ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లు పోటీ పడుతుంటారు. బౌలర్లు... బ్యాటర్లు సై అంటే సై అంటారు. అందుకే ఐపీఎల్లో 200+ పరుగుల లక్ష్యాలను ఛేదించడం అంత తేలికేం కాదు. తాజాగా ముంబయి ఇండియన్స్ 219 పరుగుల్ని ఛేదించడంతో విజయవంతమైన ఛేదనలపై ఆసక్తి నెలకొంది. ఇంతకూ టాప్-3 ఛేదనలేంటి? అందులో మెరుపులు ఎవరివో చూద్దామా!!
షార్జాలో.. షాన్దార్!
లీగ్లో అతిపెద్ద ఛేదన రికార్డును రెండుసార్లు సృష్టించింది రాజస్థాన్. 13వ సీజన్లో షార్జా వేదికగా జరిగిన మ్యాచులో పంజాబ్ నిర్దేశించిన 224 పరుగుల భారీ లక్ష్యాన్ని దర్జాగా ఛేదించింది ఆ జట్టు. అసలు సింగిల్స్, డబుల్స్ అన్న మాటే లేదు. దొరికిన ప్రతి బంతినీ స్టేడియం పైకప్పు పైకి తరలించారు ఆటగాళ్లు. ఈ పోరులో మొదట మయాంక్ (106; 50 బంతుల్లో 10×4, 7×6), రాహుల్ (69; 54 బంతుల్లో 7×4, 1×6) దంచికొట్టారు. ఇక ఆ జట్టుకు తిరుగులేదనే అనిపించింది. అయితే లక్ష్య ఛేదనలో సంజు శాంసన్ (85; 42 బంతుల్లో 4×4, 7×6), స్మిత్ (50; 27 బంతుల్లో 7×4, 2×6), రాహుల్ తెవాతియా (53; 31 బంతుల్లో 7×6) పరుగుల వరద పారించడంతో మరో 3 బంతులు మిగిలుండగానే గులాబి దండు విజయ దుందుభి మోగించింది. సంజు కొట్టిన సిక్సర్లు షార్జా స్టాండ్స్లో పడుతుంటే అతడి కండబలమేంటో తెలిసొచ్చింది.
‘పొలి’ కేక పెట్టించాడు
ఐపీఎల్లో రెండో అత్యధిక విజయవంతమైన ఛేదన ముంబయి ఇండియన్స్ నమోదు చేసింది. తాజా (2021) సీజన్లో దిల్లీ వేదికగా జరిగిన పోరులో చెన్నై నిర్దేశించిన 219 పరుగుల్ని ఆఖరి బంతికి ఛేదించింది. తొలుత డుప్లెసిస్ (50; 28 బంతుల్లో 2×4, 4×6), మొయిన్ అలీ (58; 36 బంతుల్లో 5×4, 5×6), అంబటి రాయుడు (72*; 27 బంతుల్లో 4×4, 7×6) విధ్వంసం సృష్టించారు. ముఖ్యంగా రాయుడు 20 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. మైదానం చుట్టూ సిక్సర్లు బాదేశాడు.
ఇక ఛేదనకు దిగిన ముంబయికీ డికాక్ (38; 28 బంతుల్లో 4×4, 1×6), రోహిత్ శర్మ (35; 24 బంతుల్లో 4×4, 1×6) శుభారంభం అందించారు. వీరిద్దరూ ఔటయ్యాక కృనాల్ పాండ్య (32; 23 బంతుల్లో 2×4, 2×6)తో కలిసి కీరన్ పొలార్డ్ (87*; 34 బంతుల్లో 6×4, 8×6) నాలుగో వికెట్కు 89 (44 బంతుల్లో) పరుగుల కీలక భాగస్వామ్యం అందించాడు. మైదానం నలుమూలలా వివిధ కోణాల్లో సిక్సర్ల పిడుగులు కురిపించాడు. దాంతో ముంబయి ఆఖరి 10 ఓవర్లలో 138 పరుగులు చేసింది. చివరి 6 బంతుల్లో 16 పరుగులు చేయాల్సి ఉండగా పొలార్డ్ 2 బౌండరీలు, ఓ సిక్సర్ బాదేసి విజయకేతనం ఎగరేశాడు. ఈ పోరులో మొత్తం 30 సిక్సర్లు, 30 బౌండరీలు రావడం గమనార్హం. ముంబయి అతిపెద్ద ఛేదనా ఇదే కావడం ప్రత్యేకం.
మొదటా.. రాజసమే
మూడో రికార్డు ఛేదనా రాజస్థాన్దే. 2008లో డెక్కన్ జట్టుపై 215 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల నష్టపోయి ఛేదించేసింది. హైదరాబాద్లోని ఉప్పల్ ఈ పోరుకు వేదిక. తొలుత ఆండ్రూ సైమండ్స్ (117; 53 బంతుల్లో 11×4, 7×6) ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. విధ్వంసకర బౌండరీలు బాదాడు. 220.75 స్ట్రైక్రేట్తో పరుగులు చేశాడు. అతడికి తోడుగా రోహిత్ శర్మ (36; 30 బంతుల్లో 3×4, 1×6) నిలిచాడు. అరంగేట్రం సీజన్ కావడంతో రాజస్థాన్ గెలుపు సులువేమీ కాదనే అంతా అనుకున్నారు. కానీ షేన్వార్న్ సేన అందరి అంచనాలనూ తలకిందులు చేసింది. గ్రేమ్ స్మిత్ (71; 45 బంతుల్లో 9×4, 2×6), యూసుఫ్ పఠాన్ (61; 28 బంతుల్లో 4×4, 6×6), మహ్మద్ కైఫ్ (34; 16 బంతుల్లో 2×4, 3×6), వార్న్ (22*; 9 బంతుల్లో 2×4, 2×6) సమష్టిగా దంచికొట్టారు. దాంతో మరో బంతి మిగిలుండగానే గెలుపు రాజస్థాన్ తలుపు తట్టింది.
-ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు