Ire vs Ind: దీపక్ ధనాధన్‌ సెంచరీ.. ఐర్లాండ్ ముందు కొండంత లక్ష్యం

ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. దీపక్ హుడా (104; 42 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక్కొట్టగా.. సంజూ శాంసన్ (77; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు)  అర్ధ శతకంతోచెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల న

Updated : 28 Jun 2022 23:25 IST

డబ్లిన్‌: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. దీపక్ హుడా (104; 57 బంతుల్లో 9 ఫోర్లు, 6 సిక్స్‌లు) శతక్కొట్టగా.. సంజూ శాంసన్ (77; 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లు)  అర్ధ శతకంతోచెలరేగాడు. దీంతో భారత్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.  ఇషాన్‌ కిషన్‌ (3) నిరాశ పర్చాడు. మార్క్ అడైర్ వేసిన 16.2 ఓవర్‌కు శాంసన్‌ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. లిటిల్‌ వేసిన తర్వాతి ఓవర్‌లో సూర్యకుమార్ యాదవ్ (15), దీపక్‌ హుడా పెవిలియన్ చేరారు.  లిటివ్‌ వేసిన 19వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్‌ (0), అక్షర్‌ పటేల్ (0) వరుస బంతుల్లో ఔటయ్యారు. అడైర్‌ వేసిన చివరి ఓవర్లో హర్షల్ పటేల్ (0) కూడా డకౌట్‌ అయ్యాడు. ఐర్లాండ్ బౌలర్లలో అడైర్ 3, లిటిల్ 2, యంగ్ 2 వికెట్లు పడగొట్టారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని