Ishan Kishan: టెస్టుల్లోకి పిలుపు.. మా నాన్న అలా అన్నారు: ఇషాన్ కిషన్
టీమ్ఇండియా (Team India) యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ (Ishan Kishan)కు తొలిసారిగా టెస్టుల్లోకి ఆహ్వానం అందింది. ఆసీస్తో (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్లో భాగంగా తొలి రెండు మ్యాచ్లకు ప్రకటించిన జట్టులో స్థానం దక్కింది.
ఇంటర్నెట్ డెస్క్: వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ బాదిన క్రికెటర్ టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్. గతేడాది బంగ్లాదేశ్ మీద జరిగిన మ్యాచ్లో ఈ ఫీట్ సాధించాడు. అయితే ఆ తర్వాత అడపాదడపా అవకాశాలు మాత్రమే వచ్చాయి. ఎక్కువగా బెంచ్కే పరిమితం కావాల్సి వచ్చింది. తాజాగా న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆడేందుకు కిషన్ హైదరాబాద్లోనే ఉన్నాడు. అంతేకాకుండా వచ్చే నెల ఆసీస్తో జరిగే టెస్టు సిరీస్లోని మొదటి రెండు మ్యాచ్లకు ప్రకటించిన స్క్వాడ్లోనూ చోటు సంపాదించాడు. అయితే తుది జట్టులోకి వస్తాడా..? లేదా..? అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాలి. కానీ టెస్టు జట్టులోకి రావడంపై ఇషాన్ కిషన్ ఆనందం వ్యక్తం చేశాడు.
టెస్టుల్లో ఆడాలనే కోరిక తీరితే బాగుంటుందని, అంతకుమించిన ఆనందం మరొకటి ఉండదని ఇషాన్ తెలిపాడు. టెస్టు జట్టులోకి ప్రకటించిన తర్వాత తన కుటుంబ సభ్యుల స్పందనేంటో కూడా చెప్పాడు. శుబ్మన్ గిల్, ఇషాన్ మాట్లాడిన వీడియోను బీసీసీఐ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. ‘‘చాలా సంతోషంగా ఉంది. వన్డేలు, టీ20ల్లో రాణించిన ప్రతిసారి మా నాన్న ఒకటే చెబుతుంటారు. టెస్టు క్రికెట్టే అసలైన గేమ్. కఠిన సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. క్రికెటర్ నైపుణ్యాలకు పరీక్ష కూడా టెస్టుల్లోనే ఎదురువుతుంది. ఎట్టకేలకు టెస్టు జట్టులోకి రావడం మాత్రం ఆనందంగా ఉంది. ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తా. నాకు టెస్టుల్లోకి పిలుపు వచ్చినప్పుడు.. ఇప్పుడు ఎంత కష్టపడుతున్నావో అలాగే కష్టపడాలని మా నాన్న చెప్పారు’’
‘‘టెస్టుల్లో బ్యాటింగ్కు దిగే స్థానంపై ఎలాంటి ఆలోచన లేదు. ఎప్పుడు వచ్చినా సరే పరిస్థితిని అర్థం చేసుకొని ఆడాలి. మిడిలార్డర్లో వెళ్తే కొన్నిసార్లు భారీ షాట్లు కొట్టాల్సి ఉంటుంది. వైట్ బాల్, రెడ్ బాల్ క్రికెట్కు ఉన్న ప్రధాన తేడా స్వింగ్ కావడం. తెల్ల బంతి ఎక్కువగా స్వింగ్ కాదు. అదే ఎర్ర బంతి మాత్రం బ్యాటర్కు కఠిన పరీక్ష పెడుతుంది. అత్యుత్సాహం అక్కడ పనికిరాదు’’ అని ఇషాన్ కిషన్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా