ఔరా ఇషాంత్! త్రిశతకం చేసేశాడు
టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్గా, మూడో పేసర్గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు....
కపిల్, జహీర్ సరసన చేరిన మూడో పేసర్
చెన్నై: టీమ్ఇండియా సీనియర్ పేసర్ ఇషాంత్శర్మ అరుదైన ఘనత సాధించాడు. టెస్టు కెరీర్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరఫున ఈ ఘనత అందుకున్న ఆరో బౌలర్గా, మూడో పేసర్గా చరిత్ర సృష్టించాడు. దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, జహీర్ ఖాన్ సరసన నిలిచాడు.
చెపాక్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో డాన్ లారెన్స్ను ఇషాంత్ ఔట్ చేశాడు. ఓ చక్కని బంతితో అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకొని 300వ వికెట్ సాధించాడు. ఇందుకోసం అతడు 98 మ్యాచులు ఆడటం గమనార్హం. అతడి కన్నా ముందు అనిల్ కుంబ్లే (619), కపిల్ దేవ్ (434), రవిచంద్రన్ అశ్విన్ (377; ఈ మ్యాచుకు ముందు), హర్భజన్ సింగ్ (417), జహీర్ ఖాన్ (311) త్రిశతక మైలురాయిని అందుకున్నారు.
ఈ సందర్భంగా ఇషాంత్కు బీసీసీఐ, ఐసీసీ అభినందనలు తెలియజేసింది. ‘ఇషాంత్ శర్మకు అభినందనలు. టెస్టు క్రికెట్లో 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్గా అతడు రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ మూడో వికెట్ లారెన్స్ను ఎల్బీడబ్ల్యూ చేసి ఈ ఘనత సాధించాడు’ అని బీసీసీఐ ట్వీట్ చేసింది. ‘కపిల్ దేవ్, జహీర్ ఖాన్ తర్వాత 300 వికెట్లు తీసిన భారత మూడో పేసర్గా ఇషాంత్ నిలిచాడు. గొప్ప విజయమిది’ అని ఐసీసీ ట్వీటింది.
బంగ్లాదేశ్పై 2007లో అరంగేట్రం చేసిన ఇషాంత్ ఇప్పటి వరకు 11 సార్లు ఐదు వికెట్ల ఘనత అందుకున్నాడు. ఒక మ్యాచులో పది వికెట్లు పడగొట్టాడు. 13 ఏళ్లుగా అతడు టీమ్ఇండియాకు సేవలు అందిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడి బౌలింగ్లో పస తగ్గడంతో మళ్లీ వైవిధ్యం పెంచుకొని కీలకంగా మారాడు.
ఇషాంత్ యువకుడిగా ఉన్నప్పుడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్కు వేసిన బౌలింగ్ స్పెల్ గురించి ఇప్పటికీ చర్చించుకుంటారు. లంబూ 98 మ్యాచుల్లో ఈ ఘనత సాధిస్తే అశ్విన్ 54, కుంబ్లే 66, హర్భజన్ 72, కపిల్ 83, జహీర్ 89 మ్యాచుల్లో సాధించారు.
ఇవీ చదవండి
కోహ్లీ 1 లేదా 2 సెంచరీలు కొడతాడు
ఉత్తరాఖండ్ బాధితుల కోసం పంత్ ముందడుగు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
పంజాబ్పై 9 పరుగుల తేడాతో ముంబయి గెలిచింది. కానీ, ఆ జట్టుకు అంపైర్లు మద్దతుగా నిలిచారనే ఆరోపణలు వస్తున్నాయి. -
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
-
హైదరాబాద్ శివారులో వర్ష బీభత్సం.. శ్రీశైలం హైవేపై ట్రాఫిక్ జామ్
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!