200+ డాడీ హండ్రెడ్ అయితే 300+ ఏంటి?
క్రికెట్లో 50 పరుగులు చేస్తే అర్ధశతకం అంటారు. 100 పరుగులు చేస్తే శతకం అంటారు. 200 పరుగులు సాధిస్తే ద్విశతకం అంటారు. అప్పుడప్పుడు డబుల్ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ‘డాడీ హండ్రెడ్’ అని ఛమత్కరిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారనే సందేహం మీకు...
సునిల్ గావస్కర్ విచిత్రమైన జవాబు
ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో 50 పరుగులు చేస్తే అర్ధశతకం అంటారు. 100 పరుగులు చేస్తే శతకం అంటారు. 200 పరుగులు సాధిస్తే ద్విశతకం అంటారు. అప్పుడప్పుడు డబుల్ సెంచరీని వ్యాఖ్యాతలు, విశ్లేషకులు ‘డాడీ హండ్రెడ్’ అని చమత్కరిస్తుంటారు. మరి 150, 250, 300 పరుగులు చేస్తే ఏమంటారనే సందేహం మీకు వచ్చే ఉంటుంది కదా! ఓ అభిమాని ఇదే ప్రశ్న అడగ్గా టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సునిల్ గావస్కర్ విచిత్రమైన జవాబు ఇచ్చాడు.
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరుగుతోంది. భారత్, ఆస్ట్రేలియా హోరాహోరీగా తలపడుతున్నాయి. మ్యాచులో రెండోరోజు ‘ఛానెల్ 7’లో సన్నీ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ట్విటర్లో #AskSunny పేరుతో ఆ సంస్థ ప్రశ్న జవాబుల కార్యక్రమం ఏర్పాటు చేసింది. అభిమానులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సన్నీ చిలిపిగా సమాధానాలు ఇచ్చారు.
100+, 150+, 200+, 250+, 300+ పరుగులు చేస్తే ఏమంటారని ఒకరు అడగ్గా ‘100+ అయితే బేబీ హండ్రెడ్, 150+ అయితే టీనేజ్ హండ్రెడ్, 200+ అయితే డాడీ హండ్రెడ్, 250+ అయితే ఫాథర్ ఇన్లా (మామ) హండ్రెడ్, 300+ అయితే గ్రాండ్డాడీ (తాత) హండ్రెడ్’ అని సన్నీ సమాధానమివ్వడం గమనార్హం. మీ అన్ని ఇన్నింగ్సుల్లో ఇష్టమైన ఇన్నింగ్స్ ఏదంటే.. ‘1971లో మాంచెస్టర్లోని ఓల్డ్ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్పై చేసిన 57 పరుగుల ఇన్నింగ్స్ నాకిష్టం. అత్యంత చలి, గాలి, పచ్చిక ఉన్న పిచ్పై ఆడాం’ అని చెప్పారు.
మాజీ క్రికెటర్ జయసింహ తనకు ఇష్టమైన, ఆదర్శంగా భావించే క్రికెటరని మరో ప్రశ్నకు చెప్పారు. ఆయన బ్యాటింగ్ను ఎంతో ప్రేమిస్తానని, మైదానం ఆయన నడవడిక మరింత నచ్చుతుందని వెల్లడించారు. బాబార్ ఆజామ్ గురించి అడగ్గా ‘అతడో విధ్వంసకర ఆటగాడు. టాప్-5 క్రికెటర్లలో కోహ్లీ, విలియమ్సన్, స్మిత్, వార్నర్తో పాటు అతడినీ ఎంచుకుంటా’ అని సన్నీ తెలిపారు.
ఇవీ చదవండి
రెండో రోజు మెరిసిన భారత్
జడ్డూ రనౌట్కు ఫిదా.. ఫిదా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్
Kohli-DK: బెంగళూరు ఆటగాడు డీకే అడిగిన ప్రశ్నలకు.. కోహ్లీ ఇచ్చిన సమాధానం నెట్టింట వైరల్ అవుతోంది. దినేశ్ కార్తిక్ సతీమణి దీపిక ప్రస్తావన తేవడంతో అతడు ఆశ్చర్యపోయాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..? -
డేవిడ్, పొలార్డ్కు భారీ జరిమానా.. ‘డీఆర్ఎస్ సిగ్నల్’ వివాదమేనా కారణం?
ముంబయి ఆటగాడు, కోచ్పై ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ కొరడా ఝళిపించింది. వారు చేసిన చర్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర నిర్ణయం తీసుకుంది. -
Ravindra Jadeja: గాల్లోకి ఎగిరి.. ఒంటిచేత్తో జడేజా క్యాచ్!
లఖ్నవూతో శుక్రవారం జరిగిన మ్యాచ్లో చెన్నై ఆటగాడు రవీంద్ర జడేజా.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ ఒడిసిపట్టాడు.
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?
అభిమానుల ఊహకు అందనిరీతిలో.. సంచలన ఆటతో ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు అదరగొట్టేస్తోంది. ఇవాళ మరో మ్యాచ్లో తలపడేందుకు సిద్ధమవుతోంది. -
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
ప్రస్తుత సీజన్లో దూకుడుగా ఆడుతున్న క్రికెటర్లలో ధోనీ ముందువరుసలో ఉంటాడు. ఆడేది పది బంతుల్లోపే అయినా ప్రత్యర్థి బౌలర్లకు వణుకు పుట్టిస్తున్నాడు. -
ఆ ముగ్గురిని చూస్తే ముచ్చటేసింది.. రోహిత్ ఈజ్ బ్యాక్: హర్భజన్
పంజాబ్తో జరిగిన మ్యాచ్లో ముంబయి జట్టుకు కాసేపు యాక్టివ్ కెప్టెన్గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
చెరో రూ. 12 లక్షలు కట్టండి.. కెప్టెన్లకు జరిమానా
లఖ్నవూ కెప్టెన్ కేఎల్ రాహుల్, చెన్నై సారథి రుతురాజ్ గైక్వాడ్కు ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ జరిమానా విధించింది. -
ధోనీ ఎంట్రీ ఎఫెక్ట్.. వామ్మో వినికిడి కోల్పోమా..? : లఖ్నవూ స్టార్ వైఫ్
సొంత మైదానంలో లఖ్నవూ విజయం సాధించింది. ఆ జట్టు గెలుపు కంటే మరొక అంశం అభిమానులను ఆకట్టుకుంది. అదే ఎంఎస్ ధోనీ (MS Dhoni) బ్యాటింగ్ వీరవిహారం. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కేఎల్ రాహుల్ కెప్టెన్ ఇన్నింగ్స్.. చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కాదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు