MS Dhoni: ధోనీ నీ ఆటను ఎప్పటికీ మరువం!
మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ టీమ్ఇండియాకు దూరమై అప్పుడే రెండేళ్లు గడిచాయి. 2019 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో ఆడిన సెమీఫైనల్స్ మ్యాచే భారత్ తరఫున అతనాడిన చివరి వన్డే...
ఇంటర్నెట్డెస్క్: మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ టీమ్ఇండియాకు దూరమై అప్పుడే రెండేళ్లు గడిచాయి. 2019 వన్డే ప్రపంచకప్లో న్యూజిలాండ్తో ఆడిన సెమీఫైనల్స్ మ్యాచే భారత్ తరఫున అతనాడిన చివరి వన్డే. ఆ మ్యాచ్లో టీమ్ఇండియా ఓటమిపాలయ్యాక కొద్దికాలం ఆటకు విరామం తీసుకున్న మహీ మరుసటి ఏడాది స్వాతంత్ర్య దినోత్సవం నాడు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే, చివరిసారి అతను టీమ్ఇండియా జెర్సీలో కనిపించి నేటికి సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. అయినా, అభిమానులు ఇంకా ఆ చివరి క్షణాలను మర్చిపోలేకపోతున్నారు.
2019లో జులై 9న భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీఫైనల్స్లో తలపడ్డాయి. మాంచెస్టర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రెండు రోజులు జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 239 పరుగులు చేయగా, అదే ఆరోజు వర్షం కురవడంతో మ్యాచ్ను మరుసటి రోజుకు (రిజర్వ్ డే) తీసుకెళ్లారు. దాంతో జులై 10న మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ఇండియా ఆదిలోనే ఘోరంగా తడబడింది. జట్టు స్కోర్ 5 పరుగులకే టాప్ ఆర్డర్లోని ముగ్గురు బ్యాట్స్మెన్ పెవిలియన్ చేరారు. కేఎల్ రాహుల్ (1), రోహిత్ శర్మ (1), కెప్టెన్ విరాట్ కోహ్లీ (1) పూర్తిగా విఫలమయ్యారు. ఆపై రిషభ్ పంత్ (32), దినేశ్ కార్తీక్ (6), హార్దిక్ పాండ్య (32) సైతం ప్రభావం చూపలేకపోయారు.
ఈ క్రమంలోనే టీమ్ఇండియా 92 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి ఓటమి అంచున నిల్చుంది. ఆ సమయంలో జోడీ కట్టిన రవీంద్ర జడేజా (77; 59 బంతుల్లో 4x4, 4x6), మహేంద్రసింగ్ ధోనీ (50; 72 బంతుల్లో 1x4, 1x6) బాధ్యతాయుతంగా ఆడారు. వీరిద్దరూ ఏడో వికెట్కు 116 పరుగులు జోడించి భారత శిబిరంలో ఆశలు రేపారు. కానీ కీలక సమయంలో ఫామ్లోకొచ్చిన న్యూజిలాండ్ వారిద్దర్నీ స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి మ్యాచ్ను తమవైపు తిప్పుకుంది. బౌల్ట్ బౌలింగ్లో జడేజా భారీ షాట్ ఆడి విలియమ్సన్ చేతికి చిక్కగా, కాసేపటికే ధోనీ రెండు పరుగుల కోసం ప్రయత్నిస్తూ రనౌటయ్యాడు. మార్టిన్ గప్తిల్ దూరం నుంచి డైరెక్ట్ త్రో విసరడంతో మహీ వెనుదిరక తప్పలేదు. దాంతో భారత్ ఓటమి ఖాయమైంది. చివరికి 221 పరుగులకు ఆలౌటవ్వడంతో కోహ్లీసేన 18 పరుగుల తేడాతో ఓటమిపాలై ఇంటిముఖం పట్టింది. అదే ధోనీ కెరీర్లో చివరి అంతర్జాతీయ మ్యాచ్గా నిలిచింది. అభిమానులు ఇంకా ఆ చేదు జ్ఞాపకాలను మరువలేకపోతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
క్రికెటర్లు తాము కొట్టే షాట్.. లేదా తీసే వికెట్ జీవితాంతం మరిచిపోకుండా ఉంటారు. అలాంటి అనుభవం పంజాబ్ బ్యాటర్ అశుతోష్ శర్మకూ ఎదురైంది. -
‘స్పీడ్’ స్టార్లు vs సిక్సర్ల వీరులు... రెండు జట్లలో ‘హ్యాట్రిక్’ ఎవరికి?
ఐపీఎల్ 17వ సీజన్లో ఇవాళ మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమవుతోంది. తన సొంత మైదానంలో లఖ్నవూ జట్టు చెన్నైను ఢీకొట్టనుంది. -
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
‘ఇంపాక్ట్’ ప్లేయర్గా బరిలోకి దిగుతున్న సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) బ్యాటింగ్లో చెలరేగుతున్నాడు. విరామం తర్వాత బ్యాటింగ్లో మునుపటి సూర్యను చూస్తున్నామని అభిమానులు సంబరపడుతున్నారు. -
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
Wrestlers: భారీ వర్షాల కారణంగా దుబాయ్లో చిక్కుకున్న భారత రెజ్లర్లు దీపక్ పునియా, సుజీత్.. ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ దూరమయ్యారు. ఆలస్యంగా రావడంతో వారిని పోటీలకు అనుమతించలేదు. -
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ
-
వైకాపా ప్రచార రథం ఢీకొని బాలుడి మృతి విషాదకరం: చంద్రబాబు
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్