Axar Patel: ఇది నా ‘డ్రీమ్ ఇయర్’.. అయితే నేర్చుకోవాల్సింది ఇంకా ఉంది: అక్షర్ పటేల్
2021 ఏడాదిని తనకు ‘డ్రీమ్ సంవత్సరం’గా అభివర్ణించాడు టీమ్ఇండియా ఆటగాడు...
ఇంటర్నెట్ డెస్క్: 2021 ఏడాదిని తనకు ‘డ్రీమ్ సంవత్సరం’గా అభివర్ణించాడు టీమ్ఇండియా ఆటగాడు అక్షర్ పటేల్. బ్యాటింగ్, బౌలింగ్లో రాణిస్తూ ఆల్రౌండర్గా ఎదుగుతున్నాడు. అయితే దీంతో సంతృప్తి చెందడం లేదని, తన నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తూనే ఉంటానని చెప్పాడు. న్యూజిలాండ్తో రెండో టెస్టులో (52, 41*) బ్యాటింగ్లో, బౌలింగ్లోనూ (2/14, 1/42) రాణించాడు. ఇంగ్లాండ్, కివీస్ వంటి పెద్ద జట్లతో ఆడటం బాగుందని తెలిపాడు. ఎడమ చేతి వాటం ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉండటంతో అక్షర్కు జట్టులోకి వచ్చేందుకు అవకాశం దొరకలేదు. అయితే, ఈ ఏడాది వచ్చిన అవకాశాన్ని అక్షర్ రెండు చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. మొత్తం ఐదు టెస్టుల్లో 36 వికెట్లను పడగొట్టి తన సత్తా చాటాడు. ఇంగ్లాండ్ సిరీస్లో మూడు టెస్టుల్లో 27 వికెట్లను తీశాడు.
‘‘ఈ సంవత్సరం నా డ్రీమ్ ఇయర్. గత ఇంగ్లాండ్ సిరీస్లోనూ కివీస్తో మ్యాచ్ల సందర్భంగా అత్యుత్తమ బౌలింగ్ చేయగలిగా. మధ్యలో ఐపీఎల్లోనూ రాణించాను. వ్యక్తిగతంగా నాకు ఉత్తమ సంవత్సరం. ఇన్నాళ్లు నేను పడిన కష్టానికి ఈ ఏడాది ఫలితం దక్కింది. బ్యాటింగ్ కోచ్, జట్టు మేనేజ్మెంట్ నా బ్యాటింగ్ సామర్థ్యం పట్ల సానుకూల దృక్పథంతో ఉన్నారు. ‘నువ్వు చేయగలవు’ అంటూ నన్ను ప్రోత్సహించారు. గతంలో మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమయ్యేవాడిని. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. నా బ్యాటింగ్ వల్ల జట్టుకు ప్రయోజనం కలిగితే ఎంతో ఆనందంగా ఉంటుంది. జడేజా, అశ్విన్ బ్యాటింగ్, బౌలింగ్లోనూ రాణిస్తూ ఆల్రౌండర్లుగా ఎదిగారు. దీని వల్ల మా బ్యాటర్ల మీద కాస్త ఒత్తిడి తగ్గిస్తుంది. ఇలాగే కొంతకాలం కంట్రిబ్యూట్ చేయగలిగితే వ్యక్తిగతంగా నాకు, జట్టుకు ఉపయోగం’’ అని అక్షర్ పటేల్ వివరించాడు.
న్యూజిలాండ్తో ఆఖరి టెస్టు సందర్భంగా రెండో ఇన్నింగ్స్లో ఇంకొంచెం ముందు డిక్లేర్డ్ చేస్తే బాగుండేదన్న వ్యాఖ్యల మీద అక్షర్ స్పందించాడు. ‘‘డిక్లేర్డ్కు సంబంధించి ఆలస్యం అయిందని నేను అనుకోవడం లేదు. ఇంకా అప్పటికే ఆటకు చాలా సమయం మిగిలి ఉంది. ప్రణాళిక ప్రకారం ఎంత వీలైతే అంతసేపు బ్యాటింగ్ చేయాలని భావించాం. ప్రతి రోజూ మనదే కాదు. అందుకే ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం లేకుండా చేయాలని అనుకున్నాం’’ అని తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
బెంగళూరు - కోల్కతా జట్ల మధ్య ఆసక్తికర పోరు నేడు. ఇరు జట్లలోనూ కీలక ఆటగాళ్లు ఉన్నారు. -
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
బెంగళూరు, కోల్కతా జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో అందరి దృష్టి ఇద్దరి క్రికెటర్లపైనే ఉంది. -
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
కోహ్లీ Vs గంభీర్.. రస్సెల్ Vs సిరాజ్.. రింకు Vs యశ్.. ఆధిపత్యం ఎవరిదో?
-
ఎన్నికల బరిలో రఘురామ కృష్ణరాజు?.. ఎన్డీయే కూటమి నేతల మధ్య చర్చ
-
ప్రేమ వివాహమే చేసుకుంటా: విజయ్ దేవరకొండ
-
కోహ్లీ అటువైపు చూస్తే ఏమవుతుందో..: బెంగళూరు మాజీ క్రికెటర్
-
రివ్యూ: టిల్లు స్క్వేర్.. సిద్ధు, అనుపమ జోడీ మేజిక్ చేసిందా?
-
షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ నుంచి ఐపీఓ.. రూ.7,000 కోట్ల సమీకరణ!