‘అంపైర్ కాల్’ను నిషేధించండి
సమీక్షలో ‘అంపైర్ కాల్’ విధానంపై వ్యతిరేకత పెరుగుతోంది. బాక్సింగ్ డే టెస్టులో అంపైర్ కాల్తో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తప్పించుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంచి బంతులు...
ఇంటర్నెట్డెస్క్: సమీక్షలో ‘అంపైర్ కాల్’ విధానంపై వ్యతిరేకత పెరుగుతోంది. బాక్సింగ్ డే టెస్టులో అంపైర్ కాల్తో ఔట్ అయ్యే ప్రమాదం నుంచి ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ తప్పించుకున్న సంగతి తెలిసిందే. కాగా, మంచి బంతులు వేసినా ఔట్ చేసే అవకాశాల్ని టీమిండియా కోల్పోవడంతో.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ అంపైర్ కాల్ నిబంధనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. సమీక్ష నిబంధనలపై ఐసీసీ పునరాలోచించాలని కోరాడు. తాజాగా మాజీ అంపైర్ డారిల్ హార్పర్ కూడా అంపైర్ కాల్ను తీవ్రంగా తప్పుపట్టాడు. సమీక్షలో దాన్ని నిషేధించాలని అన్నాడు.
‘‘అంపైర్ కాల్పై పూర్తి అవగాహన ఉంది. దాన్ని ఐసీసీ నిషేధించి వివాదాల నుంచి తప్పుకోవాలి. స్టంప్కు తగిలిన ఏ బంతి అయినా బెయిల్స్ను పడగొడుతుంది. గత 12 ఏళ్లుగా ఆటగాళ్లు, అభిమానులకు ఎల్బీ రివ్యూపై గందరగోళ పరిస్థితి ఉంది. సాంకేతిక, అవగాహనలో లోపాలున్నాయని ఇది ఎత్తిచూపుతోంది. అయితే దీనిపై ఐసీసీ దృష్టిసారించి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలి’’ అని హార్పర్ పేర్కొన్నాడు. బాక్సింగ్ డే టెస్టులో థర్డ్ అంపైర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు భారత్ అభిమానులకు నచ్చేలా, మరికొన్ని ఆసీస్ మద్దతుదారులకు నచ్చేలా ఉన్నాయని అన్నాడు.
కాగా, అంపైర్ నిర్ణయంపై అసంతృప్తి చెందితే 15 సెకన్ల లోపు ఆటగాడు/జట్టు సమీక్షకు వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఎల్బీడబ్ల్యూపై వెళ్లిన సమీక్షల్లో వచ్చే ఫలితాలపై ఆటగాళ్లు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీప్లేలో థర్డ్ అంపైర్.. పిచ్చింగ్, ఇంపాక్ట్, వికెట్ అనే మూడు అంశాలను పరిశీలించి ఎల్బీపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తుంటారు.
తొలుత థర్డ్ అంపైర్ బంతి బ్యాట్కు తాకలేదని నిర్ధారణ చేసుకున్న తర్వాత, సరైన లైన్లో బాల్ పడిందా లేదా అనే అంశాన్ని గమనిస్తారు. అనంతరం బంతి వికెట్లను తాకుతూ వెళ్తుందా లేదా అనేది చూస్తారు. ఈ క్రమంలోనే సగం కన్నా ఎక్కువ మొత్తంలో బంతి వికెట్లను తాకనట్లు ఉంటే ‘అంపైర్ కాల్’ నిర్ణయంతో థర్డ్అంపైర్ అంతిమ నిర్ణయాన్ని వెల్లడిస్తుంటారు. అంటే ఫీల్డ్ అంపైర్ నాటౌట్ అని ప్రకటిస్తే.. సమీక్షలో కూడా థర్డ్అంపైర్ నాటౌట్ అని వెల్లడిస్తాడు. ఒకవేళ ఫీల్డ్ అంపైర్ ఔట్ అంటే ఆ నిర్ణయాన్ని ఏకీభవిస్తాడు.
ఇదీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
హైదరాబాద్ చేతిలో భారీ ఓటమితో కుదేలైన దిల్లీకి ఊరటనిచ్చే విజయం దక్కింది. గుజరాత్పై నాలుగు పరుగుల తేడాతో గెలిచింది. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
Shubman Gill: ఈ ఐపీఎల్ సీజన్లో భారీ స్కోర్లు నమోదవుతున్న విషయం తెలిసిందే. దీనికి ఓ కారణం ఉందని శుభ్మన్ గిల్ తెలిపాడు. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘యానిమల్’ టూ ‘రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ