Ravindra Jadeja: జడ్డూ ఖాతాలో అరుదైన రికార్డు.. దిగ్గజాల సరసన టాప్ ఆల్రౌండర్
టీమ్ఇండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టేస్తున్నాడు. ఈ క్రమంలో క్రికెట్ దిగ్గజాల సరసన జాబితాలో చేరిపోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇందౌర్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్లో (IND vs AUS) ఆస్ట్రేలియా ఆధిక్యంలోకి దూసుకెళ్లగా.. ఒకే ఒక్క బౌలర్ మాత్రం అడ్డుగా నిలిచాడు. కీలకమైన నాలుగు ఆసీస్ వికెట్లను తీసి భారత్ పరువును నిలిపాడు. అతడే టీమ్ఇండియా టాప్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja). శస్త్రచికిత్స చేయించుకొని విశ్రాంతి అనంతరం జట్టులోకి తిరిగొచ్చిన జడ్డూ (Jaddu) చెలరేగిపోతున్నాడు. తాజాగా మూడో టెస్టులోనూ మిగతా బౌలర్లు వికెట్లు తీయనప్పటికీ.. భారత్ తరఫున నాలుగు వికెట్లు తీసి అదరహో అనిపించాడు. ఇదే క్రమంలో రవీంద్ర జడేజా అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్లో 500 వికెట్లు, 5వేలకుపైగా పరుగులు సాధించిన రెండో భారతీయ ఆటగాడిగా (Team India) అవతరించాడు. ఆసీస్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ను (Travis Head) ఔట్ చేయడంతో అన్ని ఫార్మాట్లలో కలిపి అంతర్జాతీయంగా 500వ వికెట్ తీసినట్లైంది. ఇప్పటి వరకు 298 మ్యాచుల్లోని 241 ఇన్నింగ్స్ల్లో 503 వికెట్లతో కొనసాగుతున్న జడేజా.. మూడు సెంచరీలు, 31 అర్ధశతకాల సాయంతో 5,527 పరుగులు సాధించాడు. ప్రస్తుతం టెస్టు సిరీస్లోనూ కీలకమైన పరుగులతోపాటు కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు.
గతంలో భారత్ తరఫున క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ (Kapil Dev) మాత్రమే ఈ ఘనతను అందుకొన్నాడు. కపిల్ దేవ్ 356 మ్యాచుల్లో 687 వికెట్లు, 9వేలకుపైగా పరుగులు సాధించాడు. ఇక అంతర్జాతీయంగా పాక్ మాజీలు వసీమ్ అక్రమ్, ఇమ్రాన్ ఖాన్, షాహిద్ అఫ్రిది, బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు షకిబ్ అల్ హసన్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ బోథమ్, దక్షిణాఫ్రికా మాజీలు షాన్ పొలాక్, జాక్వెస్ క్లిస్, శ్రీలంక మాజీ పేసర్ చమిందా వాస్ మాత్రమే 500 వికెట్లు, 5వేల పరుగుల క్లబ్లో ఉన్నారు.
విరాట్తో సమంగా ఉమేశ్..
టీమ్ఇండియా పేసర్ ఉమేశ్ యాదవ్ కూడా తన ఖాతాలో ఓ రికార్డును వేసుకొన్నాడు. అదీనూ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని సమం చేయగా.. మాజీ కోచ్ రవిశాస్త్రిని అధిగమించడం విశేషం. ఆసీస్తో మూడో టెస్టులో ఉమేశ్ రెండు సిక్స్లు బాదాడు. దీంతో టెస్టు కెరీర్లో 24 సిక్స్లు కొట్టిన బ్యాటర్గా మారాడు. ఈ క్రమంలో అత్యధిక సిక్స్లు కొట్టిన 17వ బ్యాటర్గా అవతరించాడు. విరాట్ కూడా 24 సిక్స్లు కొట్టగా.. రవిశాస్త్రి 22 సిక్స్లు సాధించాడు. భారత్ తరఫున అత్యధికంగా వీరేంద్ర సెహ్వాగ్ (91) పేరిట ఉంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ (78), సచిన్ (69), రోహిత్ (68), కపిల్ దేవ్ (61) టాప్ -5లో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,400 పైన నిఫ్టీ
-
మానేరు వాగుపై కూలిన నిర్మాణంలోని వంతెన
-
సస్పెన్షన్కు గురైన సబ్రిజిస్ట్రార్ ఇంట్లో అనిశా తనిఖీలు.. రూ. 10 కోట్ల ఆస్తుల గుర్తింపు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
విజయవాడ తూర్పులో వైకాపాకు షాక్.. తెదేపా గూటికి ఎంవీఆర్ చౌదరి