Bumrah - Rana: టీ20 లీగ్ నియమావళి ఉల్లంఘించిన నితీశ్ రానా, జస్ప్రిత్ బుమ్రా
పుణె వేదికగా గతరాత్రి ముంబయి, కోల్కతా తలపడిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా, నితీశ్ రాణా లీగ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు....
(Photo: Jasprit Bumrah Instagram)
ఇంటర్నెట్డెస్క్: పుణె వేదికగా గతరాత్రి ముంబయి, కోల్కతా తలపడిన మ్యాచ్లో ఇరు జట్ల ఆటగాళ్లు జస్ప్రిత్ బుమ్రా, నితీశ్ రాణా లీగ్ ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించారు. దీంతో కోల్కతా బ్యాట్స్మన్ రానాకు మ్యాచ్ ఫీజులో పది శాతం కోత విధించడంతో పాటు హెచ్చరించి వదిలేశారు. మరోవైపు ముంబయి పేసర్ బుమ్రాను కేవలం హెచ్చరించారు. ఈ విషయాన్ని టోర్నీ నిర్వాహకులు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, వీరిద్దరూ ఏ నేరం చేశారన్నది మాత్రం వారు వెల్లడించలేదు. మరోవైపు ఈ ఇద్దరు ఆటగాళ్లు తమ నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేశారు.
(Photo: Nitish Rana Instagram)
కాగా, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి నాలుగు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. సూర్యకుమార్ (52; 36 బంతుల్లో 5x4, 2x6), తిలక్ వర్మ (38 నాటౌట్; 27 బంతుల్లో 3x4, 2x6), పొలార్డ్ (22; 5 బంతుల్లో 3x6) దంచికొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన కోల్కతా 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్ (50; 41 బంతుల్లో 6x4, 1x6) అర్ధ శతకానికి తోడు ప్యాట్ కమిన్స్ (56 నాటౌట్; 15 బంతుల్లో 4x4, 6x6) చెలరేగడంతో కోల్కతా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
ఏక్నా స్టేడియంలోని నెమ్మదైన పిచ్పై స్కోరు 160 దాటిందంటే ఛేదన కష్టమే. ఓ దశలో చెన్నై 150 అయినా చేస్తుందా అనుకుంటే.. గత మ్యాచ్లో ముంబయిపై చెలరేగినట్లే మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్లోనూ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడడంతో చెన్నై స్కోరు 176కు చేరుకుంది. -
ధోని.. ఇంకా నాటౌటే
చివరి సీజన్గా భావిస్తున్న ఈ ఐపీఎల్లో బ్యాటింగ్ చేస్తోంది తక్కువసేపే అయినా అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాడు ధోని. -
కుర్రాళ్లు కుమ్మేస్తున్నారు
ఛేదనలో నాలుగైదు వికెట్లు పడ్డాయా? అయినా భయం లేదు తామున్నామంటూ సత్తాచాటుతున్నారు. -
బుమ్రా బౌలింగ్లో స్వీప్ షాట్.. నా కల!
అశుతోష్ శర్మ.. ఈ ఐపీఎల్లో గట్టిగా వినిపిస్తున్న కొత్త పేరు. -
రేసులో గుకేశ్ ఒక్కడే..
క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్లో భారత యువ కెరటం గుకేశ్ మళ్లీ ఆధిక్యంలోకి వచ్చాడు. -
మెరిసిన ఇషా, భవేష్
ఒలింపిక్స్ సెలెక్షన్ ట్రయల్స్లో అగ్రశ్రేణి షూటర్లు ఇషా సింగ్, భవేష్ షెకావత్ మెరిశారు. -
దీపకు నాలుగో స్థానం
దోహాలో జరిగిన జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ను భారత స్టార్ దీప కర్మాకర్ నాలుగో స్థానంతో ముగించింది. -
భారత రెజ్లర్లు విఫలం
ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో భారత పురుష రెజ్లర్లు విఫలమయ్యారు. -
విమానం ఆలస్యమై...
భారత ఉత్తమ రెజ్లర్లలో ఇద్దరైన దీపక్ పునియా (86 కేజీలు), సుజీత్ కలాకల్ (65 కేజీలు)కు నిరాశ తప్పలేదు. -
రాకెట్ వదిలేద్దాం అనుకున్నా
గత కొన్నేళ్లలో కెరీర్లో ఎంతో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నానని.. ఒకటికి రెండుసార్లు బ్యాడ్మింటన్కు వీడ్కోలు చెప్పాలని భావించానని భారత డబుల్స్ స్టార్ అశ్విని పొన్నప్ప తెలిపింది. -
చెరువుల సంరక్షణ కోసం ఆర్సీబీ
ఐపీఎల్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం