Jasprit Bumrah: సర్జరీ తర్వాత ముంబయి ఇండియన్స్ ఆటగాళ్లతో జస్ప్రీత్ బుమ్రా సందడి
ఇటీవల వెన్ను గాయానికి సర్జరీ చేయించుకున్న జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) ముంబయిలో జరిగిన డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ని స్టేడియానికి వచ్చి వీక్షించాడు.
(photo: mumbai indians instagram)
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా అగ్రశ్రేణి ఫాస్ట్బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) గత కొంతకాలం నుంచి వెన్ను గాయంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఈ గాయం నుంచి పూర్తిగా బయటపడాలంటే శస్త్రచికిత్స నిర్వహించాలని వైద్యులు సూచించారు. దీంతో బుమ్రాకు ఇటీవల న్యూజిలాండ్లో నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతమైంది. ప్రస్తుతం అతడు కోలుకుంటున్నాడు. దీంతో మార్చి 31 నుంచి ప్రారంభంకానున్న ఐపీఎల్-16 (IPL 16) సీజన్కు అతడు పూర్తిగా దూరమయ్యాడు. అయితే, చాలాకాలంగా బయటకు రాని అతడు.. డబ్ల్యూపీఎల్ (WPL) ఫైనల్ మ్యాచ్ని వీక్షించేందుకు ముంబయికి వచ్చాడు.
డబ్ల్యూపీఎల్ ఫైనల్లో దిల్లీ క్యాపిటల్స్తో తలపడిన ముంబయి ఇండియన్స్ను ఉత్సాహపరిచేందుకు అతడు మ్యాచ్కు హాజరయ్యాడు. బుమ్రా లేని లోటును భర్తీ చేయనున్న స్టార్ పేసర్ జోఫ్రా అర్చర్ (Jofra Archer)తో కొద్దిసేపు ముచ్చటించాడు. వీరిద్దరూ మాట్లాడుకుంటున్న వీడియోని ముంబయి ఇండియన్స్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకుంది. ఈ వీడియోని చూసిన అభిమానులు బుమ్రా కూడా ఈ సీజన్లో ఆడాలని ఆకాంక్షిస్తూ కామెంట్లు పెడుతున్నారు. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్లతోపాటు ముంబయి ఇండియన్స్కు చెందిన దాదాపు అందరూ ఆటగాళ్లు డబ్ల్యూపీఎల్ ఫైనల్ మ్యాచ్ను స్టేడియానికి వచ్చి వీక్షించారు. ముంబయి మెంటార్ సచిన్ తెందూల్కర్ కూడా సందడి చేశాడు. కాసేపు కీరన్ పొలార్డ్తో ప్రత్యేకంగా ముచ్చటించాడు. WPL ఫైనల్లో దిల్లీపై ముంబయి ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి టైటిల్ని ఎగరేసుకుపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ గట్టెక్కింది
ఐపీఎల్-17లో తడబడుతూ సాగుతున్న దిల్లీ క్యాపిటల్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలు సన్నగిల్లుతున్న సమయంలో ఓ కీలక విజయం సాధించింది. బుధవారం ఆ జట్టు గుజరాత్ టైటాన్స్ను 4 పరుగుల స్వల్ప తేడాతో ఓడించింది. -
మోహిత్.. చెత్త రికార్డు
గుజరాత్ టైటాన్స్ పేసర్ మోహిత్ శర్మ చెత్త రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. ఓ ఐపీఎల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్గా అతను రికార్డులకెక్కాడు. -
పొట్టి కప్పులో ఎవరు?
వెస్టిండీస్, అమెరికా ఉమ్మడిగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ కోసం 15 మంది జట్టుతో పాటు అయిదుగురు రిజర్వ్ ఆటగాళ్లనూ ప్రకటించేందుకు బీసీసీఐ సెలక్షన్ కమిటీ కసరత్తులు చేస్తోంది. -
300 కొట్టేస్తారా?
ఈ సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ నమోదు చేసిన రికార్డులివీ. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్లతో రికార్డులు తిరగరాస్తున్న సన్రైజర్స్ పొట్టి లీగ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..
చెస్ మేటి మాగ్నస్ కార్ల్సన్ ఇటీవల ఓ కొత్త సవాలును స్వీకరించాడు. సత్యశోధన పరీక్ష (లై డిటెక్టర్ టెస్ట్)లో తన చెస్ కెరీర్, వ్యక్తిగత జీవితంపై అనేక ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. -
ఫైనల్లో జ్యోతి జట్టు
ఆర్చరీ ప్రపంచకప్లో భారత ఆర్చర్ల దూకుడు కొనసాగుతోంది. విజయవాడ అమ్మాయి జ్యోతి సురేఖ జట్టు కాంపౌడ్ మహిళల విభాగంలో ఫైనల్లో అడుగుపెట్టింది. -
దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. -
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
T20 Worldcup 2024 - BCCI: వచ్చే టీ20 ప్రపంచకప్ కోసం ఏ 15 మందిని ఎంపిక చేస్తే బాగుంటుంది. -
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
ఐపీఎల్లో ఫినిషర్గా అదరగొడుతున్న ఎంఎస్ ధోనీ (MS Dhoni)ని టీ20 వరల్డ్కప్నకు ఎంపిక చేయాలనే ఆలోచనను పలువురు మాజీలు కోరుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!