Jasprit Bumrah: చాలా విమర్శలొస్తాయి.. అయినా పట్టించుకోను: బుమ్రా
బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని ముంబయి పేసర్ జస్ప్రిత్ బుమ్రా అన్నాడు. గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో...
ఇంటర్నెట్డెస్క్: బయటి నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోనని ముంబయి పేసర్ జస్ప్రిత్ బుమ్రా అన్నాడు. గతరాత్రి కోల్కతాతో జరిగిన మ్యాచ్లో (10/5) అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన అతడు.. కోల్కతాను 165/9 స్కోరుకే కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ కమ్రంలోనే ఈ లీగ్లో తొలిసారి 5 వికెట్ల ప్రదర్శన చేశాడు. అలాగే ఈ టోర్నీ మొత్తంలో ఐదో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన బౌలర్గానూ నిలిచాడు. దీంతో ఇప్పుడు అందరి చేతా ప్రశంసలు పొందుతున్నాడు.
కాగా, ఈ మ్యాచ్కు ముందు బుమ్రా ఈ సీజన్లో 10 మ్యాచ్లు ఆడి కేవలం 5 వికెట్లే తీశాడు. దీంతో అతడిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. సరిగ్గా బౌలింగ్ చేయట్లేదని, తన స్థాయికి తగిన ప్రదర్శన చేయట్లేదనే మాటలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజా ప్రదర్శన అనంతరం మీడియాతో మాట్లాడిన బుమ్రా ఇలా స్పందించాడు. ‘మేం ఎలా సన్నద్ధమవ్వాలో కచ్చితమైన ప్రణాళికలు మాకున్నాయి. మాకు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది ఆలోచించం. మా పని మేం చేసామా లేదా అనేదే పరిగణనలోకి తీసుకుంటాం. మీరు ఆటను అర్థం చేసుకుంటే.. అక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. ఆట ఎలా సాగుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నాయి. బౌలింగ్ ఎలా చేస్తున్నామనే విషయాలు అర్థమవుతాయి. ఇక వ్యక్తిగతంగా నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా’ అని బుమ్రా చెప్పుకొచ్చాడు.
‘బయట నుంచి చాలా విమర్శలొస్తాయనే సంగతి నాకూ తెలుసు. అవేమీ నన్ను ఇబ్బంది పెట్టవు. ఎందుకంటే నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు.. నిపుణులు ఏం చెప్తున్నారు.. అనే విషయాలను బట్టి నా పనితీరును అంచనా వేసుకునే వ్యక్తిని కాదు. వాటిని అస్సలు పట్టించుకోను. నాకు నా వ్యక్తిగత ప్రదర్శనే ముఖ్యం. అందుకు నన్ను నేనే ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటా. నా ప్రణాళికల పరంగా సన్నద్ధమవుతున్నానా లేదా అనే విషయాలనే ఆలోచిస్తా. వీలైనంత మేర జట్టుకు ఎలా ఉపయోగపడలనే కోరుకుంటా. నేను ఇలాగే ఆడతా. ఎప్పటికీ ఇలాగే కొనసాగుతా’ అని బుమ్రా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
పంజాబ్పై ముంబయి విజయం సాధించడంలో బుమ్రా కీలక పాత్ర పోషించాడు. తన తొలి ఓవర్లోనే రెండు వికెట్లను పడగొట్టి ముంబయి పైచేయి సాధించేలా చేశాడు. -
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
ఎట్టకేలకు ముంబయి మళ్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్పై కేవలం 9 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
ఇంపాక్ట్ ప్లేయర్తో నష్టమే
ఐపీఎల్ గతేడాది ప్రవేశ పెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ విధానం కారణంగా ఆల్రౌండర్లకు నష్టం కలుగుతోందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. -
ఆల్రౌండర్లకు దెబ్బ
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ చెప్పినట్లు ఐపీఎల్లో ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన భారత ఆల్రౌండర్లకు చేటు చేస్తోంది. టీ20 ప్రపంచకప్లో తలపడే టీమ్ఇండియా ఎంపిక కోసం ఐపీఎల్ ప్రదర్శన కూడా పరిగణలోకి తీసుకుంటారనే చెప్పాలి. -
ప్చ్.. పంజాబ్
13 బంతులు.. 14 పరుగులు.. 4 వికెట్లు! 193 పరుగుల ఛేదనలో పంజాబ్ పరిస్థితిది! బుమ్రా లాంటి మేటి బౌలర్.. బెంబేలెత్తిస్తున్న నేపథ్యంలో ఆ జట్టు కనీసం పోటీలో ఉన్నట్లు కూడా కనపడలేదు. ముంబయి విజయం లాంఛనమేనని తీర్మానించారంతా! కానీ అశుతోష్ శర్మ అసాధారణ బ్యాటింగ్తో పంజాబ్ అద్భుతం చేసినంత పని చేసింది. -
అశుతోష్.. నయా మెరుపు
గుజరాత్తో పంజాబ్ మ్యాచ్.. లక్ష్యం 200.. 150కే 6 వికెట్లు పడిపోయాయి.. ఉన్న ఓవర్లు కూడా తక్కువే! అయినా చివరికి పంజాబ్ గెలిచింది! -
చమరి 195 నాటౌట్
మహిళల క్రికెట్లో శ్రీలంక నయా రికార్డు సృష్టించింది. చమరి ఆటపట్టు (195 నాటౌట్; 139 బంతుల్లో 26×4, 5×6) భారీ శతకంతో అదరగొట్టడంతో దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో 302 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. -
ఇషా సత్తా చాటేనా!
హైదరాబాదీ షూటర్ ఇషా సింగ్కు సవాల్. పారిస్ ఒలింపిక్స్ టికెట్ కోసం ఆమె పోటీకి సిద్ధమైంది. శుక్రవారం కర్ణిసింగ్ రేంజ్లో ఆరంభమయ్యే సెలక్షన్ ట్రయల్స్లో మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో ఇషా బరిలో దిగనుంది. -
కళ్లన్నీ వినేశ్ పైనే
పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాల వేటకు భారత రెజ్లర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం ప్రారంభమయ్యే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్లో అత్యుత్తమ ప్రదర్శనే లక్ష్యంగా బరిలో దిగుతున్నారు. -
నదిలో నాలుగు గంటలు
ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిగా ఈ మెగా క్రీడల ఆరంభోత్సవ వేడుకలను ఆరుబయట నిర్వహించేందుకు పారిస్ సిద్ధమవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
-
పవర్ప్లేలో రెండు ఓవర్లు వేస్తేనే..: జస్ప్రీత్ బుమ్రా
-
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
-
రివ్యూ: పారిజాత పర్వం.. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్